Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Gold Price Today: ఊహించని రీతిలో పెరిగిన బంగారం, వెండి ధరలు ??

17 December 2025

Statue of Liberty: గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ

17 December 2025

Telangana: 70 ఏళ్లుగా సర్పంచ్ ఎన్నికలకు ఓటు వేయని గ్రామస్తులు.. ఎట్టకేలకు నెరవేరిన ఓటర్ల కల..!

17 December 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Drone City And Space Cities In AP,Drone Taxi: ఏపీలో డ్రోన్ ట్యాక్సీలు.. చంద్రబాబు ప్రకటన.. అసలేంటివి? – cm chandrababu on drone taxi and drone city and space cities in andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Drone City And Space Cities In AP,Drone Taxi: ఏపీలో డ్రోన్ ట్యాక్సీలు.. చంద్రబాబు ప్రకటన.. అసలేంటివి? – cm chandrababu on drone taxi and drone city and space cities in andhra pradesh

.By .14 November 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Drone City And Space Cities In AP,Drone Taxi: ఏపీలో డ్రోన్ ట్యాక్సీలు.. చంద్రబాబు ప్రకటన.. అసలేంటివి? – cm chandrababu on drone taxi and drone city and space cities in andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీవాసులకు సీఎం చంద్రబాబు శుభవార్త వినిపించారు. ఏపీలో త్వరలోనే డ్రోన్ ట్యాక్సీలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. విశాఖ సీఐఐ సదస్సులో మాట్లాడిన చంద్రబాబు.. డ్రోన్ ట్యాక్సీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఏపీలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు వర్చువల్‌గా శంకుస్థాపన జరిగింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ.. తిరుపతి, సత్యసాయి జిల్లాలలో స్పేస్ సిటీలను అభివృద్ధి చేయనున్నారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది.

Drone Taxi
ఏపీలో డ్రోన్ ట్యాక్సీలు(ఫోటోలు– TIMESOFINDIA.COM)
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలోనే డ్రోన్ ట్యాక్సీలను ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఏపీని పెట్టుబడులకు గేట్ వేగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. మరోవైపు సీఐఐ సదస్సుకు 72 దేశాల నుంచి 522 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే 2,500 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ఏపీ ప్రభుత్వం టెక్నాలజీ రంగం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఈ క్రమంలోనే ఏరో స్పే్స్, డ్రోన్, డిఫెన్స్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్న సంగతిని చంద్రబాబు వివరించారు. మరోవైపు చంద్రబాబు ప్రకటన తర్వాత డ్రోన్ ట్యాక్సీ అంటే ఏమిటనే దానిపై చర్చ మొదలైంది.

డ్రోన్ ట్యాక్సీ అనేది ఓ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది రిమోటెడ్‌గా లేదంటే స్వయంగా పనిచేస్తుంది. డ్రోన్ ట్యాక్సీ సాయంతో ప్రయాణికులను, సరుకులను రవాణా చేస్తుంటారు. డ్రోన్ ట్యాక్సీనే ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ వెహికల్ అని పిలుస్తుంటారు. రవాణాకు వేగవంతమైన, సమర్థవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందించేందుకు ప్రపంచంలోని పలు దేశాలు ఈ డ్రోన్ ట్యాక్సీలను అభివృద్ధి చేస్తున్నాయి. చైనా వంటి కొన్ని దేశాలలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.

మరోవైపు డ్రోన్ టాక్సీలు హెలికాప్టర్ల మాదిరిగానే పనిచేస్తాయి. అయితే పైలెట్ సాయం లేకుండానే తక్కువ దూరం ప్రయాణాలకు ఇవి ఉపయోగపడుతుంటాయి. ప్రయాణికులకు ఒకచోట నుంచి మరోచోటకు వేగంగా తీసుకెళ్లటంలో డ్రోన్ ట్యాక్సీలు ఉపయోగపడుతున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలకు కూడా చెక్ పెట్టొచ్చని అధికారులు చెప్తున్నారు.

మరోవైపు ఏపీలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శుక్రవారం శంకుస్థాపన జరిగింది. విశాఖపట్నం సీఐఐ సదస్సు వేదికగా సీఎం నారా చంద్రబాబు నాయుడు. కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ చేతుల మీదుగా వర్చువల్‌గా ఈ కార్యక్రమం జరిగింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీని నిర్మించనున్నారు. మొత్తంగా 300 ఎకరాల్లో డ్రోన్‌ సిటీ నిర్మాణం జరగనుంది. ఓర్వకల్లు డ్రోన్‌ సిటీలో టెస్టింగ్‌- సర్టిఫికేషన్‌ సెంటర్లు ఏర్పాటుచేస్తారు.

Chandrababu Rayachoty House Warming : ప్రభుత్వ సాయంతో పేదల ఇల్లు నిర్మాణం.. గృహ ప్రవేశానికి చంద్రబాబు నాయుడు!

అలాగే 25 వేల మందికి ట్రైనింగ్ ఇచ్చేలా సౌకర్యాలు కల్పిస్తారు. ఇక తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాల్లో స్పేస్‌ సిటీ ఏర్పాటు చేయనున్నారు. స్పేస్ సిటీ వలన 10 సంవత్సరాలలో రూ.25వేల కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనా. అలాగే 35 వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెప్తున్నారు. ఈ డ్రోన్ సిటీ , స్పేస్ సిటీలకు కేంద్రం సహకరించాలని చంద్రబాబు కోరారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి