Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Digital Babysitter: పిల్లలకు మొబైల్ ఫోన్ ఇస్తున్నారా? జాగ్రత్త.. ‘డిజిటల్ బానిసత్వం’ దిశగా చిన్నారులు!

24 January 2026

Harsha Vardhan: మీకు మద్యం తాగే అలవాటు ఉందా? అయితే నటుడు హర్ష వర్ధన్ చెప్పిన ఈ సూచనలు పాటిస్తే మంచిది

24 January 2026

EPFO: మారిన రూల్స్‌.. 2026లో రిటైర్‌ అయ్యే ప్రైవేట్‌ ఉద్యోగులకు పెన్షన్‌ ఎంత వస్తుందంటే..?

24 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Pmay-g Beneficiary Rs 2.5 Lakhs,ఏపీలో పేదలు ఒక్కొక్కరికి రూ.2.50 లక్షలు.. వచ్చే నెలలో ఫిక్స్, రెడీగా ఉండండి! – pm awas yojana gramin scheme houses likely sanctioned next month to those identified as eligible in andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Ap Pmay-g Beneficiary Rs 2.5 Lakhs,ఏపీలో పేదలు ఒక్కొక్కరికి రూ.2.50 లక్షలు.. వచ్చే నెలలో ఫిక్స్, రెడీగా ఉండండి! – pm awas yojana gramin scheme houses likely sanctioned next month to those identified as eligible in andhra pradesh

.By .8 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Pmay-g Beneficiary Rs 2.5 Lakhs,ఏపీలో పేదలు ఒక్కొక్కరికి రూ.2.50 లక్షలు.. వచ్చే నెలలో ఫిక్స్, రెడీగా ఉండండి! – pm awas yojana gramin scheme houses likely sanctioned next month to those identified as eligible in andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh PMAY-G Beneficiary Update: పేదల సొంతింటి కలను నిజం చేసే పీఎం ఆవాస్‌ యోజన గ్రామీణ్‌ 2.0 పథకం కింద, అర్హులకు ఇళ్ల మంజూరు ప్రక్రియ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాయి. ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించి, నిర్మాణానికి తోడ్పడుతుంది. అర్హులైన వారిని గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు.

హైలైట్:

  • ఏపీలో పీఎం ఆవాస్‌ యోజన గ్రామీణ్‌ 2.0 పథకం
  • వచ్చే నెలలో అర్హులైన వారికి ఇళ్లు మంజూరు
  • క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్న అధికారులు
AP PMAY-G Beneficiary Survey
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-గ్రామీణ పథకం(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పేదల సొంతింటి కలను నిజం చేయడానికి పీఎం ఆవాస్‌ యోజన గ్రామీణ్‌ 2.0 పథకాన్ని అమలు చేస్తోంది. ఇంటి స్థలం లేని వారికి లేదా సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఈ పథకం వర్తిస్తుంది. గత ఏడాది డిసెంబర్ 14 వరకు దరఖాస్తులు స్వీకరించగా.. 60 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను గుర్తించడానికి అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. అర్హులైన వారికి వచ్చే నెలలో ఇళ్లు మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుంది.ఈ పథకం కింద, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షలు మంజూరు చేస్తాయి. ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించి, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. సొంత స్థలం ఉండి, ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి కూడా ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం లభిస్తుంది. అధికారులు అర్హులను గుర్తించడానికి క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తున్నారు. పరిపాలనా ఆమోదం పొందిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. పనులు దశలవారీగా పూర్తయిన తర్వాత బిల్లులు చెల్లిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలం ఉండి, అర్హత ఉన్న వారందరినీ జాబితాలో చేర్చి, అధికారులకు నివేదించారు.

ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకునేవారు గ్రామ సచివాలయంలోని ఇంజినీరింగ్ సహాయకులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌పోర్టు సైజు ఫోటోలు సమర్పించాలి. సొంత స్థలం లేనివారు కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోటోలతో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా అర్హులైన వారికి ఇల్లు కట్టుకునే కల నెరవేరుతుందని చెబుతున్నారు. త్వరలోనే అర్హుల్ని గుర్తించి జాబితాలు విడుదల చేయనున్నారు.. వచ్చే నెలలో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి