Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Jaggery Secrets: మార్కెట్లో ఈ కలర్ బెల్లం కనిపిస్తే అస్సలు కొనకండి.. అది తీపి కాదు స్లో పాయిజన్!

17 December 2025

చల్లటి నీటిలో స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా..? అబ్బబ్బ ఏమన్నా లాభాలా..

17 December 2025

Andhra News: ఏపీలోని మహిళలకు గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి రూ.15 వేలు.. చెక్ చేసుకోండి

17 December 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Vijayawada Elevated Corridor,ఏపీకి కేంద్రం బ్యాడ్ న్యూస్.. ఆ ఎలివేటెడ్ కారిడార్‌ ప్రాజెక్టుపై వెనక్కి.! – national highways authority of india on mahanadu junction nidamanuru elevated corridor in vijayawada
ఆంధ్రప్రదేశ్

Vijayawada Elevated Corridor,ఏపీకి కేంద్రం బ్యాడ్ న్యూస్.. ఆ ఎలివేటెడ్ కారిడార్‌ ప్రాజెక్టుపై వెనక్కి.! – national highways authority of india on mahanadu junction nidamanuru elevated corridor in vijayawada

.By .7 November 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vijayawada Elevated Corridor,ఏపీకి కేంద్రం బ్యాడ్ న్యూస్.. ఆ ఎలివేటెడ్ కారిడార్‌ ప్రాజెక్టుపై వెనక్కి.! – national highways authority of india on mahanadu junction nidamanuru elevated corridor in vijayawada
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


విజయవాడలో ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మహానాడు జంక్షన్ – నిడమానూరు మధ్యన 7 కిలోమీటర్ల మేరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని గతంలో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు NHAI ఆమోదం కూడా లభించింది. అయితే తాజాగా ఈ ప్రాజెక్టును జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పక్కనపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Elevated corridor
ఏపీకి కేంద్రం బ్యాడ్ న్యూస్.. ఆ ఎలివేటెడ్ కారిడార్‌ ప్రాజెక్టుపై వెనక్కి..!(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్న కేంద్రం.. తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడలోని మహానాడు జంక్షన్ – నిడమానూరు మధ్య తలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్ పనులను పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. 16వ నంబర్ జాతీయ రహదారిపై మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు మధ్య 7 కి.మీ. పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌ను చేపట్టాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ( NHAI ) గతంలో నిర్ణయించింది. తాజాగా ఎలివేటెడ్ కారిడార్ పనులను పక్కనపెట్టాలని NHAI భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందుకు గల కారణాలు స్పష్టంగా తెలియడం లేదు. NHAI ప్రధాన కార్యాలయంలో ఈ అంశం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

*ఏపీకి మరో వందేభారత్ రైలు.! ఆ ప్రతిపాదన ఓకే అయితే వారికి పండగే..

16వ నంబర్ జాతీయ రహదారిపై విమానాశ్రయ కారిడార్ స్ట్రెచ్ వెంట ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని తలపెట్టారు. దీనికి NHAI ఆమోదం కూడా లభించింది. అయితే, తాజా పరిణామంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. రామవరపాడు, ఎనికేపాడు జంక్షన్లలోని భారీ ట్రాఫిక్‌ను తగ్గించడానికి.. అలాగే గవర్నమెంట్ ఆస్పత్రి సమీపంలోని మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు వరకూ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు మహానాడు జంక్షన్- నిడమానూరు మధ్య ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదించారు. అయితే తాజాగా ఈ ఎలివేటెడ్ కారిడార్ పనులను పక్కనబెట్టాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయించినట్లు సమాచారం.

*ఏపీవాసులకు తీపికబురు.. ఆ ఆస్తుల హక్కులు మీకే.. మార్చి నాటికి కోటి మందికి కార్డులు జారీ.!

ఈ ప్రాజెక్టును పక్కనబెట్టడానికి స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ.. విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణం దాదాపుగా పూర్తవుతున్నందున, ఎలివేటెడ్ కారిడార్ ఇకపై అవసరం ఉండకపోవచ్చనేది ఒక కారణంగా భావిస్తున్నారు. విజయవాడ వెస్ట్ బైపాస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, NH-16 మార్గంలో వాహనాల రాకపోకలను మళ్లించాలని భావిస్తున్నారు. దీంతో ప్రస్తుత మార్గంలో ఫ్లైఓవర్ అవసరం రాదని అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు ఎలివేటెడ్ కారిడార్‌ను NHAI పక్కన పెడితే.. విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ డిజైన్లలో మార్పులు కూడా జరగొచ్చని తెలుస్తోంది. విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ యొక్క ఫేజ్-1ఎ కింద, విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ -గన్నవరం కారిడార్‌లో రామవరపాడు, నిడమనూరు మధ్య 4.4 కి.మీ. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌ను NHAI, ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా ప్రతిపాదించాయి. ఈ నేపథ్యంలో ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పక్కనబెడితే.. మెట్రో డిజైన్‌లోనూ మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి