Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఉలవలను పక్కన పెట్టేస్తున్నారా.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు

7 February 2026

Namakkal Hanuman Temple: రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడ ఉందో తెలుసా.?

7 February 2026

Eggs: పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు వాస్తవాలు తెలుసుకోండి..

7 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Vijayawada Temple Closing Timings,విజయవాడలో దసరా నవరాత్రి వేడుకలకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే మూలా నక్షత్రం.. – vijayawada kanaka durga temple dasara navaratri utsavalu schedule
ఆంధ్రప్రదేశ్

Vijayawada Temple Closing Timings,విజయవాడలో దసరా నవరాత్రి వేడుకలకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే మూలా నక్షత్రం.. – vijayawada kanaka durga temple dasara navaratri utsavalu schedule

.By .28 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vijayawada Temple Closing Timings,విజయవాడలో దసరా నవరాత్రి వేడుకలకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే మూలా నక్షత్రం.. – vijayawada kanaka durga temple dasara navaratri utsavalu schedule
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా నవరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో అమ్మవారు 11 అవతారాల్లో దర్శనమివ్వనున్నారు. మూలా నక్షత్రం రోజు సీఎం చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలు విజయవంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

విజయవాడలో దసరా నవరాత్రి వేడుకలకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే మూలా నక్షత్రం..
విజయవాడలో దసరా నవరాత్రి వేడుకలకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే మూలా నక్షత్రం.. (ఫోటోలు– Samayam Telugu)

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో 2025 దసరా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకూ విజయవాడలో దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది 11 రోజుల పాటు దసరా మహోత్సవాలు జరుగుతాయని దుర్గ గుడి ఈవో శీనానాయక్ తెలిపారు. మూలా నక్షత్రం సెప్టెంబర్ 29 (సోమవారం) వచ్చిందని.. ఆ రోజున సీఎం నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వివరించారు. అక్టోబర్ రెండో తేదీ గురువారం విజయదశమి రోజున ఉదయం మహా పూర్ణాహుతి, సాయంత్రం తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. దసరా నవరాత్రి ఉత్సవాలలో సామాన్యులకు పెద్దపీట వేస్తూ అందరికీ దుర్గమ్మ దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

విజయవాడ దసరా నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారి అలంకారాలు

  • సెప్టెంబర్ 22- బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం
  • సెప్టెంబర్ 23- గాయత్రి దేవి అలకారం
  • సెప్టెంబర్ 24 – అన్నపూర్ణ దేవి అలంకారం
  • సెప్టెంబర్ 25 – కాత్యాయిని దేవి అలంకారం
  • సెప్టెంబర్ 26 – మహాలక్ష్మీ దేవి అలంకారం

  • సెప్టెంబర్ 27 – లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం
  • సెప్టెంబర్ 28 – మహా చండీ దేవి అలంకారం
  • సెప్టెంబర్ 29 – సరస్వతి దేవి అలంకారం
  • సెప్టెంబర్ 30- దుర్గా దేవి అలంకారం
  • అక్టోబర్ 1- మహిషాసుర మర్దిని అలంకారం
  • అక్టోబర్ 2 – రాజరాజేశ్వరి దేవి అలంకారం

మరోవైపు దసరా ఉత్సవాలలో భాగంగా అమ్మవారు 11 రోజులు 11 దివ్య అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారని అధికారులు తెలిపారు. ప్రతి రోజు నగరోత్సవాలు జరుగుతాయని.. సమన్వయంతో పనిచేసి దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని దుర్గ గుడి ఈవో శీనా నాయక్ తెలిపారు. మరోవైపు ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. క్యూలైన్లు, లైటింగ్, తాగునీటి సౌకర్యం వంటి సదుపాయాలలో ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. వేడుకలకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులు అందరికీ అమ్మవారి లడ్డూ ప్రసాదం అందేలా చర్యలు తీసుకోవాలని దుర్గమ్మ భక్తులు కోరుతున్నారు. నవరాత్రి ఉత్సవాల వేళ వీఐపీ దర్శనాల కారణంగా సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో వీఐపీ దర్శనం వేళలు పక్కాగా అమలు చేయాలని కోరుతున్నారు. దుర్గాఘాట్‌లో సరైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. భవానీ భక్తులు స్నానాలు ఆచరించేందుకు వచ్చే నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి