Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Actress : నన్ను నేను కోల్పోయాను.. అతడి మరణం నన్ను పూర్తిగా మార్చేసింది.. బిగ్ బాస్ బ్యూటీ..

12 November 2025

Singer Chinmayi: ‘జానీ మాస్టర్ భార్య నాకు ఫోన్ చేసి’.. సింగర్ చిన్మయి సంచలన ఆరోపణలు

12 November 2025

RCB Home Ground: ఆర్‌సీబీ అడ్డాగా వైజాగ్ స్టేడియం.. మారిన బెంగళూరు హోమ్ గ్రౌండ్‌..?

12 November 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Amaravati Outer Ring Road Latest News,Amaravati ORR: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక అప్‌డేట్.. 40 గ్రామాల్లో భూసేకరణ! – amaravati outer ring road updates land acquisition underway in 40 villages in guntur district
ఆంధ్రప్రదేశ్

Amaravati Outer Ring Road Latest News,Amaravati ORR: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక అప్‌డేట్.. 40 గ్రామాల్లో భూసేకరణ! – amaravati outer ring road updates land acquisition underway in 40 villages in guntur district

.By .1 November 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Amaravati Outer Ring Road Latest News,Amaravati ORR: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక అప్‌డేట్.. 40 గ్రామాల్లో భూసేకరణ! – amaravati outer ring road updates land acquisition underway in 40 villages in guntur district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అమరావతి ఓఆర్ఆర్‌కు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. గుంటూరు జిల్లాలోని 11 మండలాల్లో భూసేకరణకు అడుగులు పడుతున్నాయి. 11 మండలాల్లోని 40 గ్రామాల్లో భూసేకరణకు కసరత్తు జరుగుతోంది. భూసేకరణ కోసం ప్రత్యేక అధికారిగా నియమించిన శ్రీవాత్సవ ఈ విషయంపై దృష్టి సారించారు. మరోవైపు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులను 12 ప్యాకేజీలుగా విభజించి చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరోవైపు మొత్తం ఐదు జిల్లాల్లో అమరావతి ఓఆర్ఆర్ కోసం భూసేకరణ చేపట్టనున్నారు.

amaravati-ORR
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక అప్‌డేట్.. 40 గ్రామాల్లో భూసేకరణ!(ఫోటోలు– Samayam Telugu)
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) గురించి మరో అప్‌డేట్ వచ్చింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం గుంటూరు జిల్లాలో భూసేకరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. భూసేకరణ కోసం అధీకృత అధికారిగా జేసీ శ్రీవాస్తవను నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్ భూసేకరణ కోసం శ్రీవాస్తవ కసరత్తు చేస్తున్నారు. 11 మండలాలలోని 40 గ్రామాల్లో ఓఆర్ఆర్ కోసం భూసేకరణ చేపట్టాలని కసరత్తు జరుగుతోంది. ఈ గ్రామాల్లోని 4,792.83 ఎకరాలను ఓఆర్ఆర్ కోసం సమీకరించనున్నారు.

దుగ్గిరాల, కొల్లిపర, తెనాలి, గుంటూరు తూర్పు, చేబ్రోలు, వట్టిచెరుకూరు, గుంటూరు పశ్చిమ, తాడికొండ, మేడికొండూరు, మంగళగిరి, పెదకాకాని మండలాల్లో ఓఆర్ఆర్ కోసం భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఆయా మండలాల తహశీల్దార్లు ఇప్పటికే భూసేకరణ కోసం ఎల్పీ షెడ్యూల్స్ తయారు చేశారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, రెవెన్యూ అధికారులు ఏడు మండలాలల్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశారు. మంగళగిరి. గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, చేబ్రోలు మండలాల ఎల్‌పీ షెడ్యూల్స్ గురించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇవి పూర్తైన తర్వాత ఓఆర్ఆర్ భూసేకరణ కోసం ప్రకటన ఇవ్వాలని భావిస్తున్నారు.

మొంథా ఎఫెక్ట్.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు

మరోవైపు అమరావతి చుట్టూ 190 కిలోమీటర్ల పొడవుతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఎన్‌హెచ్‌ఏఐ డీపీఆర్‌ సిద్ధం చేసి, దిల్లీ ప్రధాన కార్యాలయానికి ఇప్పటికే అందజేసింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్‌ వ్యయం రూ.24,791 కోట్లుగా అంచనా వేశారు. హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్డు పొడవు 158 కిలోమీటర్లు కాగా, అంతకంటే ఎక్కువగా 190 కిలోమీటర్ల పొడవుతో అమరావతి ఓఆర్‌ఆర్‌ నిర్మించనున్నారు. అలాగే 12 ప్యాకేజీలుగా విభజించి అమరావతి ఓఆర్‌ఆర్‌ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఆరు వరుసల ప్రధాన రహదారితో పాటుగా, రెండు వైపులా సర్వీస్‌ రోడ్లు కలిపి నిర్మించనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 140 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. ఆ మేరకు భూసేకరణ చేపట్టనున్నారు.మొత్తం ఐదు జిల్లాల్లో అమరావతి ఓఆర్ఆర్ కోసం భూసేకరణ జరపనుంది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం ఐదు జిల్లాలకు ఐదుగురు సంయుక్త కలెక్టర్లను నియమించింది. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా , పల్నాడు జిల్లా, ఏలూరు జిల్లాల్లో అమరావతి ఓఆర్ఆర్ కోసం భూసేకరణ చేపట్టనున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి