Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Gold: కుప్పకూలనున్న బంగారం ధరలు.. తొందరపడి ​కొంటే తలపట్టుకోవాల్సిందే! వెలుగులోకి సంచలన రిపోర్ట్‌

24 January 2026

Daali Dhananjay: ‘మేం ముగ్గురం కాబోతున్నాం’.. శుభవార్త చెప్పిన పుష్ఫ ‘జాలిరెడ్డి’

24 January 2026

Silver: సెంచరీ కొట్టిన సిల్వర్‌..! ఆసక్తికర పోస్ట్‌ పెట్టిన రాబర్ట్‌ కియోసాకి

24 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ttd Ssd Token Issuance Begins Today,Tirumala శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మళ్లీ ఆ దర్శన టికెట్లు ఇస్తున్నారు, తీసుకోండి – ttd started distribution of tirumala ssd tokens in bhudevi complex vishnunivasam and srinivasam
ఆంధ్రప్రదేశ్

Ttd Ssd Token Issuance Begins Today,Tirumala శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మళ్లీ ఆ దర్శన టికెట్లు ఇస్తున్నారు, తీసుకోండి – ttd started distribution of tirumala ssd tokens in bhudevi complex vishnunivasam and srinivasam

.By .8 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ttd Ssd Token Issuance Begins Today,Tirumala శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మళ్లీ ఆ దర్శన టికెట్లు ఇస్తున్నారు, తీసుకోండి – ttd started distribution of tirumala ssd tokens in bhudevi complex vishnunivasam and srinivasam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


TTD Distribution Of SSD Tokens Commenced: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు నేటితో ముగియనున్నాయి. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో SSD టోకెన్ల జారీని టీటీడీ ఇవాళ పునఃప్రారంభించింది. భక్తులు ఈ టోకెన్లను తీసుకోవచ్చని తెలిపారు. అయితే గత 9 రోజుల్లో 7 లక్షల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. బుధవారం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.69 కోట్లు వచ్చింది.

హైలైట్:

  • తిరుమలలో నేటితో వైకుంఠ దర్శనాల ముగింపు
  • నేటి నుంచి SSD టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ
  • శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో జారీ
TTD SSD Tokens
టీటీడీ ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ ప్రారంభం(ఫోటోలు– Samayam Telugu)
తిరుమల శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు జరిగిన వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం అర్ధరాత్రితో మగుస్తాయి. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. వైకుంఠ ద్వార దర్శనాల కారణంగా.. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం.. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లో జారీ చేసే SSD ( స్లాటెడ్ సర్వ దర్శనం) దర్శనం టోకెన్లు రద్దు చేశారు. పది రోజుల నుంచి ఆ టోకెన్లు జారీ చేయడం లేదు.. అయితే గురువారం అర్ధరాత్రితో వైకుంఠ ద్వార దర్శనాలు ముగుస్తుండటంతో మళ్లీ ఆ మూడుచోట్ల SSD టోకెన్లను మళ్లీ ఇవాళ ప్రారంభించింది. ప్రస్తుతం భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం, శ్రీనివాసంలో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ టోకెన్లను పొందవచ్చని ప్రకటించారు.

డిసెంబర్ 30న ప్రారంభమైన ఈ దర్శనాలలో, మొదటి మూడు రోజులు ఈ-డిప్‌ ద్వారా టోకెన్లు జారీ చేసి వారికి దర్శనానికి అనుమతించారు. మిగిలిన ఏడు రోజులకు, నేరుగా ఆలయానికి వచ్చే సర్వదర్శనం భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అంటే, ఎవరైతే నేరుగా వచ్చి క్యూలో నిలబడతారో వారికి ముందుగా దర్శనం కల్పించారు. అదే సమయంలో, పరిమిత సంఖ్యలో శ్రీవాణి టికెట్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కూడా జారీ చేశారు. వీవీఐపీల బ్రేక్ దర్శనం, స్థానికులకు కూడా ఈ-డిప్‌లో రోజుకు ఐదు వేల చొప్పున టోకెన్లు ఇచ్చారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు గమనిస్తూ, టీటీడీ అధికారులు ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి పర్యవేక్షించారు. ఈ కేంద్రం ద్వారా అన్ని ఏర్పాట్లను దగ్గరగా చూసుకున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందించారు.

తిరుమలలో గడిచిన‌ 9 రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి.. రికార్డు స్థాయిలో 7,09,831 మంది భక్తులకు దర్శనం కల్పించారు. బుధవారం 85,752 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.. శ్రీవారి హుండీ ఆదాయం రూ 4.69 కోట్లు వచ్చింది. కంపార్టమెంట్లు, షెడ్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. టీటీడీ భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది.

టీటీడీకి విరాళం

మరోవైపు తిరుమల శ్రీవారికి మరో భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. బెంగుళూరుకు చెందిన రాన్‌కి ఇన్ఫ్రా సంస్థ అధినేత ఆర్ యం ఈశ్వర్ నాయుడు టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ ఛైర్మన్ అభినందించారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి