Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Yashasvi Jaiswal : సెంచరీ కొట్టి జట్టును గెలిపించిన స్టార్ బ్యాటర్..అసలు జైస్వాల్‎కి వచ్చిన ఆ జబ్బు ఏంటో తెలుసా ?

17 December 2025

ఇప్పుడే కొనేయండి.. కొత్త సంవత్సరంలో వాయింపే

17 December 2025

భారత ప్రజలు ఏదో ఒకరోజు రాహుల్ ను ప్రధానిని చేస్తారు

17 December 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Pension Status,AP Pensions: ఏపీలో వారందరికీ కొత్తగా పింఛన్లు.. మూడు నెలల్లోనే.. ప్రభుత్వ చీఫ్ విప్ ప్రకటన – ap government chief whip gv anjaneyulu on pensions for tdp workers
ఆంధ్రప్రదేశ్

Ap Pension Status,AP Pensions: ఏపీలో వారందరికీ కొత్తగా పింఛన్లు.. మూడు నెలల్లోనే.. ప్రభుత్వ చీఫ్ విప్ ప్రకటన – ap government chief whip gv anjaneyulu on pensions for tdp workers

.By .14 November 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Pension Status,AP Pensions: ఏపీలో వారందరికీ కొత్తగా పింఛన్లు.. మూడు నెలల్లోనే.. ప్రభుత్వ చీఫ్ విప్ ప్రకటన – ap government chief whip gv anjaneyulu on pensions for tdp workers
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పథకం కింద ఏపీ ప్రభుత్వం వివిధ వర్గాల వారికి పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని పెంచింది కూడా.. అయితే కొత్త పింఛన్లపై ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో అర్హులైన మూడు లక్షల మంది టీడీపీ కార్యకర్తలకు పింఛన్లు తొలగించారని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వచ్చే మూడు నెలల్లోగా వారందరికీ పింఛన్లు అందిస్తామని తెలిపారు.

AP Pensions
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు, రైతులు, మహిళలు, ఆటో డ్రైవర్లు, ఇలా ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పలు పథకాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల కింద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారికి ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. కేటగిరీల వారీగా ఈ పింఛన్లు నెలకు రూ.4 వేల నుంచి రూ.15 వేల వరకూ ఉన్నాయి. అయితే ఏపీలో పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కీలక వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి ఐదు మండలాలతో పాటుగా, టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు, టీడీపీ అనుబంధ విభాగాలకు ఇటీవల నియామకాలు చేపట్టారు.

కొత్తగా నియమితులైన వారితో శుక్రవారం రోజున ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జీవీ ఆంజనేయులు, వర్ల రామయ్య హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడిన జీవీ ఆంజనేయులు.. గత వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తల పింఛన్లు తొలగించారని ఆరోపించారు. అర్హులైన 3 లక్షల మంది టీడీపీ కార్యకర్తలకు పింఛన్లను తొలగించారని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. వచ్చే మూడు నెలల్లో అలాం పింఛన్లు కోల్పోయిన టీడీపీ కార్యకర్తలు అందరికీ కచ్చితంగా పింఛన్లు ఇప్పిస్తానని జీవీ ఆంజనేయులు హామీ ఇచ్చారు.

Chandrababu Rayachoty House Warming : ప్రభుత్వ సాయంతో పేదల ఇల్లు నిర్మాణం.. గృహ ప్రవేశానికి చంద్రబాబు నాయుడు!

మరోవైపు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పథకం కింద ఏపీలో వివిధ వర్గాలకు ప్రతి నెలా పింఛన్లు అందిస్తున్నారు. వృద్ధులు, వితంతువులకు ప్రతి నెలా నాలుగు వేల రూపాయలు చొప్పున పింఛన్లు అందిస్తున్నారు. అలాగే దివ్యాంగులకు రూ.6000 చొప్పున ప్రతి నెలా పింఛన్ అందిస్తున్నారు. పూర్తి వైకల్యంతో బాధపడేవారికి రూ.15000 చొప్పున పింఛన్ అందిస్తున్నారు.

ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, ట్రాన్స్ జెండర్లు ఇలా వివిధ వర్గాలకు ఏపీ ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారై ఉండి.. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి.. అన్ని అర్హతలు కలిగిన వారికి పింఛన్లు అందిస్తున్నారు. మరోవైపు ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ మొత్తం పెంచిన సంగతి తెలిసిందే.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి