Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Silver: సెంచరీ కొట్టిన సిల్వర్‌..! ఆసక్తికర పోస్ట్‌ పెట్టిన రాబర్ట్‌ కియోసాకి

24 January 2026

Tech Tips: మీ ఫోన్‌ను అమ్మేస్తున్నారా? ఈ 5 పనులు తప్పక చేయండి.. లేకుంటే మీ పని అయిపోయినట్లే..

24 January 2026

అతనంటే నాకు పిచ్చి ఇష్టం.. లవ్లీ బాయ్ అంటూ ప్రేమ కురిపించిన జబర్దస్త్ నటి

24 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Amaravati Statutory Status,ఢిల్లీలో చంద్రబాబు.. అమిత్ షాకు స్పెషల్ రిక్వెస్ట్, అమరావతికి కేంద్రం నుంచి శుభవార్త! – ap cm chandrababu naidu meet union minister amit shah and request on amaravati statutory status
ఆంధ్రప్రదేశ్

Amaravati Statutory Status,ఢిల్లీలో చంద్రబాబు.. అమిత్ షాకు స్పెషల్ రిక్వెస్ట్, అమరావతికి కేంద్రం నుంచి శుభవార్త! – ap cm chandrababu naidu meet union minister amit shah and request on amaravati statutory status

.By .8 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Amaravati Statutory Status,ఢిల్లీలో చంద్రబాబు.. అమిత్ షాకు స్పెషల్ రిక్వెస్ట్, అమరావతికి కేంద్రం నుంచి శుభవార్త! – ap cm chandrababu naidu meet union minister amit shah and request on amaravati statutory status
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Chandrababu Meet Amit Shah On Amaravati: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు, అమరావతిని రాజధానిగా చట్టబద్ధం చేయాలని, విభజన చట్టంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ఉపాధి హామీ, గృహ నిర్మాణం, రహదారులు వంటి కీలక రంగాలకు కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలని కోరారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులకు చేయూతనివ్వాలని చంద్రబాబు అమిత్ షాను కోరారు.

హైలైట్:

  • కేంద్రమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ
  • అమరావతికి చట్టబద్దతపై అమిత్ షాకు రిక్వెస్ట్
  • కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోరిన చంద్రబాబు
Chandrababu Meet Amit Shah
అమిత్ షాను కలిసిన చంద్రబాబు(ఫోటోలు– Samayam Telugu)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఢిల్లీలో కలిశారు. ఏపీ రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేయాలని కోరారు. విభజన చట్టంలో అమరావతిని చేర్చాలని.. దీనికోసం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతికి పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తే రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని, ప్రజల ఆశలు నెరవేరుతాయని చంద్రబాబు అన్నారు. అలాగే పెట్టుబడులు పెట్టేవారికి కూడా భరోసా ఉంటుందన్నారు. కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతోంది.. అయితే ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని అడుగుతున్నారు. కేంద్రం అమరావతి విషయంలో సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిష్పత్తిలో ఏపీకి వెసులుబాట్లు కల్పించాలని కోకారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూర్చాలి. అయితే ఈ విషయంలో ఏపీకి కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు కల్పించాలని చంద్రబాబు అమిత్‌షాను కోరారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు, కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సభ్యుడిగా ఉన్న అమిత్‌షాను అభ్యర్థించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో రాష్ట్రానికి రావాల్సిన వాటాను పెంచాలని చంద్రబాబు కోరారు. ముఖ్యంగా గృహ నిర్మాణం, రహదారులు, రైల్వే ప్రాజెక్టుల వంటి కీలక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, రెవెన్యూలోటును పూడ్చడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా, రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి, రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్‌ (ఉద్యానవన) కేంద్రంగా తీర్చిదిద్దడానికి బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రతిపాదనలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పూర్వోదయ పథకం కింద రాష్ట్రం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి, నిధులు విడుదల చేయాలని చంద్రబాబు అమిత్ షాను కోరారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లు, భవనాలు వంటి మౌలిక సదుపాయాలను బాగుచేయడానికి ఆర్థిక సాయం కోరారు. రాష్ట్రంలో పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టడానికి కేంద్రం నుంచి ఆర్థిక సహాయం అందాలని, అనుమతులు కూడా త్వరగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

గిరిజన ప్రాంతమైన రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేశామని, ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి హోంశాఖ నుంచి తగినన్ని నిధులు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి కేంద్రం చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సులో చేసుకున్న ఒప్పందాల ప్రకారం పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అమిత్ షాకు వివరించారు. తాను ఈరోజే పోలవరం ప్రాజెక్టును సందర్శించి వచ్చానని, అక్కడి పనుల పురోగతి గురించి కూడా అమిత్ షాకు తెలియజేశారు. మరోవైపు చంద్రబాబు ఎల్జీ ప్రతినిధులతో కూడా సమావేశం అయ్యారు. శ్రీసిటీలో ఏర్పాటు చేసిన కొత్త పరిశ్రమపై చర్చించారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి