
ఇవాళ విశాఖ-హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్ (12727), విశాఖ-సికింద్రాబాద్ గరీబ్రధ్ (12739), లింగంపల్లి-విశాఖ జన్మభూమి ఎక్స్ప్రెస్ (12806), సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్ (17016), హైదరాబాద్-కటక్ ప్రత్యేక రైలు (07165), విశాఖ-గుంటూరు ఉదయ్ ఎక్స్ప్రెస్ (22701), సికింద్రాబాద్-షాలిమార్ ఏసీ ఎక్స్ప్రెస్ (12774), తిరుపతి-విశాఖ ప్రత్యేక రైలు (08584), న్యూఢిల్లీ-విశాఖ ఏపీ ఎక్స్ప్రెస్ (20806), ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్ప్రెస్ (11019), తంబరం-సంత్రాగచ్చి ఎక్స్ప్రెస్ (22842), ఎర్నాకులం-హటియా ధార్తి ఏసీ ఎక్స్ప్రెస్ (22838), కటక్-హైదరాబాద్ ప్రత్యేక రైలు (07166), ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-షాలిమార్ కోరమండల్ ఎక్స్ప్రెస్ (12842), బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12864) రద్దు చేశారు. షాలిమార్-సికింద్రాబాద్ ఏసీ ఎక్స్ప్రెస్ (12773) 4న రద్దు, 5న ఎర్నాకులం-టాటానగర్ ఎక్స్ప్రెస్ (18189) రద్దు, 6న హౌరా-మైసూరు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (22817) రద్దు, కొచువేలి-షాలిమార్ ప్రత్యేక రైలు (06081) రద్దు, 7న కన్యాకుమారి-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12666) రద్దు చేశారు.
ఇవాళ విశాఖ నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ (20805) వయా విజయనగరం, రాయగడ, రాయపూర్, నాగపూర్ మీదుగా నడుస్తుంది. అలాగే హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చే గోదావరి ఎక్స్ప్రెస్ (12728) వయా పగిడిపల్లి, నల్గొండ, గుంటూరు మీదుగా నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ నుంచి వెళ్లే 12 రైళ్లు, విశాఖ మీదుగా వెళ్లే 19 రైళ్లు రద్దు చేశారు. వరుసగా రెండు రోజులు రైళ్లు రద్దు చేయడంతో.. ప్రయాణికుల సౌకర్యార్థం ఇవాళ విశాఖ నుంచి విజయవాడకు ప్రత్యేక రైలు (ఒక వైపు) అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ రైలు 08581 నంబర్తో మధ్యాహ్నం 12.55 గంటలకు విశాఖలో బయలుదేరి రాత్రి 7.15 గంటలకు విజయవాడ చేరుతుంది. ఈ ప్రత్యేక రైలులో 16 సెకండ్ క్లాస్ సిట్టింగ్, రెండు జనరల్ సెకండ్ క్లాస్, రెండు ఏసీ చైర్కార్, రెండు సెకండ్ క్లాస్ కమ్ లగేజి కమ్ దివ్యాంగుల కోచ్లతో ఉంటాయని అధికారులు తెలిపారు.

