Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

‘మద’ ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం

24 January 2026

రూ. 78 లక్షల హాస్పిటల్‌ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI

24 January 2026

Gold: కుప్పకూలనున్న బంగారం ధరలు.. తొందరపడి ​కొంటే తలపట్టుకోవాల్సిందే! వెలుగులోకి సంచలన రిపోర్ట్‌

24 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Apsrtc Hire Buses Strike From January 12th,APSRTC: ఈ నెల 12 నుంచి సమ్మె.. ఆర్టీసీకి నోటీసులు, ఆగిపోనున్న బస్సులు! – apsrtc hire buses owners decided to halt their services across andhra pradesh from january 12th
ఆంధ్రప్రదేశ్

Apsrtc Hire Buses Strike From January 12th,APSRTC: ఈ నెల 12 నుంచి సమ్మె.. ఆర్టీసీకి నోటీసులు, ఆగిపోనున్న బస్సులు! – apsrtc hire buses owners decided to halt their services across andhra pradesh from january 12th

.By .8 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Apsrtc Hire Buses Strike From January 12th,APSRTC: ఈ నెల 12 నుంచి సమ్మె.. ఆర్టీసీకి నోటీసులు, ఆగిపోనున్న బస్సులు! – apsrtc hire buses owners decided to halt their services across andhra pradesh from january 12th
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Apsrtc Hire Buses Strike January 12th: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు ‘స్త్రీశక్తి’ పథకం వల్ల పెరిగిన నిర్వహణ ఖర్చులను భరించలేక, నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు అదనంగా చెల్లించాలని కోరుతూ ఈనెల 12 నుంచి సమ్మెకు సిద్ధమయ్యారు. ఆర్టీసీ యాజమాన్యం రూ.5,200 పెంపుతో సర్క్యులర్ జారీ చేయడంతో యజమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో సంక్రాంతి పండుగ సమయంలో 2,419 అద్దె బస్సులు నిలిచిపోతే ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడుతుంది.

హైలైట్:

  • ఏపీలో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సమ్మె
  • ఈ నెల 12 నుంచి బస్సుల్ని ఆపేస్తామన్నారు
  • ఇవాళ ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసులు ఇస్తారు
Apsrtc Hire Buses Strike
ఏపీఎస్‌ఆర్టీసీ అద్దె బస్సుల సమ్మె(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈనెల 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు ఇవ్వబోతున్నారు. ‘స్త్రీశక్తి’ పథకం అమలుతో పెరిగిన నిర్వహణ ఖర్చులు పెరిగాయి అంటున్నారు. అందుకే అదనంగా నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు చెల్లించాలని వారు కోరుతున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ యాజమాన్యం మంగళవారం రాత్రి అద్దె బస్సుల యజమానుల ప్రతినిధులతో చర్చించింది. చర్చల అనంతరం, ఒక్కో బస్సుకు నెలకు రూ.5,200 చొప్పున పెంచుతూ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిర్ణయంపై అద్దె బస్సుల యజమానుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంత పెంచుతున్నారనే విషయాన్ని స్పష్టంగా చెప్పకుండా, సర్క్యులర్ జారీ చేశారని సంఘం నాయకులు ఆరోపించారు. అందుకే, సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం ఒక్కో బస్సుకు నెలకు రూ.5,200 పెంచుతూ సర్క్యులర్ జారీ చేయడంతో యజమానులు తీవ్ర అసంతృప్తితో సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వారు ఒక్కో బస్సుకు నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు అదనంగా చెల్లించాలని ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.

ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మెకు సిద్ధమైతే.. మొత్తం 2,700 అద్దె బస్సుల్లో 2,419 బస్సులు.. ముఖ్యంగా స్త్రీశక్తి పథకం కింద నడుస్తున్న పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ వంటివి ఈ నెల 12 నుంచి నిలిచిపోతాయి. సంక్రాంతి పండుగ సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో బస్సులు ఆగిపోతే ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడుతుంది. సంక్రాంతి పండుగ సీజన్ అంటే ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేసే సమయం. ఈ సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో బస్సులు అందుబాటులో లేకపోతే, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడతారు. ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలు దొరకడం కష్టమవుతుంది. దీనివల్ల పండుగలకు ఇంటికి వెళ్లేవారికి, తిరిగి వచ్చే వారికి ఇబ్బందులు తప్పవు. మరి ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయంపై ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి