Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. అది ఎక్స్ రేటేడ్ అంటూ డిమాండ్..

7 February 2026

తెలుగులో తోప్ హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..

7 February 2026

Andhra Pradesh: ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు.. కాలేజీ గేట్లు క్లోజ్.. అసలేం జరిగిందంటే?

7 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Srivari Mettu Walkway Elephants,తిరుమల: శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగులు.. భక్తులకు అలర్ట్, పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు – devotees alerted after elephants spotted in tirumala srivari mettu walkway
ఆంధ్రప్రదేశ్

Tirumala Srivari Mettu Walkway Elephants,తిరుమల: శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగులు.. భక్తులకు అలర్ట్, పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు – devotees alerted after elephants spotted in tirumala srivari mettu walkway

.By .29 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Srivari Mettu Walkway Elephants,తిరుమల: శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగులు.. భక్తులకు అలర్ట్, పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు – devotees alerted after elephants spotted in tirumala srivari mettu walkway
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tirumala Srivari Mettu Walkway Elephants Alert: తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగుల గుంపు సంచారం భక్తుల్లో కలకలం రేపింది. 11 ఏనుగులు గుంపుగా తిరుగుతూ పంట పొలాలను ధ్వంసం చేశాయి. అటవీ శాఖ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఏనుగుల కదలికలను డ్రోన్ ద్వారా పరిశీలిస్తున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి చదవండి!

హైలైట్:

  • తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగులు
  • రంగంలోకి దిగిన అటవి, టీటీడీ అధికారులు
  • మెట్టు మార్గంలోకి భక్తుల్ని గుంపులుగా అనుమతి
శ్రీవారిమెట్టు మార్గంలో ఏనుగుల కలకలం
శ్రీవారిమెట్టు మార్గంలో ఏనుగుల కలకలం (ఫోటోలు– Samayam Telugu)

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి తిరుమలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలి. శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగుల గుంపు సంచారం కలకలం రేపింది. ఏకంటా 11 ఏనుగుల గుంపు పంప్‌ హౌస్‌ దగ్గర ఉన్నట్లు డ్రోన్‌ కెమెరాతో గుర్తించారు. అయితే డ్రోన్ కెమెరా చెట్టు కొమ్మలు తగలడంతో కింద పడిపోయింది. అయితే పంప్ హౌస్ సమీపంలో ఉన్న పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేశాయని చెబుతున్నారు. ఏనుగుల గుంపును గుర్తించిన అటవీశాఖ, టీటీడీ, విజిలెన్స్ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా శ్రీవినాయక స్వామి చెక్‌ పాయింట్‌ దగ్గర తిరుమలకు కాలనడకన వెళ్లేందుకు శ్రీవారి మెట్టు మార్గం వైపు వస్తున్న భక్తులను గంట పాటు నిలిపివేశారు. ఈ మేరకు అటవీ, టీటీడీ, విజిలెన్స్ అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు.. ఏనుగుల గుంపును పంప్ హౌస్ ప్రాంతం నుంచి తిరిగి అడవిలోకి తరిమేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తుల్ని.. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది బృందాలుగా పంపిస్తున్నారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏనుగుల సంచారంపై ప్రజల్ని అప్రమత్తం చేయాలని అటవీ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. ఏనుగుల గుంపుల సంచారం, పంట పొలాలను ధ్వంసం చేయడం, ఏనుగుల దాడిలో ఇటీవల ఒక రైతు దుర్మరణంపై సమీక్షించారు. సోమవారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఏనుగుల గుంపు తిరుగుతూ పొలాలు ధ్వంసం చేసిన ఘటనపై అధికారులు వివరాలు అందించారు. 11 ఏనుగులు (ఇందులో నాలుగు ఏనుగులు పిల్లలు) ఒక గుంపుగా తిరుగుతూ కళ్యాణి డ్యామ్ సమీపంలోని సత్యసాయి ఎస్టీ కాలనీ దగ్గర పొలాలు, తోటలు తొక్కివేశాయని వివరించారు. డ్రోన్ ద్వారా ఏనుగుల గుంపు కదలికలను పరిశీలిస్తున్నట్లు వివరించారు.

తిరుమల శ్రీవారికి ఖరీదైన కానుకలు.. 2.5 కేజీల బంగారంతో

‘చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్న క్రమంలో అటవీ శాఖ సిబ్బంది గ్రామాలలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి. ఏనుగులు ఎటువైపు వెళ్తున్నాయి అనేది పరిశీలించడానికి డ్రోన్ టెక్నాలజీ వినియోగిస్తున్న క్రమంలో… అవి వెళ్ళే అవకాశం ఉన్న మార్గాల్లోని గ్రామాలవారిని అప్రమత్తం చేయడంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. గ్రామాలవారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వాటికి ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలు పంపించాలి. ఏనుగుల కదలికలు, హెచ్చరిక సందేశాలు పంపించడాన్ని డి.ఎఫ్.ఓ. కార్యాలయాలు, పి.సి.సి.ఎఫ్. కార్యాలయం పర్యవేక్షించాలి. వీటితోపాటు ఏనుగుల గుంపు పొలాల మీదకి రాకుండా, అటవీ ప్రాంతంలోకి పంపించే చర్యలను పకడ్బందీగా చేపట్టాలి’ అని సూచనలు చేశారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి