Ysrcp Follower Ask Nara Lokesh Help In Twitter: మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఒక వైఎస్సార్సీపీ కార్యకర్త సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం ట్వీట్ చేయగా, లోకేష్ వెంటనే స్పందించి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై తెలుగుదేశం కార్యకర్తలు లోకేష్ను ప్రశంసించారు. అయితే, వైఎస్సార్సీపీ నేత నాగార్జున యాదవ్ గతంలో చంద్రబాబు చెల్లించని బసవతారకం హాస్పిటల్ బిల్లులను జగన్ చెల్లించారని గుర్తు చేశారు. రాజకీయాలకతీతంగా సహాయం చేయడం మంచి విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
హైలైట్:
- సాయం కోరిన వైసీపీ కార్యకర్త
- అండా నిలిచిన మంత్రి లోకేష్
- బసవతారకం టాపిక్ ఎందుకు

ఈ ట్వీట్పై మంత్రి నారా లోకేష్ కూడా వెంటనే స్పందించారు.. ‘మీరు నన్ను సంప్రదించినందుకు ధన్యవాదాలు. సీఎంఆర్ఎఫ్ నుంచి మీ రిక్వెస్ట్ను నోట్ చేసుకున్నాను. నా టీమ్ వెంటనే ఈ అంశాన్ని పరిశీలిస్తుంది.. మిమ్మల్ని సంప్రదిస్తుంది.. అవసరమైన వివరాలు అందించండి’ అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.. తన టీమ్ను కూడా అలర్ట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన తెలుగు తమ్ముళ్లు పార్టీలకు అతీతంగా నారా లోకేష్ స్పందిస్తున్నారని స్పందిస్తున్నారు.
నేపాల్ ఘర్షణలు.. చిక్కుకుపోయిన 240 మంది తెలుగువారు.. కాపాడతామన్న మంత్రి నారా లోకేష్
అయితే నారా లోకేష్ ట్వీట్పై తెలుగు తమ్ముళ్ల కామెంట్స్కు వైఎస్సార్సీపీ నేత నాగార్జున యాదవ్ స్పందించారు. ‘ఈ ట్వీట్ చూపించి ఎలేవేషన్ వేసుకునే వాళ్ళకి తెలియదేమో.. నందమూరి బాలకృష్ణ గారు నడిపే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బిల్స్ రూ.4 కోట్లు చంద్రబాబు గారు చెల్లించకపోతే వైయస్ జగన్ గారు వచ్చాక మానవత దృక్పధంతో చెల్లించారని. అధికారం వచ్చిందని ఆదుకున్నవాళ్ళని మర్చిపోతే ఎలా? నారా లోకేష్ గారు’ అంటూ నాగార్జున యాదవ్ టార్గెట్ చేశారు. రాజకీయాల సంగతి పక్కన పెడితే.. అవసరమైనవారికి సాయం చేయడం మంచి విషయమే కదా అంటూ చర్చించుకుంటున్నారు.


