Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Satya Krishnan: ఆ కారణంతోనే సినిమాలు చేయడం మానేశాను.. నటి సత్యకృష్ణన్ కామెంట్స్..

16 January 2026

Urine: బట్టల్లో యూరిన్ పడిపోవడం ఎలాంటి సమస్య…?

16 January 2026

Brahmaji : 60 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా, యంగ్‏గా.. అసలు సీక్రెట్ చెప్పిన బ్రహ్మాజీ..

16 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Govt Sick Rooms In Schools,విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట.. సర్కారు బడుల్లో ప్రత్యేక ‘సిక్’ రూమ్‌లు ఏర్పాటు.. – ap govt to establish medical sick rooms in schools across state
ఆంధ్రప్రదేశ్

Ap Govt Sick Rooms In Schools,విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట.. సర్కారు బడుల్లో ప్రత్యేక ‘సిక్’ రూమ్‌లు ఏర్పాటు.. – ap govt to establish medical sick rooms in schools across state

.By .8 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Govt Sick Rooms In Schools,విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట.. సర్కారు బడుల్లో ప్రత్యేక ‘సిక్’ రూమ్‌లు ఏర్పాటు.. – ap govt to establish medical sick rooms in schools across state
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనారోగ్యానికి గురైన విద్యార్థులకు తక్షణ సంరక్షణ అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 600లకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో సిక్ రూమ్‌లను ఏర్పాటు చేయనుంది. 2026 మార్చి నాటికి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో సిక్ రూమ్ ఏర్పాటు కోసం రూ. 5 లక్షల చొప్పున సర్వ శిక్ష అభియాన్ నిధులు విడుదల చేసినట్లు సమాచారం. కాగా, ఈ సిక్ గదిలో ప్రథమ చికిత్స కిట్లు, అవసరమైన ఓవర్ ది కౌంటర్ మందులు, పరిశుభ్రత వస్తువులు అందుబాటులో ఉంటాయి.

హైలైట్:

  • పిల్లల ఆరోగ్యానికి పెద్దపీట
  • ప్రభుత్వ బడుల్లో ప్రత్యేక ‘సిక్’ రూమ్‌లు ఏర్పాటు
  • నిధులు విడుదల చేసిన సర్వ శిక్ష అభియాన్
AP govt to establish medical sick rooms in schools
ప్రభుత్వ పాఠశాలల్లో సిక్ రూమ్‌లు ఏర్పాటు(ఫోటోలు– Samayam Telugu)
పాఠశాల వేళల్లో అనారోగ్యానికి గురైన లేదా గాయపడిన విద్యార్థులకు తక్షణ సంరక్షణ, విశ్రాంతి, పర్యవేక్షణ చేయడానికి ప్రత్యేకంగా ఓ గది ఉండాలి. దీన్నే మెడికల్, సిక్ లేదా నర్సు ఆఫీస్ అని కూడా పిలుస్తారు. అయితే చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి గదులు ఉండటం లేదు. ఈ నేపథ్యంలో పిల్లల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సిక్‌ గదులను ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రాథమిక వైద్య సహాయాన్ని అందించేందుకు.. పాఠశాలలో ప్రత్యేక సిక్ గదులు ఏర్పాటు చేస్తోంది.

అప్పటి నుంచి అందుబాటులో..

ప్రభుత్వ బడుల్లో ప్రత్యేక సిక్‌ రూమ్‌లను 2026 మార్చి చివరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సమగ్ర శిక్షా అభియాన్‌ చర్యలు చేపట్టింది. అందుకోసం స్కూల్‌లో పెద్దగా ఉండే ఒక తరగతి గదిని.. రెండుగా విభజించి సిక్‌ రూమ్‌గా మారుస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 600లకు పైగా పీఎంశ్రీ పాఠశాలల్లో తొలి దశలో వీటిని ఏర్పాటు చేస్తారు. కాగా, ఒక్కో సిక్ రూమ్ కోసం రూ. 5 లక్షల చొప్పున నిధులు విడుదల చేసింది సర్వ శిక్ష అభియాన్.

పాఠశాలల్లో ఏర్పాటు చేసే ఈ సిక్‌ రూమ్‌ల నిర్వహణకు.. స్కూల్ సిబ్బందితో పాటు ఆరోగ్య నిపుణులు, తల్లిదండ్రులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తారు. స్థానిక ఆసుపత్రుల సహకారంతో విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. పరిసరాల పరిశుభ్రత, మానసిక ఆరోగ్యం.. బాలికలకు నెలసరి పరిశుభ్రత, అనారోగ్య సమస్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రత్యేక పుస్తకాలు, వీడియోలను తయారు చేసి అవగాహన కల్పిస్తారు. ఇక స్థానిక ఆసుపత్రులతో కలిసి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఒక్కో విద్యార్థి డిజిటల్‌ ఆరోగ్య ప్రొఫైల్‌ తయారుచేస్తారు. అంతేకాకుండా పిల్లల్లో ఒత్తిడి, మానసిక సమస్యలను పరిష్కరించడానికి మానసిక నిపుణుల సేవలను ఉపయోగించుకుంటారు.

సిక్ రూమ్‌లో ఏమేం ఉంటాయి..

సిక్ రూమ్‌లో చేతులు కడుక్కునేందుకు, విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అంతేకాకుండా మరుగుదొడ్లు, మంచినీరు, శానిటరీ ప్యాడ్లు అందుబాటులో ఉంచుతారు. గాయాలు అయినప్పుడు ప్రథమచికిత్స కోసం ఉపయోగించే.. ఫస్ట్‌ఎయిడ్‌ కిట్‌లు ఉంటాయి. క్లినికల్ వేస్ట్ కోసం ప్రత్యేక బిన్‌లు కూడా ఉంటాయి. ఇక ప్రాథమిక ఓవర్ ది కౌంటర్ ఔషధాలు అందుబాటులో ఉంటాయి. ప్రతి సంఘటన రికార్డ్ చేసేందుకు, అత్యవసర సేవలకు సమాచారం అందించేందుకు ప్రత్యేక టెలిఫోన్ లైన్ ఉంటుంది.

భూపతి రాజు

రచయిత గురించిభూపతి రాజుభూపతి రాజు సమయం తెలుగులో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ETV భారత్ సంస్థలో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్, స్పోర్ట్స్, సినిమా న్యూస్ రాశారు. లోక్‌సభ ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. భూపతి రాజు ఈనాడు జర్నలిజం స్కూల్‌ (EJS) నుంచి జర్నలిజంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.… ఇంకా చదవండి