విజయవాడలో ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మహానాడు జంక్షన్ – నిడమానూరు మధ్యన 7 కిలోమీటర్ల మేరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని గతంలో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు NHAI ఆమోదం కూడా లభించింది. అయితే తాజాగా ఈ ప్రాజెక్టును జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పక్కనపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

*ఏపీకి మరో వందేభారత్ రైలు.! ఆ ప్రతిపాదన ఓకే అయితే వారికి పండగే..
16వ నంబర్ జాతీయ రహదారిపై విమానాశ్రయ కారిడార్ స్ట్రెచ్ వెంట ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని తలపెట్టారు. దీనికి NHAI ఆమోదం కూడా లభించింది. అయితే, తాజా పరిణామంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. రామవరపాడు, ఎనికేపాడు జంక్షన్లలోని భారీ ట్రాఫిక్ను తగ్గించడానికి.. అలాగే గవర్నమెంట్ ఆస్పత్రి సమీపంలోని మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు వరకూ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు మహానాడు జంక్షన్- నిడమానూరు మధ్య ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదించారు. అయితే తాజాగా ఈ ఎలివేటెడ్ కారిడార్ పనులను పక్కనబెట్టాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయించినట్లు సమాచారం.
*ఏపీవాసులకు తీపికబురు.. ఆ ఆస్తుల హక్కులు మీకే.. మార్చి నాటికి కోటి మందికి కార్డులు జారీ.!
ఈ ప్రాజెక్టును పక్కనబెట్టడానికి స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ.. విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణం దాదాపుగా పూర్తవుతున్నందున, ఎలివేటెడ్ కారిడార్ ఇకపై అవసరం ఉండకపోవచ్చనేది ఒక కారణంగా భావిస్తున్నారు. విజయవాడ వెస్ట్ బైపాస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, NH-16 మార్గంలో వాహనాల రాకపోకలను మళ్లించాలని భావిస్తున్నారు. దీంతో ప్రస్తుత మార్గంలో ఫ్లైఓవర్ అవసరం రాదని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు ఎలివేటెడ్ కారిడార్ను NHAI పక్కన పెడితే.. విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ డిజైన్లలో మార్పులు కూడా జరగొచ్చని తెలుస్తోంది. విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ యొక్క ఫేజ్-1ఎ కింద, విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ -గన్నవరం కారిడార్లో రామవరపాడు, నిడమనూరు మధ్య 4.4 కి.మీ. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ను NHAI, ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా ప్రతిపాదించాయి. ఈ నేపథ్యంలో ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పక్కనబెడితే.. మెట్రో డిజైన్లోనూ మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.


