Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Toll Charges: త్వరలో దేశవ్యాప్తంగా అత్యాధునిక టోల్ వ్యవస్థ.. టోల్‌గేట్లు ఉండవ్.. ఇక రయ్ రయ్

17 December 2025

వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్‌

17 December 2025

బాక్సాఫీస్ విజయానికి కొత్త మంత్రం.. సినిమాలో ఇది ఉంటే హిట్ పక్కా

17 December 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ips Dr Gv Sundeep Chakravarthy,దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం చేసిన ఐపీఎస్ జీవీ సందీప్ చక్రవర్తి మన తెలుగోడే.. చిన్న పోస్టర్‌తో..! – who is ips dr gv sundeep chakravarthy and why is everyone talking about the white coat terror case after delhi red fort blast
ఆంధ్రప్రదేశ్

Ips Dr Gv Sundeep Chakravarthy,దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం చేసిన ఐపీఎస్ జీవీ సందీప్ చక్రవర్తి మన తెలుగోడే.. చిన్న పోస్టర్‌తో..! – who is ips dr gv sundeep chakravarthy and why is everyone talking about the white coat terror case after delhi red fort blast

.By .13 November 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ips Dr Gv Sundeep Chakravarthy,దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం చేసిన ఐపీఎస్ జీవీ సందీప్ చక్రవర్తి మన తెలుగోడే.. చిన్న పోస్టర్‌తో..! – who is ips dr gv sundeep chakravarthy and why is everyone talking about the white coat terror case after delhi red fort blast
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


దీపావళి, బాబ్రీ మసీదు కూల్చివేతకు గురైన డిసెంబర్ 6వ తేదీన ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు పాల్పడాలని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చేసిన పెద్ద ఉగ్రకుట్ర.. ఇటీవలి ఢిల్లీ పేలుడుతో బట్టబయలు అయింది. అయితే దేశంలో ఉగ్రకుట్ర వెలుగులోకి రావడానికి ఓ తెలుగు ఐపీఎస్ అధికారి కారణం అని మీకు తెలుసా. జమ్మూ కాశ్మీర్ ఎస్ఎస్‌పీగా పనిచేస్తున్న డాక్టర్ జీవీ సందీప్ చక్రవర్తి.. గుర్తించిన ఒక పోస్టర్ ద్వారా.. దేశంలో భారీ విధ్వంసం జరగకుండా భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ఇంతకీ ఈ ఐపీఎస్ అధికారి ఎవరు. ఆయన స్వస్థలం ఎక్కడ. ఆయన సాధించిన విజయాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

IPS Dr GV Sundeep Chakravarthy
దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం చేసిన ఐపీఎస్ జీవీ సందీప్ చక్రవర్తి(ఫోటోలు– Samayam Telugu)
ఇటీవల ఢిల్లీ పేలుడు ఘటనతో దేశంలో.. ఉగ్రవాదులు వేసిన భారీ కుట్ర భగ్నం అయింది. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన పోస్టర్లను గుర్తించిన ఓ ఐపీఎస్ అధికారి.. దేశవ్యాప్తంగా అలర్ట్ చేయడంతో.. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు దేశం మొత్తం ఉగ్రతీగ బయటికి వచ్చింది. హర్యానాలో పేలుడు పదార్థాలు బయటపడటంతోపాటు ఢిల్లీలో భారీ పేలుళ్లకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అయితే ఈ మొత్తం ఉగ్ర వ్యూహాలను భగ్నం చేయడంలో తెలుగు వ్యక్తి ఉండటం గమనార్హం. అతడే ఐపీఎస్ అధికారి డాక్టర్ జీవీ సందీప్ చక్రవర్తి . జమ్మూ కాశ్మీర్‌లో ఎస్ఎస్‌పీగా పనిచేస్తున్న డాక్టర్ జీవీ సందీప్ చక్రవర్తి.. నెల రోజుల క్రితమే జైషే మహమ్మద్ ఉగ్ర పోస్టర్ గుర్తించి.. సంబంధిత అధికారులను అలర్ట్ చేయడం ద్వారా.. భారత్‌లో పెను విధ్వంసం జరగకుండా అడ్డుకున్నారు.

జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్ఎస్‌పీగా) డాక్టర్ జీవీ సందీప్ చక్రవర్తి సేవలు అందిస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం.. శ్రీనగర్‌లోని నౌగామ్ బన్పియోరా వీధుల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అతికించిన అనుమానాస్పద పోస్టర్లను గుర్తించిన.. ఎస్ఎస్‌పీ జీవీ సందీప్ చక్రవర్తి.. వాటి వెనుక పెద్ద ప్రమాదం పొంచి ఉందని భావించి.. దర్యాప్తుకు ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురు వ్యక్తులను గుర్తించి విచారణ చేయగా.. స్థానిక ఇమామ్ అయిన మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ పేరు బయటికి వచ్చింది.

దీంతో శ్రీనగర్ పోలీసులు ఇర్ఫాన్ అహ్మద్ ఇంటిని తనిఖీ చేయగా.. అతని ఇంట్లో దొరికిన డిజిటల్ పరికరాల ద్వారా భారీ ఉగ్ర నెట్‌వర్క్‌తో సంబంధాలు బయటికి వచ్చాయి. ఈ సమాచారం ఆధారంగా.. ఓ స్పెషల్ టీమ్ హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనైని అరెస్ట్ చేయగా.. మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత జైషే మహమ్మద్ ఉగ్రవాదానికీ సంబంధించిన చాలా మంది కాశ్మీరీ డాక్టర్లు, ఇతరులను అరెస్ట్ చేయగా.. ఈ దర్యాప్తులో భారీగా పేలుడు పదార్థాలు, ఏకే-47 రైఫిల్స్ కూడా లభించాయి.

డాక్టర్ జీవీ సందీప్ చక్రవర్తి ఎవరు?

డాక్టర్ జీవీ సందీప్ చక్రవర్తి.. తన కెరీర్‌‌లో ఎన్నో విజయాలు సాధించారు. జమ్మూ కాశ్మీర్‌లో ఒక ఉగ్రవాద నెట్‌వర్క్‌ను గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఒక మెడికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆయన స్వస్థలం. తండ్రి డాక్టర్ జీవీ రామ గోపాల్ రావు గవర్నమెంట్ డాక్టర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన తల్లి పీసీ రంగమ్మ.. ఏపీ రాష్ట్ర ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు.

కర్నూలు మాంటిస్సోరి పబ్లిక్ స్కూల్‌లో విద్యనభ్యసించిన జీవీ సందీప్ చక్రవర్తి.. మెడిసిన్‌ చేశారు. ఆ తర్వాత సివిల్స్‌లో ర్యాంకు సాధించి 2014లో ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం శ్రీనగర్‌ ఎస్ఎస్‌పీగా పనిచేస్తున్న ఆయన.. పూంచ్‌ ఏఎస్‌పీగా తన సర్వీసును ప్రారంభించారు. ఆ తర్వాత.. హంద్వారా, కుప్వారా, కుల్గాం, అనంతనాగ్‌, శ్రీనగర్‌ సౌత్‌ జోన్‌, బారాముల్లా వంటి కీలక ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించారు.

ఆరు రాష్ట్రపతి శౌర్య పతకాలు

జీవీ సందీప్‌ చక్రవర్తి.. ఇప్పటివరకు 6 రాష్ట్రపతి శౌర్య పతకాలు, 4 జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ గ్యాలంట్రీ మెడల్స్, ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ కమెండేషన్‌ డిస్క్ సహా అనేక పురస్కారాలను దక్కించుకున్నారు. గతంలో డాక్టర్ జీవీ సందీప్ చక్రవర్తి.. ‘ఆపరేషన్ మహాదేవ్’లో భాగంగా పహల్గామ్ ఉగ్రదాడి చేసిన ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టిన జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసు బృందానికి నాయకత్వం వహించారు. ఈ ఏడాది ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్‌ మెడల్‌ అందుకున్నారు.

శివరామచారి తాటికొండ

రచయిత గురించిశివరామచారి తాటికొండశివరామచారి తాటికొండ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ట్రెండింగ్ టాపిక్స్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు, విశ్లేషణలను శివరామచారి అందిస్తుంటారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలపై ఫ్యాక్ట్‌చెక్‌ వార్తలు రాసిన అనుభవం ఉంది. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ETV సంస్థలో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్‌ (EJS) నుంచి జర్నలిజంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.… ఇంకా చదవండి