
నగరి నియోజకవర్గంలో రోజాక, కేజే దంపతులకు మధ్య వార్ నడుస్తోంది. ఒకే పార్టీలో ఉన్నా సరే.. వేర్వేరుగా కార్యక్రమాలు చేపట్టేవారు. రెండు వర్గాల మధ్య నగరిలో గొడవలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేజే దంపతులకు మరికొందరు స్థానిక వైఎస్సార్సీపీ నేతలు కూడా మద్దతు తెలిపారు. నగరి నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీపీ ఎన్నిక విషయంలో కూడా వివాదం నడిచింది.. మంత్రి రోజా తన వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టి.. తన వర్గానికి ఆ పదవి వచ్చేలా చేశారు. అప్పటి నుంచి ఈ వార్ మరింత ముదరింది. అయితే వైఎస్ జగన్ నగరి పర్యటనకు వచ్చిన సమయంలో కేజే శాంతి, రోజా చేతులు కలిపేందుకు ప్రయత్నించారు. కేజే శాంతి తిరస్కరించగా.. జగన్ మాత్రం ఒప్పుకోలేదు.. ఇద్దరి చేతులు కలిపారు. నగరి నియోజకవర్గంలో కలిసి పనిచేయాలని సూచించారు. అయినా సరే ఆ తర్వాత కూడా రెండు వర్గాల మధ్య వివాదాలు కొనసాగాయి.
ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో రోజా వ్యతిరేక వర్గం మొత్తం ఏకమైంది.. ఆమెకు టికెట్ ఇవ్వొద్దని అధినేత జగన్, పార్టీ పెద్దల్ని కోరారు. ఆమెకు టికెట్ ఇస్తే నగరిలో వైఎస్సార్సీపీ ఓడిపోతుందని చెప్పారు.. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధిష్టానం పలువురు నేతల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వీరంతా ఎన్నికల్లో రోజాకు వ్యతిరేకంగా పనిచేశారు. కేజీ కుమార్, శాంతి వర్గం కూడా అంటీముట్టనట్లు వ్యవహరించారు. ఏపీ ఎన్నకల ఫలితాల తర్వాత మంత్రి రోజా నగరి నియోజకవర్గానికి రావడం తగ్గించేశారు. అయితే కొద్ది రోజులుగా మళ్లీ కనిపిస్తున్నారు.. అయితే గురువారం (సెప్టెంబర్ 12న) ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలతో కలిసి వైఎస్ జగన్ను కలిశారు. ఆ సమావేశం ముగిసిన మరుసటి రోజే కేజే దంపతులపై వేటు వ్యవహారం చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలపై కేజే దంపతులు స్పందించాల్సి ఉంది.

