Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Actress : నన్ను నేను కోల్పోయాను.. అతడి మరణం నన్ను పూర్తిగా మార్చేసింది.. బిగ్ బాస్ బ్యూటీ..

12 November 2025

Singer Chinmayi: ‘జానీ మాస్టర్ భార్య నాకు ఫోన్ చేసి’.. సింగర్ చిన్మయి సంచలన ఆరోపణలు

12 November 2025

RCB Home Ground: ఆర్‌సీబీ అడ్డాగా వైజాగ్ స్టేడియం.. మారిన బెంగళూరు హోమ్ గ్రౌండ్‌..?

12 November 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Mangalagiri Flyover,కొత్త ఫ్లైఓవర్.. ఆ ప్రాంతంలోనే.. విజయవాడకు దూసుకెళ్లిపోవచ్చు.. – new flyover on gautama buddha road in mangalagiri andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Mangalagiri Flyover,కొత్త ఫ్లైఓవర్.. ఆ ప్రాంతంలోనే.. విజయవాడకు దూసుకెళ్లిపోవచ్చు.. – new flyover on gautama buddha road in mangalagiri andhra pradesh

.By .1 November 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Mangalagiri Flyover,కొత్త ఫ్లైఓవర్.. ఆ ప్రాంతంలోనే.. విజయవాడకు దూసుకెళ్లిపోవచ్చు.. – new flyover on gautama buddha road in mangalagiri andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీ ప్రభుత్వం మౌలిక వసతుల నిర్మాణానికి పెద్ద పీట వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫ్లైఓవర్లు, ఆర్వోబీలు, జాతీయ రహదారుల నిర్మాణాన్ని కేంద్రం సహకారంతో వేగవంతం చేసింది. తాజాగా మరోచోట ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. మంగళగిరిలో రూ.200 కోట్లతో 1.25 కిలోమీటర్ల మేరకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ చేపట్టి.. ఖరారు చేశారు. త్వరలోనే పనులు మొదలుపెట్టనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే విజయవాడ వైపు వెళ్లేవారికి ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు.

mangalagiri
కొత్త ఫ్లైఓవర్.. ఆ ప్రాంతంలోనే.. విజయవాడకు దూసుకెళ్లిపోవచ్చు..(ఫోటోలు– Samayam Telugu)
ఏపీలో మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతో ఏపీలో పలు జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, రహదారుల విస్తరణ పనులు, ఫ్లైఓవర్లు, ఆర్వోబీల నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గానికి గుడ్ న్యూస్ అందింది. ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచినప్పటి నుంచి మంగళగిరి అభివృద్ధి కోసం నారా లోకేష్ అనే చర్యలు తీసుకుంటున్నారు. మంగళగిరి అభివృద్ధి కోసం ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ముఖ ద్వారంగా మంగళగిరి ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మంగళగిరిలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారు నారా లోకేష్.

*అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక అప్‌డేట్.. 40 గ్రామాల్లో భూసేకరణ!

మంగళగిరిలో పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు. అందులో భాగంగా వాహనాల రద్దీని నివారించడానికి, వాహనదారులకు అసౌకర్యం లేకుండా ఉండేందుకు మంగళగిరిలో రోడ్డు నిర్మాణాలను శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా మంగళగిరిలో మరో ప్రాజెక్టును చేపట్టారు. మంగళగిరిలోని గౌతమ బుద్ధా రోడ్డుపై ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. 1.25 కిలోమీటర్ల మేరకు ఈ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.200 కోట్లతోఅమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండర్లను మేఘా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకుంది.

*మైనారిటీ యువతకు గుడ్ న్యూస్.. పోలీస్ , టీచర్ ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ..

మరోవైపు ఈ-15 రోడ్డుకు ఫ్లైఓవర్ లింక్ చేస్తూ పాత బస్టాండ్ సర్కిల్ వద్ద టీ ఆకారంలో ఈ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. పాత బస్టాండ్ నుంచి గుంటూరు వైపుగా 600 మీటర్లు, అలాగే రోడ్డు భవనాల శాఖ బంగ్లా వరకూ 650 మీటర్లు.. మొత్తంగా 1.25 కిలోమీటర్ల మేరకు ఫ్లైఓవర్ నిర్మాణం జరగనుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయితే విజయవాడ వైపు రాకపోకలు సాగించే వాహనదారులకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు.

*ఉపాధ్యాయులకు శుభవార్త.. తొలిసారిగా.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

మరోవైపు అమరావతి టౌన్ షిప్ వద్ద నుంచి నిడమర్రు రైల్వేగేటుపై ఆర్వోబీ నిర్మాణాన్ని రైల్వేశాఖ చేపట్టింది. ఇందుకోసం రూ.129.18 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ ఆర్వోబీ నిర్మాణానికి సంబంధించిన పూర్తి స్థాయి అనుమతులు వచ్చిన తర్వాత పనులు చేపట్టనున్నారు. అలాగే ఆర్వోబీ నిర్మాణం పూర్తి అయితే దీనికి అనుసంధానంగా నాలుగు లైన్ల సర్వీసు రోడ్ల నిర్మాణాన్నిఅమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపట్టనుంది. ఈ పనుల కోసం రూ.77 రోట్లతో టెండర్ల ప్రక్రియ కూడా పూర్తైంది. ఈ ప్రాజెక్టులు అన్నీ పూర్తి అయితే మంగళగిరి రూపురేఖలు మారిపోతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి