Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అబుదాబి వేదికగా భారత్‌కు బిగ్ డీల్స్: రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు !! | pm Modi UAE Visit details that Strengthens Strategic And Economic Ties also 5 billion investments

15 May 2026

LSG vs CSK IPL 2026 Result: ఏడు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విన్..

15 May 2026

Parenting Tips: పిల్లల భవిష్యత్తును మార్చే తండ్రుల సూపర్ హ్యాబిట్స్.. ఇవి మీలో ఉన్నాయా?

15 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Free Coaching For Minority Youth,మైనారిటీ యువతకు గుడ్ న్యూస్.. పోలీస్ , టీచర్ ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ.. – free coaching for minority youth for competitive exams like si and constable tet and dsc in andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Free Coaching For Minority Youth,మైనారిటీ యువతకు గుడ్ న్యూస్.. పోలీస్ , టీచర్ ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ.. – free coaching for minority youth for competitive exams like si and constable tet and dsc in andhra pradesh

.By .1 November 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Free Coaching For Minority Youth,మైనారిటీ యువతకు గుడ్ న్యూస్.. పోలీస్ , టీచర్ ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ.. – free coaching for minority youth for competitive exams like si and constable tet and dsc in andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


మైనారిటీ యువతకు ఏపీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు పలు పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందిస్తోంది. జిల్లాల వారీగా ఈ కార్యక్రమం చేపడుతోంది. ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి పోలీస్ ఉద్యోగాలతో పాటుగా ఆర్ఆర్‌బీ, టెట్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉచితంగా ట్రైనింగ్ అందిస్తున్నారు. ఆసక్తి, అర్హత ఉన్నవారు https://apcedmmwd.org/ వెబ్ సైట్ సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Minority
మైనారిటీ యువతకు గుడ్ న్యూస్.. పోలీస్ , టీచర్ ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ..(ఫోటోలు– Samayam Telugu)
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న మైనారిటీ యువతకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ యువతకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తోంది. టెట్, డీఎస్సీ వంటి వాటితో పాటుగా ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలకు కూడా ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మైనారిటీ యువతకు ఈ ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈ విషయాన్ని మైనారిటీ సంక్షేమ శాఖ కర్నూలు జిల్లా ఆఫీసర్ సబిహా పర్వీన్‌ వెల్లడించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ముస్లింలు, దూదేకులతో పాటుగా మైనారిటీ వర్గాలైన క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, పారశీకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు apcedmmwd.org వెబ్‌సైట్ సంప్రదించి.. దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే ఏవైనా వివరాల కావాలంటే 0866 2970567 నంబరుకు సంప్రదించాలని సూచించారు.

*కాశీబుగ్గ విషాదం.. తొక్కిసలాట ఘటనకు కారణాలు ఇవే?

మరోవైపు ప్రకాశం జిల్లాలోనూ మైనారిటీ సంక్షేమ శాఖ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. సెంటర్‌ పర్‌ ఎడ్యుకేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ మైనారిటీస్‌ సంస్థ ఉచిత శిక్షణ అందిస్తోంది. మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్‌ పోటీ పరీక్షలతో పాటుగా టెట్‌, డీఎస్సీ వంటి పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తోంది. మైనార్టీస్‌ ఫైనాన్సు కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ హైఫా శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
*భర్త సోదరుడిని సుఖపెట్టాలంటూ.. వివాహితకు వేధింపులు.. అత్తామామతో పాటు తోడికోడలు కూడా.!

ఆసక్తి కలిగిన మైనారిటీ యువత.. తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ పోర్టల్‌ https://apcedmmwd.org/ సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆఫ్‌లైన్‌ ద్వారా, ఆన్‌లైన్‌ ద్వారా అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తారని వివరించారు. ఇతర వివరాలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మైనారిటీస్‌ ఫైనాన్సు కార్పొరేషన్‌, ఒంగోలు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 0866–2970567, 9849901157, 9951160149 ను సంప్రదించాలని సూచించారు.

*ఉపాధ్యాయులకు శుభవార్త.. తొలిసారిగా.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

మరోవైపు మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉచిత శిక్షణ ద్వారా మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉచితంగా కోచింగ్‌తో పాటుగా పరీక్షలకు కావాల్సిన స్టడీ మెటీరియల్‌ను అందించనున్నారు. సరైన శిక్షణ, ప్రోత్సాహం అందించిన వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని మైనారిటీ విద్యాభివృద్ధి కేంద్రం (CEDM) ద్వారా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు పలు జిల్లాల్లో ఇప్పటికే నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మైనారిటీ సంక్షేమ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి