యాదాద్రి జిల్లా చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం సమీపంలో గల అంజన సాయి మెడోస్ వెంచర్లోకి చొరబడ్డారు. తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్ గ్రామానికి చెందిన డొప్ప నరేష్ సెంట్రింగ్ పని చేస్తుంటాడు. అంజనసాయి మెడోస్ వెంచర్లోని కృష్ణవేణి హైస్కూల్ వెనుక వైపున ఉన్న చీకూరి శ్రీనివాస్ ఇంట్లో కుటుంబం అద్దెకు ఉంటోంది. నారాయణపురం మండలం పుట్టపాక బంధువుల ఇంటిలో జరిగిన ఫంక్షన్ కు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళాడు. ఇంటికి తిరిగి వచ్చిన నరేష్.. ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించాడు. ఆందోళనకు గురై వెంటనే బీరువా ఓపెన్ చేసి చూసాడు. 8గ్రాముల బంగారం, 8.5 తులాల వెండితోపాటుగా నగదు కన్పించలేదు. దీంతో సురేష్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. పరిసరాల్లోని సీసీ కెమెరాలు పరిశీలించారు.
ముగ్గురు సభ్యులు గల బృందం ఈ చోరీ చేసినట్లు గుర్తించారు. ముగ్గురు దొంగలు ముసుగులు ధరించారు. అందులో ఒకరు వ్యక్తి డ్రాయర్ మాత్రమే ధరించి, ఒంటికి నూనె రాసుకుని ఉన్నాడు. అయితే దొంగతనానికి పాల్పడింది చెడ్డీ గ్యాంగ్ సభ్యులేనా లేక స్థానికంగా ఉండే దొంగలే ముసుగులు ధరించి హల్చల్ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
ఇది చదవండి: ఎవడు మమ్మీ వీడు.! 42 ఫోర్లతో 437 పరుగులు.. దెబ్బకు బౌలర్లను పేకాటాడేశాడుగా
ఇవి కూడా చదవండి

