
ఏపీలోని ప్రముఖంగా సందర్శించే ప్రాంతాల్లో కడప జిల్లా గండికోట ఉంది. ఇక్కడికి ఏపీతో పాటుగా తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక నుంచి సందర్శకులు వస్తుంటారు. ముఖ్యంగా వీకెండ్లో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. చుట్టూ కొండలు.. పెన్నా నది అందాలు చూసి సందర్శకులు ఫిదా అవుతారు. అయితే సాయంత్రం చీకటపడితే చాలు అక్కడ గుడారాలు వెలుస్తున్నాయి.. పైకి మాత్రం గుడారాలు, లోపల జరిగే మ్యాటర్ మాత్రం వేరే. ఆ గుడారాలలో మందుబాబులు, వ్యభిచారం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ అసలు నిఘానే లేదంటున్నారు.గండికోటకు శని, ఆదివారమైతే చాలు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. కడప జిల్లా, ఏపీ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటుగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నుంచి వందలాది మంది వస్తున్నారు. చాలామంది గండికోటలో ప్రశాంతంగా గడిపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గుడారాలు ఏర్పాటు చేసుకుని అక్కడే రాత్రికి ఉంటున్నారు. గుడారాల్లో జూదరులు రెచ్చిపోతున్నారు.. పగలు, రాత్రి తేడా లేకుండా చక్కగా పేకాట ఆడుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొంతమంది ఖాళీ ప్రదేశాలు, అద్దె గదులు తీసుకుని దర్జాగా మత్తులో మునిగి తేలుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు స్థానిక ప్రైవేట్ రెస్టారెంట్ల నిర్వాహకులు కూడా వీటిని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గండికొంట ప్రాంతంలో ప్రతివారం రూ.లక్షలు చేతులు మారుతున్నాయని తెలుస్తోంది.. అక్కడ గదులను యువత ఇతర కార్యకలాపాలకు వినియోగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆ చుట్టపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా లేవని.. యువత మద్యం మత్తులో రెచ్చిపోతున్నారు. కొంతమంది ప్రభుత్వ అనుమతుల్లేకుండా ఇష్టారాజ్యంగా ప్రభుత్వ పక్కా ఇళ్లలో రిసార్టులు, ప్రైవేటు హోటళ్లు, గుడారాల ఏర్పాటు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అసలు గండికోటలో నిబంధనలు ఎవరూ పాటించడం లేదంటున్నారు. ఒకవేళ పర్యాటక ప్రాంతాల్లో లాడ్జిల్లో ఉండాలంటే.. వారి ఆధార్ కార్డు, అడ్రస్, మొబైల్ నంబర్ వంటి వివరాలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. కానీ డబ్బులు చెల్లించి ఆ వివరాలు ఏవీ ఇవ్వడం లేదంటున్నారు.
గండికొంట ప్రాంతంలో ప్రతివారం రూ.లక్షలు చేతులు మారుతున్నాయని తెలుస్తోంది.. అక్కడ గదులను యువత ఇతర కార్యకలాపాలకు వినియోగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆ చుట్టపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా లేవని.. యువత మద్యం మత్తులో రెచ్చిపోతున్నారు. కొంతమంది ప్రభుత్వ అనుమతుల్లేకుండా ఇష్టారాజ్యంగా ప్రభుత్వ పక్కా ఇళ్లలో రిసార్టులు, ప్రైవేటు హోటళ్లు, గుడారాల ఏర్పాటు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అసలు గండికోటలో నిబంధనలు ఎవరూ పాటించడం లేదంటున్నారు. ఒకవేళ పర్యాటక ప్రాంతాల్లో లాడ్జిల్లో ఉండాలంటే.. వారి ఆధార్ కార్డు, అడ్రస్, మొబైల్ నంబర్ వంటి వివరాలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. కానీ డబ్బులు చెల్లించి ఆ వివరాలు ఏవీ ఇవ్వడం లేదంటున్నారు.
గండికోట ఊరిబయట ఖాళీ ప్రదేశంలో శని, ఆదివారాల్లో అనధికారికంగా గుడారాలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ లోపల జరిగే మ్యాటర్ వేరంటున్నారు.. అక్కడ అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాత్రంతా అక్కడే ఉంటూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. గతంలో జరిగిన ఘటనలతో అధికారులు కొద్దిరోజులు గుడారాలు వేయకుండా నిలిపివేశారు. మళ్లీ ఇప్పుడు గుడారాలు మొదలయ్యాయి. అయితే గండికోటకు వచ్చే సందర్శకుల విషయంలో అలర్ట్గానే ఉన్నామంటున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ప్రైవేటు హోటళ్లు, గుడారాల యజమానులు భద్రత చర్యలు పాటించాలని తాము సూచించాము అన్నారు.

