Tirumala Gold Conch And Disc Donated,తిరుమల శ్రీవారికి ఖరీదైన కానుకలు.. 2.5 కేజీల బంగారంతో – chennai devotees donates gold shankh and chakra to tirumala venkateswara swamy
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి భక్తులు అత్యంత విలువైన కానుకను సమర్పించారు. సుమారు రూ.2.4 కోట్ల విలువైన బంగారు శంఖం, చక్రాన్ని మంగళవారం రోజున స్వామివారికి విరాళంగా అందజేశారు. చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధులు ఈ కానుకల్ని అందజేశారు. ఈ ఆభరణాల బరువు 2.5 కేజీలు ఉంటుందని చెబుతున్నారు.