Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

భారత ప్రజలు ఏదో ఒకరోజు రాహుల్ ను ప్రధానిని చేస్తారు

17 December 2025

Jaggery Secrets: మార్కెట్లో ఈ కలర్ బెల్లం కనిపిస్తే అస్సలు కొనకండి.. అది తీపి కాదు స్లో పాయిజన్!

17 December 2025

చల్లటి నీటిలో స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా..? అబ్బబ్బ ఏమన్నా లాభాలా..

17 December 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Nara Lokesh On 30000 Jobs,ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే 30 వేల ఉద్యోగాలు.. నారా లోకేష్ ప్రకటన – andhra pradesh minister nara lokesh says visakhapatnam to get 30000 jobs in 3 years with google tcs and other major companies
ఆంధ్రప్రదేశ్

Nara Lokesh On 30000 Jobs,ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే 30 వేల ఉద్యోగాలు.. నారా లోకేష్ ప్రకటన – andhra pradesh minister nara lokesh says visakhapatnam to get 30000 jobs in 3 years with google tcs and other major companies

.By .13 November 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Nara Lokesh On 30000 Jobs,ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే 30 వేల ఉద్యోగాలు.. నారా లోకేష్ ప్రకటన – andhra pradesh minister nara lokesh says visakhapatnam to get 30000 jobs in 3 years with google tcs and other major companies
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


విశాఖపట్నం కేంద్రంగా భారీ అభివృద్ధి ప్రణాళికలను మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. త్వరలోనే విశాఖకు టీసీఎస్ సహా పలు అంతర్జాతీయ కంపెనీలు రానున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే గూగుల్ సెంటర్‌ ఏర్పాటుకు కృషి పూర్తైందని.. ఈ నెలాఖరులోనే శంకుస్థాపన ఉంటుందని తేల్చి చెప్పారు. రూ.3,800 కోట్ల పెట్టుబడుల ద్వారా రానున్న 3 ఏళ్లలో 30 వేల మంది యువతకు ఉపాధి లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ తరహాలో ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ త్వరలో ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.

Nara Lokesh
ఏపీలో త్వరలోనే 30 వేల ఉద్యోగాలు.. నారా లోకేష్ ప్రకటన(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ మేరకు రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. గురువారం విశాఖపట్నంలోని యండాడలో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు భూమి పూజ చేసిన తర్వాత.. కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా విశాఖలో త్వరలోనే భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి లోకేష్ వెల్లడించారు.

విశాఖకు వస్తున్న వివిధ కంపెనీల ద్వారా సుమారు రూ.3,800 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి లోకేష్ వివరించారు. ఈ కంపెనీల ద్వారా రాబోయే మూడేళ్లలో 30 వేల మంది ఏపీ యువతకు ఉపాధి లభిస్తుందని ప్రకటించారు. గూగుల్ సెంటర్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం ఎంతో కష్టపడిందని వెల్లడించిన నారా లోకేష్.. దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా లభించిందని వెల్లడించారు. ఈ నెలాఖరులోగా గూగుల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలు విశాఖలో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందుకు వచ్చిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. మరోవైపు.. ఇన్ఫోసిస్ కూడా తమ విస్తరణ కార్యకలాపాలను చేపట్టనున్నట్లు వివరించారు. విశాఖ నగరం అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందడానికి వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాంటి ప్రాజెక్టులు ఉపయోగడపతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

తమ ప్రభుత్వం అభివృద్ధిని వికేంద్రీకరించాలనే ఉద్దేశంతో పనిచేస్తుందని.. మంత్రి లోకేష్ వెల్లడించారు. అందుకే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో త్వరలోనే ఆర్సిలర్‌ మిట్టల్ భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. మరోవైపు.. త్వరలోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలను ఆక్వా రంగంలో మరింత అభివృద్ధి చేస్తామని నారా లోకేష్ చెప్పారు. దేశంలో తయారవుతున్న ఏసీలలో 70 శాతం ఉత్పత్తి చేసే సంస్థ నెల్లూరు జిల్లాలో ఏర్పాటు అవుతోందని.. అక్కడ అతిపెద్ద గ్లాస్ సిటీ కూడా రాబోతుందని తెలిపారు. అధికారంలోకి రాక ముందు రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని కూటమి ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు లోకేష్ స్పష్టం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు.

శివరామచారి తాటికొండ

రచయిత గురించిశివరామచారి తాటికొండశివరామచారి తాటికొండ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ట్రెండింగ్ టాపిక్స్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు, విశ్లేషణలను శివరామచారి అందిస్తుంటారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలపై ఫ్యాక్ట్‌చెక్‌ వార్తలు రాసిన అనుభవం ఉంది. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ETV సంస్థలో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్‌ (EJS) నుంచి జర్నలిజంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.… ఇంకా చదవండి