Andhra Pradesh Low Pressure In Bay Of Bengal,AP Rains: సంక్రాంతి ముందు తుఫాన్ ముప్పు.. ఏపీలోని ఈ జిల్లాల్లో మూడు రోజులు వర్షాలు – imd predicts moderate rains in andhra pradesh due to depression formed in bay of bengal
Andhra Pradesh Low Pressure Rains: సంక్రాంతి వేళ తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శ్రీలంక, తమిళనాడుల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఏపీలోని కొన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం ప్రభావంతో తీర ప్రాంత పోర్టులకు హెచ్చరికలు జారీ చేశారు.
హైలైట్:
సంక్రాంతికి ముందు తుఫాన్ ముప్పు
బంగాళాఖాతంలో వాయుగుండం
ఏపీలో మూడు రోజులు వర్షాలు
ఏపీలో భారీ వర్షాలు(ఫోటోలు– Samayam Telugu)
సంక్రాంతి పండుగకు ముందు తుఫాన్ ముప్పు పొంచి ఉందని చెబుతోంది వాతావరణశాఖ. దక్షిణాది రాష్ట్రాలపై వాయుగుండం ప్రభావం ఉందని.. ఒకవేళ పరిస్థితులు మారితే తుఫాన్గా మారే అవకాశం ఉంది అంటున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడగా.. వాయుగుండంగా బలపడింది. ఈ వాయుగుండం ప్రస్తుతం శ్రీలంకలోని పొట్టువిల్కు 570 కిలోమీటర్లు, బట్టికోలాకు 620 కిలోమీటర్లు, తమిళనాడులోని కరైకల్కు 990 కిలోమీటర్లు, చెన్నైకి 1,140 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. ఇది వచ్చే 48 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఈ వాయుగుండం ప్రభావంతో శుక్రవారం, శనివారం, ఆదివారం శ్రీలంక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏపీలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కూడా శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి అంటున్నారు. ఈ వాయుగుండం ప్రభావంతో విశాఖపట్నం, మచిలీపట్నం, గంగవరం, కాకినాడ, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సూచనలను పాటించాలని సూచించారు.
ఈశాన్య రుతుపవనాలు డిసెంబర్ 31తో ముగిసిపోతాయి. వాతావరణ శాస్త్రం ప్రకారం, జనవరి, ఫిబ్రవరి నెలల్లో బంగాళాఖాతంలో వాయుగుండాలు, తుఫాన్లు ఏర్పడే అవకాశాలు చాలా తక్కువ. 1891 నుంచి 2024 వరకు ఈ రెండు నెలల కాలంలో, మొత్తం రెండు తీవ్ర తుఫాన్లు, ఆరు తుఫాన్లు, 12 వాయుగుండాలు నమోదయ్యాయి. ఈ ఏర్పడిన తుఫాన్లు, వాయుగుండాలలో ఎక్కువ శ్రీలంకలోనే తీరం దాటాయని చెబుతున్నారు. కేవలం మూడు వాయుగుండాలు మినహా, మిగిలినవన్నీ సంక్రాంతి పండుగకు ముందే ఏర్పడ్డాయి. వీటిలో ఒక తుఫాన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకింది.
‘ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం రాగల 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడనుంది. ఈప్రభావంతో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి