1989లో నాగార్జున హీరోగా నటించిన గీతాంజలి తర్వాత మళ్ళీ తెలుగులో సినిమా చేయలేదు మణి. ఆయన డబ్బింగ్ సినిమాల్లో తెలుగులో మ్యాజిక్ చేశారు.
గీతాంజలి తర్వాత ఎంతోమంది హీరోలు ఆఫర్ ఇచ్చిన ఆయన మాత్రం హిందీ తమిళానికే పరిమితమయ్యారు. పొన్నియన్ సెల్వన్ తో ఫామ్ లోకి వచ్చిన మణిరత్నం ప్రస్తుతం తగ్ లైఫ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా జూన్ ఐదున విడుదల కానుంది.
కమల్ హాసన్ తో నాయకుడు తర్వాత మణి చేస్తున్న సినిమా ఇది. సినిమా మరో హీరోగా నటిస్తున్నారు. గ్యాంగ్ స్టార్ డ్రామాగా తగ్ లైఫ్ వస్తుంది. త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత ఒక తెలుగు హీరోతో పనిచేయబోతున్నారు మణిరత్నం. జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టితో మణిరత్నం ఒక లవ్ స్టోరీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం 36 ఏళ్ల తర్వాత మణిరత్నం చేయబోయే తెలుగు సినిమా ఇదే అవుతుంది.
నాని లాంటి హీరోలు జీవితకాలంగా మణిరత్నంతో పనిచేయాలని చూస్తున్నారు. అలా చూస్తే నవీన్ పోలిశెట్టికి ఇది బంపర్ ఆఫర్ ఏ. మరి చూడాలి ఇంకా ఏం జరగబోతుందో.