ఏపీవాసులకు సీఎం చంద్రబాబు శుభవార్త వినిపించారు. ఏపీలో త్వరలోనే డ్రోన్ ట్యాక్సీలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. విశాఖ సీఐఐ సదస్సులో మాట్లాడిన చంద్రబాబు.. డ్రోన్ ట్యాక్సీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఏపీలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు వర్చువల్గా శంకుస్థాపన జరిగింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ.. తిరుపతి, సత్యసాయి జిల్లాలలో స్పేస్ సిటీలను అభివృద్ధి చేయనున్నారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది.

డ్రోన్ ట్యాక్సీ అనేది ఓ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది రిమోటెడ్గా లేదంటే స్వయంగా పనిచేస్తుంది. డ్రోన్ ట్యాక్సీ సాయంతో ప్రయాణికులను, సరుకులను రవాణా చేస్తుంటారు. డ్రోన్ ట్యాక్సీనే ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ వెహికల్ అని పిలుస్తుంటారు. రవాణాకు వేగవంతమైన, సమర్థవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందించేందుకు ప్రపంచంలోని పలు దేశాలు ఈ డ్రోన్ ట్యాక్సీలను అభివృద్ధి చేస్తున్నాయి. చైనా వంటి కొన్ని దేశాలలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
మరోవైపు డ్రోన్ టాక్సీలు హెలికాప్టర్ల మాదిరిగానే పనిచేస్తాయి. అయితే పైలెట్ సాయం లేకుండానే తక్కువ దూరం ప్రయాణాలకు ఇవి ఉపయోగపడుతుంటాయి. ప్రయాణికులకు ఒకచోట నుంచి మరోచోటకు వేగంగా తీసుకెళ్లటంలో డ్రోన్ ట్యాక్సీలు ఉపయోగపడుతున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలకు కూడా చెక్ పెట్టొచ్చని అధికారులు చెప్తున్నారు.
మరోవైపు ఏపీలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శుక్రవారం శంకుస్థాపన జరిగింది. విశాఖపట్నం సీఐఐ సదస్సు వేదికగా సీఎం నారా చంద్రబాబు నాయుడు. కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ చేతుల మీదుగా వర్చువల్గా ఈ కార్యక్రమం జరిగింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీని నిర్మించనున్నారు. మొత్తంగా 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ నిర్మాణం జరగనుంది. ఓర్వకల్లు డ్రోన్ సిటీలో టెస్టింగ్- సర్టిఫికేషన్ సెంటర్లు ఏర్పాటుచేస్తారు.
Chandrababu Rayachoty House Warming : ప్రభుత్వ సాయంతో పేదల ఇల్లు నిర్మాణం.. గృహ ప్రవేశానికి చంద్రబాబు నాయుడు!
అలాగే 25 వేల మందికి ట్రైనింగ్ ఇచ్చేలా సౌకర్యాలు కల్పిస్తారు. ఇక తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాల్లో స్పేస్ సిటీ ఏర్పాటు చేయనున్నారు. స్పేస్ సిటీ వలన 10 సంవత్సరాలలో రూ.25వేల కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనా. అలాగే 35 వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెప్తున్నారు. ఈ డ్రోన్ సిటీ , స్పేస్ సిటీలకు కేంద్రం సహకరించాలని చంద్రబాబు కోరారు.


