Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Kara Bath Recipe: రవ్వతో ఉప్మా అంటే బోర్ కొడుతోందా? అయితే ఈ కర్ణాటక స్టైల్ ‘కారా బాత్’ ట్రై చేయండి!

24 January 2026

Tollywood: సీనియర్ ఎన్టీఆర్‌తో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో ఫేమస్ యాక్టర్ కమ్ డైరెక్టర్..

24 January 2026

ముద్దుగుమ్మల ఆశలు అడియాశలు.. సంక్రాంతికి అనుకోని షాక్

24 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Gudivada Bypass Road Opened,ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చిన మరో కొత్త బైపాస్.. ట్రాఫిక్ ఫ్రీ జర్నీ, దూసుకెళ్లడమే – ap minister bc janardhan reddy opened gudivada bypass road
ఆంధ్రప్రదేశ్

Gudivada Bypass Road Opened,ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చిన మరో కొత్త బైపాస్.. ట్రాఫిక్ ఫ్రీ జర్నీ, దూసుకెళ్లడమే – ap minister bc janardhan reddy opened gudivada bypass road

.By .8 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Gudivada Bypass Road Opened,ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చిన మరో కొత్త బైపాస్.. ట్రాఫిక్ ఫ్రీ జర్నీ, దూసుకెళ్లడమే – ap minister bc janardhan reddy opened gudivada bypass road
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Gudivada Bypass Road Started: గుడివాడ బైపాస్ రోడ్డు ప్రారంభమైంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.3,380 కోట్లతో కొత్త ప్రాజెక్టులు, రూ.1,081 కోట్లతో రహదారుల మరమ్మతులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఏపీలో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించారని.. నాణ్యతతో మే నెలాఖరులోగా పనులు పూర్తి చేస్తామని మంత్రి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. గుడివాడ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు.

హైలైట్:

  • గుడివాడ బైపాస్‌ను ప్రారంభించిన మంత్రి
  • రూ.2.50 కోట్ల నిధులతో బైపాస్ అభివృద్ధి
  • మూడు కిలోమీటర్లు ఉన్న గుడివాడ బైపాస్
Gudivada Bypass
గుడివాడ బైపాస్ ప్రారంభమైంది(ఫోటోలు– Samayam Telugu)
ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. కొత్త ప్రాజెక్టులతో పాటుగా పాత ప్రాజెక్టుల్ని వేగవంతం చేసి పూర్తి చేస్తోంది. తాజాగా మరో బైపాస్ అందుబాటులోకి వచ్చింది. కృష్ణా జిల్లా గుడివాడలో రూ.2.50 కోట్ల నిధులతో అభివృద్ధి చేసిన గుడివాడ బైపాస్ రోడ్డు ప్రారంభమైంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, గుడివాడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కూటమి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి బైపాస్ నాణ్యతను పరిశీలించి, ఎమ్మెల్యేతో కలిసి మూడు కిలోమీటర్ల బైపాస్ రోడ్డులో బైక్‌పై ప్రయాణించారు. ఈ బైపాస్ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ కష్టాలు తొలగిపోవడంతో పాటుగా.. గుడివాడ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం కోసం రూ.3,380 కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నామన్నారు మంత్రి జనార్దన్ రెడ్డి. ఇది రాష్ట్ర చరిత్రలో తొలిసారని.. ఈ పనుల కోసం టెండర్లు పిలిచామని, కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పారు. నాణ్యతలో ఎటువంటి లోటు లేకుండా వచ్చే మే నెల చివరి నాటికి ఈ పనులన్నీ పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు మంత్రి. రాష్ట్రవ్యాప్తంగా రూ.1,081కోట్ల వ్యయంతో 16 వేల కి.మీ మేరకు రహదారుల మరమ్మతులు, గుంతలు పూడ్చే కార్యక్రమం పూర్తిచేశామని మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు.

గతంలో గుడివాడను నాశనం చేసిన పాలనకు భిన్నంగా నేడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా స్పష్టమైన మార్పు తీసుకొస్తోంది అన్నారు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. గుడివాడ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి చేస్తూ ఆర్థిక పరిమితులు ఉన్నా ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. గుడివాడ బైపాస్ రోడ్డు కేవలం ఒక రోడ్డు కాదని.. ఇది ప్రజల ఆశ, ఆవేదన, ఆనందంతో ముడిపడ్డ భావోద్వేగ అంశమన్నారు ఆ విషయాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వయంగా చూశారని.. గుడివాడ అభివృద్ధికి అండగా నిలుస్తున్న ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి