Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IND vs ENG: టీమిండియా ఓటమి.. విరాట్‌ కోహ్లీ ఉండుంటేనా..? గిల్‌తో కంప్యార్‌ చేస్తూ మాజీ క్రికెటర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

25 June 2025

Tenali Woman Donated Gold Bangles,చేతి బంగారు గాజులు తీసి చంద్రబాబుకు ఇచ్చేసిన మహిళ.. ఆసక్తికర సన్నివేశం – tenali woman donated gold bangles and money to ap cm chandrababu naidu

25 June 2025

Rain Alert: ఉరుములు, మెరుపులతో అల్లకల్లోలం.. నేడు, రేపు జర భద్రం!

25 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Telugu Major Malla Rama Gopal Naidu Kirti Chakra,దేశ రక్షణలో ప్రాణాలకు తెగించి సాహసం.. చరిత్రలో తొలిసారి తెలుగోడికి ‘కీర్తి చక్ర’.. సెల్యూట్ మేజర్ నాయుడు – kirti chakra awarded to major malla rama gopal naidu from srikakulam district andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Telugu Major Malla Rama Gopal Naidu Kirti Chakra,దేశ రక్షణలో ప్రాణాలకు తెగించి సాహసం.. చరిత్రలో తొలిసారి తెలుగోడికి ‘కీర్తి చక్ర’.. సెల్యూట్ మేజర్ నాయుడు – kirti chakra awarded to major malla rama gopal naidu from srikakulam district andhra pradesh

.By .24 May 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Telugu Major Malla Rama Gopal Naidu Kirti Chakra,దేశ రక్షణలో ప్రాణాలకు తెగించి సాహసం.. చరిత్రలో తొలిసారి తెలుగోడికి ‘కీర్తి చక్ర’.. సెల్యూట్ మేజర్ నాయుడు – kirti chakra awarded to major malla rama gopal naidu from srikakulam district andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Major Malla Rama Gopal Naidu Kirti Chakra Award: తెలుగు ఆర్మీ మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడు సాహసానికి దేశం ఫిదా అయింది. 77 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఆయన కీర్తి చక్ర అందుకున్న తొలి తెలుగు వ్యక్తిగా నిలిచారు. జమ్మూలో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టి దేశానికి కాపాడిన రాంగోపాల్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారంతో సత్కరించారు. ఇంతకీ 2023లో ఏం జరిగింది? రాంగోపాల్ ఎలా పోరాడారు?

 మేజర్ రాంగోపాల్ నాయుడికి అవార్డు
మేజర్ రాంగోపాల్ నాయుడికి అవార్డు (ఫోటోలు– Samayam Telugu)

తెలుగు ఆర్మీ మేజర్ చేసిన సాహసం యావత్ దేశం కీర్తిస్తోంది.. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో తెలుగు ఆర్మీ మేజర్ శౌర్య పురస్కారం అందుకున్న ఏకైక వ్యక్తిగా ప్రశంసలు అందుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కీర్తి చక్ర అందుకున్న మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు.. ఆయనే మన సిక్కోలు ముద్ద బిడ్డ, మన తెలుగువాడు మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడు. మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడు దేశం కోసం చేసిన సాహసానికి గుర్తింపు లభించింది.. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన గ్యాలంట్రీ అవార్డుల ప్రదానోత్సవంలో మేజర్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తిచక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. 2023 అక్టోబరు 26న జమ్మూలోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులను ఎదుర్కొన్న సాహసానికి ఈ పురస్కారం లభించింది. రాంగోపాల్ నాయుడు తన ప్రాణాలను లెక్కచేయకుండా ముగ్గుర ఉగ్రవాదుల్ని కాల్చి చంపారు.

కీర్తి చక్ర పురస్కారం అందుకున్న రాంగోపాల్ నాయుడును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. రాంగోపాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో చంద్రబాబును కలిశారు. జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపిన రాంగోపాల్ సాహసాన్ని చంద్రబాబు కొనియాడారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా రాంగోపాల్ నాయుడును అభినందించారు. పురస్కార ప్రదానోత్సవానికి హాజరైన రాంగోపాల్ ను కేంద్ర మంత్రి తన ఇంటికి పిలిచి సత్కరించారు.

2023లో ఏం జరిగింది?

2023 అక్టోబరు 2 ఉదయం 10 గంటల సమయంలో.. జమ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు మాటు వేశారని మన సైన్యానికి సమాచారం అందింది. వెంటనే మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడు నేతృత్వంలో మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ, 56వ బెటాలియన్, రాష్ట్రీయ రైఫిల్స్ సైనికులు రంగంలోకి దిగారు. కుప్వారాలో మాటువేసిన ఐదుగురు ఉగ్రవాదులను గుర్తించి వారిపై దాడి చేశారు. కాల్పులు, ఎదురు కాల్పులతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. రాంగోపాల్ ఒక ఉగ్రవాదిని చంపి, మరొకరిని గాయపరిచారు. ఆ పక్కనే గుహలో దాక్కున్న ఉగ్రవాదులు భారత సైన్యంపై దాడి చేయడానికి ప్రయత్నించారు. దీన్ని గమనించిన రాంగోపాల్ నాయుడు తన ప్రాణాలను లెక్కచేయకుండా సైన్యాన్ని కాపాడి గుహ వైపు పరిగెత్తారు.

అక్కడ దాక్కున్న ఉగ్రవాదులను అంతమొందించే ప్రయత్నం చేశారు. ఒక ఉగ్రవాది గ్రెనేడ్ విసిరినా.. ఆయన మాత్రం తప్పించుకుని పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో అతడిని కాల్చి చంపారు. రాంగోపాల్ ముగ్గురు ఉగ్రవాదులను చంపగా.. ఆయన టీమ్ మిగిలిన వారిని మట్టుబెట్టి కుప్వారాలో ఆట కట్టించారు. దేశానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని తప్పించారు. మేజర్ రాంగోపాల్ నాయుడు వ్యూహాత్మక ఆలోచన, ధైర్యసాహసాలతో దళాలను కాపాడినందుకు ఆర్మీ అధికారులు కీర్తిచక్ర పురస్కారానికి సిఫార్సు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డుకు ఆమోదం తెలిపారు.

రాంగోపాల్ నాయుడు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నగిరిపెంట.. ఆయన తండ్రి అప్పలనాయుడు రైతు, తల్లి గృహిణి. చిన్నప్పటి నుంచి దేశానికి సేవ చేయాలని, సైన్యంలో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విజయనగరం జిల్లా కోరుకొండలోని సైనిక స్కూల్ లో చదివారు.. 2012లో NDA (నేషనల్ డిఫెన్స్ అకాడమీ) కు ఎంపికయ్యారు. 2016లో డెహ్రాడూన్ లోని IMA నుండి పట్టభద్రుడయ్యారు.. అక్కడ బంగారు పతకం సాధించారు. ఆ తరువాత లెఫ్టినెంట్‌గా చేరి 2022 నాటికి మేజర్ అయ్యారు.

దేశ రక్షణలో ప్రాణాలకు తెగించి సాహసం.. చరిత్రలో తొలిసారి తెలుగోడికి ‘కీర్తి చక్ర’.. సెల్యూట్ మేజర్ నాయుడు

ఇటీవల భారత్ పాకిస్థాన్ మధ్య సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. అయితే పాక్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోయారు.. ఆయన కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. మురళీ నాయక్ చేసిన త్యాగాన్ని ప్రతి ఒక్కరూ తలచుకున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tenali Woman Donated Gold Bangles,చేతి బంగారు గాజులు తీసి చంద్రబాబుకు ఇచ్చేసిన మహిళ.. ఆసక్తికర సన్నివేశం – tenali woman donated gold bangles and money to ap cm chandrababu naidu

25 June 2025

AP Govt Gives Permission To Building For One Rupee,ఏపీలో పేదలకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు, జస్ట్ రూపాయి కడితే చాలు! – andhra pradesh government on building rules 2025 and poor people house construction permission for one rupee

25 June 2025

Devineni Uma Maheswara Rao To Join In Ysrcp,వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి.. ఇదేం ట్విస్ట్, ఓహో అసలు సంగతి ఇదా! – tdp leader devineni uma maheswara rao gives clarity on join in ysrcp

25 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

IND vs ENG: టీమిండియా ఓటమి.. విరాట్‌ కోహ్లీ ఉండుంటేనా..? గిల్‌తో కంప్యార్‌ చేస్తూ మాజీ క్రికెటర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

25 June 2025

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. టెండూల్కర్‌ అండర్సన్‌ ట్రోఫీ 2025లో భాగంగా లీడ్స్‌ వేదికగా…

Tenali Woman Donated Gold Bangles,చేతి బంగారు గాజులు తీసి చంద్రబాబుకు ఇచ్చేసిన మహిళ.. ఆసక్తికర సన్నివేశం – tenali woman donated gold bangles and money to ap cm chandrababu naidu

25 June 2025

Rain Alert: ఉరుములు, మెరుపులతో అల్లకల్లోలం.. నేడు, రేపు జర భద్రం!

25 June 2025

Gold Rate Today: అలర్ట్.. దిగివస్తున్న బంగారం ధరలు..! తులం ధర ఎంతుందంటే..

25 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

IND vs ENG: టీమిండియా ఓటమి.. విరాట్‌ కోహ్లీ ఉండుంటేనా..? గిల్‌తో కంప్యార్‌ చేస్తూ మాజీ క్రికెటర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

25 June 2025

Tenali Woman Donated Gold Bangles,చేతి బంగారు గాజులు తీసి చంద్రబాబుకు ఇచ్చేసిన మహిళ.. ఆసక్తికర సన్నివేశం – tenali woman donated gold bangles and money to ap cm chandrababu naidu

25 June 2025

Rain Alert: ఉరుములు, మెరుపులతో అల్లకల్లోలం.. నేడు, రేపు జర భద్రం!

25 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.