Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం.. భారత ఆటగాళ్లకు ఎన్ని కోట్లు ఇవ్వనుందంటే?

7 February 2026

Dog Facts : కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?.. వీటి ప్రవర్తన వెనక అసలు కారణం ఇదే

7 February 2026

Vijayawada: సినీ పక్కిలో గోల్డ్ ట్రేడింగ్ కంపెనీకే టోకరా..

7 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Teachers Relieved Duties Other Than Academics,ఏపీలో టీచర్లకు భారీ ఊరట.. ఇకపై ఆ పనులు చేయనక్కర్లేదు.. ఉత్తర్వులు జారీ – andhra pradesh government orders collectors not to involve teachers in work that is not related to the school education department
ఆంధ్రప్రదేశ్

Ap Teachers Relieved Duties Other Than Academics,ఏపీలో టీచర్లకు భారీ ఊరట.. ఇకపై ఆ పనులు చేయనక్కర్లేదు.. ఉత్తర్వులు జారీ – andhra pradesh government orders collectors not to involve teachers in work that is not related to the school education department

.By .29 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Teachers Relieved Duties Other Than Academics,ఏపీలో టీచర్లకు భారీ ఊరట.. ఇకపై ఆ పనులు చేయనక్కర్లేదు.. ఉత్తర్వులు జారీ – andhra pradesh government orders collectors not to involve teachers in work that is not related to the school education department
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh No Non Teaching Tasks For Teachers: ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది! ఇకపై పాఠశాల పనులకు సంబంధం లేని ఇతర పనుల్లో టీచర్లను భాగస్వామ్యం చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు టీచర్లకు ఇతర పనులు అప్పగిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే పీ-4 కార్యక్రమాన్ని తప్పనిసరి చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు బీసీ వసతి గృహాల్లో ఫ్రెషర్స్ డే వేడుకలు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు.

హైలైట్:

  • ఏపీలో ప్రభుత్వ టీచర్లకు ఊరట
  • ఇకపై ఆ పనులు చేయక్కర్లేదు
  • ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు
ఏపీ టీచర్లతో ఆ పనులు చేయించొద్దు
ఏపీ టీచర్లతో ఆ పనులు చేయించొద్దు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్‌కు ఊరట దక్కింది. పాఠశాలలకు ప్రత్యక్షంగా సంబంధం లేని పనుల్లో వీరిని భాగస్వామ్యం చేయొద్దని అన్ని జిల్లాల కలెక్టర్లకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ సూచించారు. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టర్‌కు తెలియకుండా విద్యకు సంబంధం లేని పనులు అప్పగించొద్దని క్లారిటీ ఇచ్చేశారు. ‘కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సంబంధం లేని పనులను టీచర్లు, హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపాల్స్‌కు అప్పగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇకపై హెచ్‌వోడీల అనుమతి లేకుండా ఎవరూ శాఖకు సంబంధం లేని ఇతర పనులు చేయకూడదు. పాఠశాల విద్యాశాఖకు సంబంధం లేని పనులను పాఠశాలలకు అప్పగించడం వల్ల బోధన పనులకు అడ్డంకి ఏర్పడుతోంది’ అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కలెక్టర్లు కొన్ని విభాగాల డేటా అప్‌లోడ్‌కు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్‌ను వినియోగిస్తున్నట్లు తెలిసిందన్నారు. అయితే సంబంధం లేని పనుల్ని టీచర్లకు అప్పగించొద్దని ప్రభుత్వ ఉత్తర్వులను ఆహ్వానిస్తున్నామన్నాయి ఉపాధ్యాయ సంఘాలు. అలాగే అనవసరమైన యాప్‌లను తొలగిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉపాధ్యాయులకు ఊరట దక్కింది.

ఇదిలా ఉంటే.. ఉపాధ్యాయులకు పీ-4 కార్యక్రమాన్ని తప్పనిసరి చేయడాన్ని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) వ్యతిరేకిస్తోంది. పీ-4లో నిర్బంధ రిజిస్ట్రేషన్లను బహిష్కరించాలని ఫ్యాప్టో పిలుపునిచ్చింది. ఉపాధ్యాయులపై కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఒత్తిడి చేయడం తగదన్నారు. దత్తత తీసుకునే అంశం ఐచ్ఛికంగా ఉండాలని.. కానీ నిర్బంధం చేయడం సరికాదన్నారు. ఏలూరు జిల్లా విద్యాధికారి సోమవారం సాయంత్రంలోపు పీ-4లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడాన్ని వారు ఖండించారు. ఉపాధ్యాయులు వేరే కుటుంబాలను దత్తత తీసుకొని ఆర్థికంగా సహాయం చేసే పరిస్థితి ఉండకపోవచ్చన్నారు ఫ్యాప్టో నేతలు. ఎవరైనా స్వచ్ఛందంగా దత్తత తీసుకుంటే సంతోషిస్తామని.. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరారు.

ఎన్ని సార్లైనా వస్తాను.. ఐదేళ్లుగా పోరాంట చేస్తున్నా: లోకేష్

రాష్ట్రవ్యాప్తంగా బీసీ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఆగస్టు 6 నుంచి మూడు రోజుల పాటు ఫ్రెషర్స్ డే వేడుకలు జరుగుతాయి. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, స్నేహపూర్వక వాతావరణాన్ని పెంచడానికి ఈ వేడుకలు ఉపయోగపడతాయి
అంటున్నారు. అన్ని తరగతుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యా కమిటీల సభ్యులు, ప్రజా ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొంటారని మంత్రి సవిత ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల వారీగా మంగళవారం నుంచి అక్టోబరు 10 వరకు వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి