Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Silver: సెంచరీ కొట్టిన సిల్వర్‌..! ఆసక్తికర పోస్ట్‌ పెట్టిన రాబర్ట్‌ కియోసాకి

24 January 2026

Tech Tips: మీ ఫోన్‌ను అమ్మేస్తున్నారా? ఈ 5 పనులు తప్పక చేయండి.. లేకుంటే మీ పని అయిపోయినట్లే..

24 January 2026

అతనంటే నాకు పిచ్చి ఇష్టం.. లవ్లీ బాయ్ అంటూ ప్రేమ కురిపించిన జబర్దస్త్ నటి

24 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Students Get Reliance Foundation Scholarship,ఏపీ విద్యార్థులు అదరగొట్టారు.. దేశంలోనే టాప్ ప్లేస్, ఒక్కొక్కరికి రూ.2లక్షల నుంచి రూ.6 లక్షల వరకు – andhra pradesh 1345 students get reliance foundation scholarship
ఆంధ్రప్రదేశ్

Ap Students Get Reliance Foundation Scholarship,ఏపీ విద్యార్థులు అదరగొట్టారు.. దేశంలోనే టాప్ ప్లేస్, ఒక్కొక్కరికి రూ.2లక్షల నుంచి రూ.6 లక్షల వరకు – andhra pradesh 1345 students get reliance foundation scholarship

.By .8 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Students Get Reliance Foundation Scholarship,ఏపీ విద్యార్థులు అదరగొట్టారు.. దేశంలోనే టాప్ ప్లేస్, ఒక్కొక్కరికి రూ.2లక్షల నుంచి రూ.6 లక్షల వరకు – andhra pradesh 1345 students get reliance foundation scholarship
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Students Get Reliance Foundation Scholarships: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అదరగొట్టారు. దేశంలోనే అత్యధికంగా 1,345 మంది ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి 538 మందితో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. పేదరికం నుంచి వచ్చిన ఎంతోమందికి, బాలికలకు, దివ్యాంగులకు ఈ స్కాలర్‌షిప్‌లు అండగా నిలుస్తున్నాయి. ఇది కేవలం ఆర్థిక సహాయమే కాదు, భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దే గొప్ప అవకాశం. దేశవ్యాప్తంగా మొత్తం 5,100 మంది ఎంపికయ్యారు.

హైలైట్:

  • రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు
  • అదరగొట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు
  • 1345మంది విద్యార్థులు ఎంపికయ్యారు
Ap Students Reliance Scholarship
ఏపీ విద్యార్థులకు రిలయన్స్ స్కాలర్‌షిప్(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అదరగొట్టారు. రిలయన్స్ ఫౌండేషన్ అండర్‌గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లు సాధించారు. 2025-26 విద్యా సంవత్సరానికి ప్రకటించిన స్కాలర్‌షిప్‌లలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. దేశంలోనే అత్యధికంగా 1,345 మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఈ ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్‌లకు ఎంపికయ్యారు. తెలంగాణ విషయానికి వస్తే.. 538మంది విద్యార్థులు ఎంపికయ్యారు. తెలుగు విద్యార్థులు అత్యంత కఠినమైన జాతీయస్థాయి ఎంపిక ప్రక్రియలో సత్తా చాటారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 5,100 మంది యూజీ, పీజీ విద్యార్థులు ఉన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ ఈ స్కాలర్‌షిప్‌లను ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉన్నత విద్యకు దూరం కాకుండా అండగా నిలుస్తోంది. ప్రతిభ, ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఎంపిక చేసిన వారిలో 83% మంది కుటుంబ వార్షికాదాయం రూ.2.5 లక్షల లోపే ఉంది. అంటే చాలామంది పేదరికం నుంచి వచ్చిన విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌లు దక్కాయి. బాలికలు, దివ్యాంగ విద్యార్థులకు కూడా ఈ స్కాలర్‌షిప్‌లలో తగిన ప్రాధాన్యం ఇచ్చారు. ఎంపికైన యూజీ విద్యార్థులకు రూ.2 లక్షల వరకు, పీజీ విద్యార్థులకు రూ.6 లక్షల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఇది వారి చదువుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ స్కాలర్‌షిప్‌లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు.

విద్యార్థులను భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దడానికి కూడా రిలయన్స్ ఫౌండేషన్ ఎంతో సహకారం అందిస్తుంది. అంటే, వారికి శిక్షణ, మార్గదర్శకత్వం కూడా లభిస్తుంది. ఈ ఫలితాలు తెలుగు విద్యార్థుల సామర్థ్యాన్ని, కష్టపడే తత్వాన్ని తెలియజేస్తున్నాయి. దేశంలోనే అత్యుత్తమ విద్యను పొందడానికి ఇది వారికి ఒక గొప్ప అవకాశం. దేశవ్యాప్తంగా మొత్తం 5,100 మంది విద్యార్థులు ఎంపిక కాగా.. వారిలో యూజీ 5,000, పీజీ 100మంది ఉన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ ఇప్పటివరకు 33,471 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించింది. ఈ ఆర్థిక సహాయంతో పాటు, విద్యార్థులను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దడానికి మెంటారింగ్, నాయకత్వ శిక్షణ, గ్లోబల్ అల్యూమ్నీ నెట్‌వర్క్ సహకారం కూడా అందిస్తోంది. మొత్తం మీద ఏపీ విద్యార్థులు ప్రతిభ చాటారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి