మైనారిటీ యువతకు ఏపీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు పలు పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందిస్తోంది. జిల్లాల వారీగా ఈ కార్యక్రమం చేపడుతోంది. ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి పోలీస్ ఉద్యోగాలతో పాటుగా ఆర్ఆర్బీ, టెట్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉచితంగా ట్రైనింగ్ అందిస్తున్నారు. ఆసక్తి, అర్హత ఉన్నవారు https://apcedmmwd.org/ వెబ్ సైట్ సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

*కాశీబుగ్గ విషాదం.. తొక్కిసలాట ఘటనకు కారణాలు ఇవే?
మరోవైపు ప్రకాశం జిల్లాలోనూ మైనారిటీ సంక్షేమ శాఖ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. సెంటర్ పర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ సంస్థ ఉచిత శిక్షణ అందిస్తోంది. మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పోటీ పరీక్షలతో పాటుగా టెట్, డీఎస్సీ వంటి పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తోంది. మైనార్టీస్ ఫైనాన్సు కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ హైఫా శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
*భర్త సోదరుడిని సుఖపెట్టాలంటూ.. వివాహితకు వేధింపులు.. అత్తామామతో పాటు తోడికోడలు కూడా.!
ఆసక్తి కలిగిన మైనారిటీ యువత.. తమ దరఖాస్తులను ఆన్లైన్ పోర్టల్ https://apcedmmwd.org/ సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆఫ్లైన్ ద్వారా, ఆన్లైన్ ద్వారా అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తారని వివరించారు. ఇతర వివరాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్సు కార్పొరేషన్, ఒంగోలు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 0866–2970567, 9849901157, 9951160149 ను సంప్రదించాలని సూచించారు.
*ఉపాధ్యాయులకు శుభవార్త.. తొలిసారిగా.. ప్రభుత్వం కీలక నిర్ణయం..
మరోవైపు మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉచిత శిక్షణ ద్వారా మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉచితంగా కోచింగ్తో పాటుగా పరీక్షలకు కావాల్సిన స్టడీ మెటీరియల్ను అందించనున్నారు. సరైన శిక్షణ, ప్రోత్సాహం అందించిన వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని మైనారిటీ విద్యాభివృద్ధి కేంద్రం (CEDM) ద్వారా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు పలు జిల్లాల్లో ఇప్పటికే నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మైనారిటీ సంక్షేమ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.


