Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Safety Pin: ఓర్ని ఇదేందిరా సామీ.. ఈ సేఫ్టీ పిన్ ఇంత కాస్టా.. కొనాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే!

7 November 2025

డ్రాగన్‌ తారక్‌.. లుక్‌ అదిరింది నీల్‌

7 November 2025

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం వరిస్తుంది.. పెళ్ళి తర్వాత లైఫ్‌స్టైల్‌ మారిపోతుందట!

7 November 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Rs 1000 Cr Polavaram Project Compensation,వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త.. ఖాతాల్లో రూ.1000 కోట్లు – andhra pradesh government distributed rs 1000 cr as compensation to polavaram displaced people
ఆంధ్రప్రదేశ్

Rs 1000 Cr Polavaram Project Compensation,వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త.. ఖాతాల్లో రూ.1000 కోట్లు – andhra pradesh government distributed rs 1000 cr as compensation to polavaram displaced people

.By .2 November 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Rs 1000 Cr Polavaram Project Compensation,వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త.. ఖాతాల్లో రూ.1000 కోట్లు – andhra pradesh government distributed rs 1000 cr as compensation to polavaram displaced people
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టుకు సంభంధించి కీలక అప్డేట్ వచ్చింది. పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులు అయ్యే వారికి పరిహారం అందించేందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1000 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. శనివారం నాడు ఈ నిధుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్ట్ కన్నా ముందే.. నిర్వాసితులకు కాలనీలు నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. ఆ వివరాలు..

హైలైట్:

  • పోలవరం నిర్వాసితులకు రూ.1000 కోట్లు
  • పంపిణీ ప్రారంభించిన ప్రభుత్వం
  • 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి
Polavaram
రూ.1000 కోట్లు పంపిణీ(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధుల కేటాయింపు.. కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక వనరులను సాధించడంలో విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఈక్రమంలో తాజాగా కూటమి ప్రభుత్వం పోలవరం నిర్వాసితులకు పంపిణీ చేసేందుకు రూ.1000 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ పరిహారం రూ.1000 కోట్ల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని మంత్రి నిమ్మల ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వం దానిని గాడిలో పెడుతోందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రెండేళ్లలో అనగా 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల ప్రకటించారు. ప్రాజెక్ట్ నిర్మాణం కన్నా ఆరు నెలల ముందే నిర్వాసితులకు కాలనీలు నిర్మించి సౌకర్యాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.

గత వైసీపీ హయాంలో పోలవరం నిర్వాసితులకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదని, కేంద్రం ఇచ్చిన రూ.3,385 కోట్లను జగన్ దారి మళ్లించారని మంత్రి నిమ్మల ఆరోపించారు. శనివారం ఏలూరు జిల్లా వేలేరుపాడులో పోలవరం నిర్వాసితులకు భూసేకరణ, పునరావాసం పరిహారం కింద రూ.1000 కోట్ల పంపిణీని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. వెంటనే అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి నిమ్మల తెలిపారు. అందులో భాగంగానే నిర్వాసితుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామన్నారు. మరో 20 రోజుల్లో నిర్వాసితులందరికీ పరిహారం అందుతుందని ఆయన తెలిపారు. ఎవరికైనా పరిహారం అందకపోతే టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేస్తే పరిష్కరిస్తామన్నారు. పరిహారం జమకాకపోవడానికి గల కారణాలను నిర్వాసితులకు తెలియజేయాలని యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు. గతంలో 2016లో పోలవరం నిర్వాసితులకు రూ.700 కోట్లు, 2025 జనవరిలో రూ.900 కోట్లు, ప్రస్తుతం రూ.1000 కోట్లతో కలిపి మొత్తం రూ.2600 కోట్లు ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి నిమ్మల తెలిపారు.

పరిహారం ఇప్పిస్తామని చెప్పే దళారులను గుర్తించి, వారిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని మంత్రి నిమ్మల.. ఎస్పీని ఆదేశించారు. అనంతరం ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చిత్రపటాలకు నిర్వాసితుల సమక్షంలో పాలాభిషేకం చేశారు. సభ ముగిసే సమయానికి నిర్వాసితుల ఖాతాల్లో రూ.40 కోట్లు జమ అయినట్లు అధికారులు తెలిపారు.

పిల్లి ధ‌ర‌ణి

రచయిత గురించిపిల్లి ధ‌ర‌ణిధరణి పిల్లి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆమె తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. ఆమెకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్థానిక వార్తలు, తెలంగాణ ఎన్నికల అప్డేట్స్, ప్రత్యేక కథనాలు రాశారు. ధరణి ఎస్ఎస్‌జే నుంచి మల్టీ మీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు.… ఇంకా చదవండి