Andhra Pradesh Nri Population: ఆంధ్రప్రదేశ్ నుండి ఉద్యోగం, చదువు కోసం విదేశాలకు వెళ్లిన వారి లెక్క తేలింది! గ్రామ, వార్డు సచివాలయాల శాఖ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఏ జిల్లా నుండి ఎంతమంది ప్రవాసాంధ్రులు ఉన్నారో తెలిసింది. గల్ఫ్ దేశాలకు వెళ్లినవారే ఎక్కువగా ఉన్నారని అంచనా వేస్తున్నారు. సంక్షేమ పథకాల కోసం ఈ సర్వే ఉపయోగపడుతుందట. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కింది వివరాలు చదవండి!
హైలైట్:
- ఏపీలో ఎన్ఆర్ఐల లెక్క తేలిపోయింది
- గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సర్వే
- రాయలసీమ జిల్లా రాష్ట్రంలోనే టాప్

అన్నమయ్య జిల్లాలో ఎక్కువ మంది ప్రవాసాంధ్రులు ఉన్నారు.. ఆ జిల్లాలో 17,980 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరంతా గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లి ఉంటారని భావిస్తు్న్నారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరిలో 15,471 మంది, డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 15,378 మంది ప్రవాసాంధ్రులు ఉన్నారు. వీరంతా పని కోసం వెళ్లినవారని అంచనా వేస్తున్నారు. ప్రవాసాంధ్రులకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు అలాంటివారు ఎంతమంది ఉన్నారో తేల్చాలన్న ప్రవాసాంధ్రుల తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీ) విజ్ఞప్తిపై సచివాలయాల శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల ఇంటింటి సర్వే చేయించింది.
అన్నమయ్య జిల్లాలో 17,980, పశ్చిమగోదావరి జిల్లాలో 15,471, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 15,378, శ్రీకాకుళం జిల్లాలో 9,838, విశాఖపట్నం జిల్లాలో 8,892, ఎన్టీఆర్ జిల్లాలో 8,224, కడప జిల్లాలో 7,925, చిత్తూరు జిల్లాలో 7,635, గుంటూరు జిల్లాలో 7,547, ప్రకాశం జిల్లాలో 7,063, తిరుపతి జిల్లాలో 6,673, కృష్ణా జిల్లాలో 6,370, నెల్లూరు జిల్లాలో 5,926, బాపట్ల జిల్లాలో 5,248, కాకినాడ జిల్లాలో 4,869, ఏలూరు జిల్లాలో 4,578, అనంతపురం జిల్లాలో 4,571, కర్నూలు జిల్లాలో, 4,514, తూర్పుగోదావరి జిల్లాలో 4,236, పల్నాడు జిల్లాలో 4,054, శ్రీసత్యసాయి జిల్లాలో 3,693, నంద్యాల జిల్లాలో 3,668, అనకాపల్లి జిల్లాలో 2,670, విజయనగరం జిల్లాలో 1,919, పార్వతీపురం జిల్లాలో 995, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 572మంది ఉన్నారు. ఆసక్తికరంగా ఏపీ నుంచి విదేశాలకు వెళ్లిన వారిలో ఎక్కువమంది గల్ఫ్ దేశాలకు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గోదావరి జిల్లాలతో పాటుగా రాయలసీమలోని అన్నమయ్య జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉండటంతో.. అక్కడి నుంచి ఎక్కువమంది గల్ఫ్ దేశాలకు వెళ్లినట్లు భావిస్తున్నారు.
ఏపీలో NRIలు ఎంతమంది ఉన్నారో తెలుసా.. లెక్క తేలింది, ఆశ్చర్యంగా ఆ రాయలసీమ జిల్లా టాప్లో
ఏపీలో మరో రెండు కొత్త యూనివర్శిటీలను ఏర్పాటు చేయబోతన్నారు.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు.. కర్ణాటక నుంచి ఆ ప్రాజెక్టును తరలిస్తారా అనే చర్చ జరుగుతోంది. ఏపీలో రేషన్ పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.