దక్షిణాది సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు రుక్మిణి వసంత్. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ కన్నడ భామ. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. నెమ్మదిగా కన్నడలో అవకాశాలు అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్నాళ్ల క్రితం సప్త సాగరాలు దాటి సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో అమాయకమైన నటనతో ఆకట్టుకుంది. దీంతో ఈ బ్యూటీ పేరు మారుమోగింది. ఇక ఇటీవలే రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్ 1 సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇందులో రుక్మిణి లుక్స్, యాక్టింగ్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. దీంతో పాన్ ఇండియా లెవల్లో ఈ అమ్మడు పేరు మారుమోగుంది. కాంతార చాప్టర్ 1 తర్వాత ఆమె గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు జనాలు.
ఇవి కూడా చదవండి : Actress: 150కి పైగా సీరియల్స్.. ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలిసే భిక్షాటన చేస్తూ ..
కాంతార చాప్టర్ 1 తర్వాత రుక్మిణి వసంత్ ఇప్పుడు డ్రాగన్ చిత్రంలో నటిస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ హైప్ నెలకొంది. తాజాగా ఈ అమ్మడు తనకంటే మూడేళ్ల చిన్నవాడి జోడిగా నటించనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ సంగీత దర్శకుడి కొడుకుతో కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సంగీత స్వరకర్త ప్రస్తుతం తన కొడుకుతో కలిసి ఒక సినిమాలో పనిచేస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి : Actor : 26 అనాథాశ్రమాలు.. 46 ఉచిత పాఠశాలలు.. రియల్ లైఫ్ హీరో.. సమాజం కోసం జీవితం ఇచ్చిన హీరో..
ప్రముఖ సంగీత స్వరకర్త విద్యాసాగర్ కుమారుడు హర్షవర్ధన్ హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి లింగుసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హర్షవర్దన్ జోడిగా రుక్మిణి వసంత్ నటించనున్నట్లు టాక్. త్వరలోనే శ్రీలంకలో షూటింగ్ ప్రారంభం కానుంది. హర్షవర్ధన్ నటి రుక్మిణి వసంత కంటే మూడేళ్లు చిన్నవాడు కావడం గమనార్హం.
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి.. సినిమాలు వదిలేసి గూగుల్ కంపెనీ సీఈఓగా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ?

