Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Safety Pin: ఓర్ని ఇదేందిరా సామీ.. ఈ సేఫ్టీ పిన్ ఇంత కాస్టా.. కొనాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే!

7 November 2025

డ్రాగన్‌ తారక్‌.. లుక్‌ అదిరింది నీల్‌

7 November 2025

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం వరిస్తుంది.. పెళ్ళి తర్వాత లైఫ్‌స్టైల్‌ మారిపోతుందట!

7 November 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Fake Liquor Case Jogi Ramesh Arrest,ఏపీ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం.. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ – fake liquor case 2025 ap excise police arrest ycp leader jogi ramesh brk
ఆంధ్రప్రదేశ్

Fake Liquor Case Jogi Ramesh Arrest,ఏపీ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం.. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ – fake liquor case 2025 ap excise police arrest ycp leader jogi ramesh brk

.By .2 November 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Fake Liquor Case Jogi Ramesh Arrest,ఏపీ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం.. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ – fake liquor case 2025 ap excise police arrest ycp leader jogi ramesh brk
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారైందని ఏ1 నిందితుడు చెప్పడంతో సిట్ రంగంలోకి దిగింది. దీంతో జోగి రమేష్ ఇంట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించనున్నారు. ఈ కేసులో జోగి రమేష్‌తో పాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు..

హైలైట్:

  • నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం
  • మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్
  • అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు
jogi ramesh
జోగి రమేష్ అరెస్ట్(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ని అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులో అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు.. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు పోలీసులకు తెలిపాడు. దీంతో సిట్ బృందం ఆదివారం ఆయన ఇంటి వద్దకు చేరుకుంది. ఈక్రమంలో జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్సైజ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి ముందు హైడ్రామా నెలకొంది. ఆయనను వియవాడ సిట్ కార్యాలయానికి తరలించనున్నారు.ఆదివారం ఉదయం సిట్ బృందం ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్దకు వెళ్లింది. తీవ్ర ఉద్రిక్త పరిణామాల తర్వాత ఎక్సైజ్ పోలీసులు జోగి రమేశ్‌తో పాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే ముందుగా ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్న జనార్ధనరావు ఇచ్చిన వాంగ్మూలం మేరకు జోగి రమేష్‌ని అరెస్ట్ చేశారు.

అయితే ఆయన అరెస్ట్‌కు ముందు జోగి రమేశ్ ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. ఆదివారం తెల్లవారుజామునే పోలీసులు జోగి రమేష్ ఇంటికి రావడంతో.. పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు తరలి వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు వచ్చారని తెలుసుకున్న జోగి రమేష్.. సుమారు 3 గంటల పాటు డోర్ తీయక పోవడంతో ఇంటి బయటనే ఉన్నారు. అనంతరం ఉదయం 8 గంటల సమయంలో ఆయన డోర్ ఒపెన్ చేయడంతో.. ముందుగా పోలీసులు ఆయనకు నోటీసులు అందజేసి ఆ తర్వాత అరెస్ట్ చేశారు.

పిల్లి ధ‌ర‌ణి

రచయిత గురించిపిల్లి ధ‌ర‌ణిధరణి పిల్లి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆమె తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. ఆమెకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్థానిక వార్తలు, తెలంగాణ ఎన్నికల అప్డేట్స్, ప్రత్యేక కథనాలు రాశారు. ధరణి ఎస్ఎస్‌జే నుంచి మల్టీ మీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు.… ఇంకా చదవండి