Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

UPSC Civils 2025 Interview Date: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ తేదీల షెడ్యూల్‌ మారిందోచ్‌.. కొత్త తేదీ ఇదే

17 January 2026

Saturday astrology: శనివారం పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు.. ఏం చేయాలో తెలుసా?

17 January 2026

Anasuya: పద్దతిగా ఉండాలని చెబితే కేసు పెడతారా? : సంధ్యా రెడ్డి

17 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Brother Builds Temple For Sister Nellore,చెల్లి కోసం గుడి కట్టి 14 ఏళ్లుగా నిత్య పూజలు.. సోదరిపై ప్రేమ చాటుకుంటున్న నెల్లూరు జిల్లా వాసి.. – brother built temple for sister in venkatachalam nellore district
ఆంధ్రప్రదేశ్

Brother Builds Temple For Sister Nellore,చెల్లి కోసం గుడి కట్టి 14 ఏళ్లుగా నిత్య పూజలు.. సోదరిపై ప్రేమ చాటుకుంటున్న నెల్లూరు జిల్లా వాసి.. – brother built temple for sister in venkatachalam nellore district

.By .8 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Brother Builds Temple For Sister Nellore,చెల్లి కోసం గుడి కట్టి 14 ఏళ్లుగా నిత్య పూజలు.. సోదరిపై ప్రేమ చాటుకుంటున్న నెల్లూరు జిల్లా వాసి.. – brother built temple for sister in venkatachalam nellore district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


నెల్లూరు జిల్లా వెంకటాచలంకు చెందిన శివప్రసాద్.. రోడ్డు ప్రమాదంలో మరణించిన తన చెల్లెలు సుబ్బలక్ష్మి జ్ఞాపకార్థం గుడి కట్టాడు. ఆర్థిక స్తోమత లేకపోయినా.. తన ఇంట్లోనే కొంత భాగాన్ని గుడిగా మార్చాడు. అనంతరం ఒంగోలులో తన చెల్లెలి విగ్రహాన్ని తయారు చేయించి గుడిలో ప్రతిష్టించాడు. అప్పటినుంచి దాదాపు 14 ఏళ్లుగా శివప్రసాద్ కుటుంబం సుబ్బలక్ష్మికి నిత్యం పూజలు చేస్తున్నారు. ఈ అరుదైన సంఘటన మానవ సంబంధాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

హైలైట్:

  • చెల్లి కోసం గుడి కట్టిన అన్న
  • సోదరిపై ప్రేమ చాటుకుంటున్న నెల్లూరు జిల్లా వాసి
  • 14 ఏళ్లుగా చెల్లికి పూజలు చేస్తున్న అన్న
Brother Built Temple For Sister in Venkatachalam Nellore District
చెల్లి కోసం గుడి కట్టి అన్న(ఫోటోలు– Samayam Telugu)
మరణాంతరం కన్న తల్లిదండ్రులకు నిలువెత్తు విగ్రహ రూపం ఇచ్చి పూజించిన పిల్లలను చూసి ఉంటారు. భార్యకు గుడి కట్టిన భర్త గురించి విని ఉంటారు. కానీ తోడ పుట్టిన చెల్లికి గుడి కట్టిన అన్న గురించి మీరు విన్నారా? మానవ సంబంధాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. ప్రమాదవశాత్తు తిరిగి రాని లోకాలకు వెళ్ళిన చెల్లిని పూజిస్తున్న అన్నను చూసిన వారు.. అతడి గురించి విన్న వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. గత 14 ఏళ్లుగా ఇలా చెల్లికి పూజలు చేస్తున్నాడు ఓ అన్న. ఇంతకీ ఆ అన్న ఎవరు, అతడి చెల్లిలి కథేంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. చెల్లికి గుడి కట్టిన అన్న పేరు శివప్రసాద్. నెల్లూరు జిల్లా వెంకటాచలం గ్రామానికి చెందిన శివ ప్రసాద్ ఇంటర్ వరకు చదువుకున్నారు. అనంతరం ఆత్మకూరు బస్ స్టాండ్‌లో జ్యూస్ దుకాణం నడుపుతున్నాడు. ఇతడికి తన చెల్లి సుబ్బలక్ష్మి అంటే ప్రాణం. ఆమె చదువుతో పాటు ఆటపాటల్లోనూ ముందుండేది. కాగా, సుబ్బలక్ష్మి డిగ్రీ పూర్తయ్యాక.. 2009లో అటవీ శాఖ ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. దీంతో ఆమెకు నాయుడుపేటలోని చిల్లకూరు బీట్‌లో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వెంకటగిరిలోని అటవీ శాఖ కార్యాలయానికి బదిలీ అయింది.

డ్యూటీలో భాగంగా చిల్లకూరు వరకు ప్రయాణిస్తుండేది సుబ్బలక్ష్మి. ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లి వస్తుండగా.. 2011 సెప్టెంబర్ 20న నెల్లూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుబ్బలక్ష్మి చనిపోయింది. అల్లారుముద్దుగా చూసుకున్న చెల్లి సుబ్బలక్ష్మి చనిపోవడంతో.. శివప్రసాద్ కన్నీరుమున్నీరు అయ్యాడు. తన చెల్లి మరణాన్ని జీర్జించుకోలేకపోయాడు. భౌతికంగా దూరమైనా.. తన చెల్లి జ్ఞాపకాలతో బతుకుతున్న శివప్రసాద్.. ఆమెకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆలయం నిర్మించడానికి ఆర్థిక స్తోమత లేకున్నా వెనక్కి తగ్గలేదు శివ ప్రసాద్. ఎవరి సాయం తీసుకోకుండా గుడి కట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

ఈ క్రమంలో మొదటగా తన ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో గుడి పనులు ప్రారంభించాడు శివప్రసాద్. అయితే అది ప్రభుత్వ స్థలం కావడంతో అధికారులు అతడిని అడ్డుకున్నారు. అయినా వెనకడుగు వేయకుండా.. తన ఇంట్లోనే కొంత భాగాన్ని గుడిగా మార్చాడు. అనంతరం గుంటూరు జిల్లా తెనాలిలో.. తన చెల్లెలి విగ్రహం చేయించి గుడిలో ప్రతిష్టించాడు. అప్పటినుంచి అతడి కుటుంబం.. సుబ్బలక్ష్మి విగ్రహానికి పూజలు చేస్తూ ఆరాధిస్తున్నారు.

కలకాలం ఈ బంధం కొనసాగాలని ..

మొత్తం ఐదుగురు తోబుట్టువుల్లో సుబ్బలక్ష్మి నాలుగో సంతానం. అయితే సుబ్బలక్ష్మి భౌతికంగా దూరమైనా.. ఆమె ప్రేమ తమతోనే ఉందని శివప్రసాద్ గతంలో చెప్పాడు. తన చెల్లిని మర్చిపోకుండా ఇలా గుడికట్టామని తెలిపాడు. దీంతో తన చెల్లి తమతోనే ఉంటుందన్నాడు. తాము చనిపోయినా, ఇంకో తరం వచ్చినా.. తమ బంధం ఇలాగే కొనసాగుతుందని చెప్పాడు.

భూపతి రాజు

రచయిత గురించిభూపతి రాజుభూపతి రాజు సమయం తెలుగులో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ETV భారత్ సంస్థలో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్, స్పోర్ట్స్, సినిమా న్యూస్ రాశారు. లోక్‌సభ ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. భూపతి రాజు ఈనాడు జర్నలిజం స్కూల్‌ (EJS) నుంచి జర్నలిజంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.… ఇంకా చదవండి