ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పథకం కింద ఏపీ ప్రభుత్వం వివిధ వర్గాల వారికి పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని పెంచింది కూడా.. అయితే కొత్త పింఛన్లపై ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో అర్హులైన మూడు లక్షల మంది టీడీపీ కార్యకర్తలకు పింఛన్లు తొలగించారని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వచ్చే మూడు నెలల్లోగా వారందరికీ పింఛన్లు అందిస్తామని తెలిపారు.

కొత్తగా నియమితులైన వారితో శుక్రవారం రోజున ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జీవీ ఆంజనేయులు, వర్ల రామయ్య హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడిన జీవీ ఆంజనేయులు.. గత వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తల పింఛన్లు తొలగించారని ఆరోపించారు. అర్హులైన 3 లక్షల మంది టీడీపీ కార్యకర్తలకు పింఛన్లను తొలగించారని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. వచ్చే మూడు నెలల్లో అలాం పింఛన్లు కోల్పోయిన టీడీపీ కార్యకర్తలు అందరికీ కచ్చితంగా పింఛన్లు ఇప్పిస్తానని జీవీ ఆంజనేయులు హామీ ఇచ్చారు.
Chandrababu Rayachoty House Warming : ప్రభుత్వ సాయంతో పేదల ఇల్లు నిర్మాణం.. గృహ ప్రవేశానికి చంద్రబాబు నాయుడు!
మరోవైపు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పథకం కింద ఏపీలో వివిధ వర్గాలకు ప్రతి నెలా పింఛన్లు అందిస్తున్నారు. వృద్ధులు, వితంతువులకు ప్రతి నెలా నాలుగు వేల రూపాయలు చొప్పున పింఛన్లు అందిస్తున్నారు. అలాగే దివ్యాంగులకు రూ.6000 చొప్పున ప్రతి నెలా పింఛన్ అందిస్తున్నారు. పూర్తి వైకల్యంతో బాధపడేవారికి రూ.15000 చొప్పున పింఛన్ అందిస్తున్నారు.
ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, ట్రాన్స్ జెండర్లు ఇలా వివిధ వర్గాలకు ఏపీ ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన వారై ఉండి.. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి.. అన్ని అర్హతలు కలిగిన వారికి పింఛన్లు అందిస్తున్నారు. మరోవైపు ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ మొత్తం పెంచిన సంగతి తెలిసిందే.


