Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

UPSC Civils 2025 Interview Date: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ తేదీల షెడ్యూల్‌ మారిందోచ్‌.. కొత్త తేదీ ఇదే

17 January 2026

Saturday astrology: శనివారం పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు.. ఏం చేయాలో తెలుసా?

17 January 2026

Anasuya: పద్దతిగా ఉండాలని చెబితే కేసు పెడతారా? : సంధ్యా రెడ్డి

17 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Liquor Bottles Row,తిరుమల మద్యం బాటిళ్ల వ్యవహారం.. కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు – tirupati janasena leader kiran royal on tirumala empty liquor bottles row
ఆంధ్రప్రదేశ్

Tirumala Liquor Bottles Row,తిరుమల మద్యం బాటిళ్ల వ్యవహారం.. కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు – tirupati janasena leader kiran royal on tirumala empty liquor bottles row

.By .8 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Liquor Bottles Row,తిరుమల మద్యం బాటిళ్ల వ్యవహారం.. కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు – tirupati janasena leader kiran royal on tirumala empty liquor bottles row
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుమలలో ఖాళీ మద్యం సీసాల వ్యవహారంలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన వైసీపీ కార్యకర్త కోటితో పాటుగా, ఓ మీడియా ఛానెల్ ప్రతినిధిని అరెస్ట్ చేశారు. టీటీడీకి, పోలీసులకు చెడ్డపేరు తీసుకురావాలనే కుట్రలో భాగంగానే వీరు ఈ పనికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు తిరుమలలో మద్యం బాటిళ్ల కేసులో జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన ఆరోపణలు చేశారు. దీని వెనుక వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హస్తం ఉందని.. కోటి భూమన అనుచరుడని కిరణ్ రాయల్ ఆరోపించారు.

Kiran royal
తిరుమల ఖాళీ మద్యం సీసాలు(ఫోటోలు– Samayam Telugu)
తిరుమలలో ఖాళీ మద్యం బాటిళ్లు కనిపించిన వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తిరుపతి నియోజకవర్గం జనసేన ఇంఛార్జి కిరణ్ రాయల్ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం మీడియా సమావేశం నిర్వహించిన కిరణ్ రాయల్.. తిరుమలలో మద్యం సీసాల ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలకు మద్యం బాటిళ్లను పంపించింది వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఖాళీ మద్యం సీసాల కేసులో అరెస్టయిన కోటి అనే వ్యక్తి భూమనకు అనుచరుడని ఆరోపించారు. భూమన కరుణాకర్ రెడ్డి కనుసన్నల్లోనే మద్యం బాటిళ్ళ ఎపిసోడ్ నడిచిందని అన్నారు. ఈ కేసులో భూమన కరుణాకర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. హిందూ దేవతలంటే భూమనకు చిన్న చూపన్న కిరణ్ రాయల్.. చర్చిలలోనూ మద్యం బాటిల్స్ పెట్టించే ధైర్యం భూమనకు ఉందా అని ప్రశ్నించారు.

మరోవైపు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ గోపురం మీదకు ఎక్కిన వ్యక్తి కూడా వైసీపీ కార్యకర్తేననే అనుమానం ఉందని కిరణ్ రాయల్ సందేహం వ్యక్తం చేశారు. భూదేవి కాంప్లెక్స్ వద్ద మద్యం బాటిళ్ళ వ్యవహారంలో కూడా వైసీపీ పాత్ర ఉందని.. తిరుమల, తిరుపతిలో ఈ మధ్య కాలంలో జరిగిన ఘటనలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కిరణ్ రాయల్ కోరారు.

తిరుమలలో ఖాళీ మద్యం సీసాల వెనుక..

మరోవైపు తిరుమలలోని పోలీస్ అతిథి గృహం సమీపంలో ఖాళీ మద్యం బాటిళ్లు అంటూ గత ఆదివారం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో తిరుమల బాలాజీ కాలనీ ప్రాంతంలో చెట్లలో.. 9 ఖాళీ మద్యం సీసాలు గుర్తించారు. దర్యాప్తులో వీటికి పోలీస్ అతిథి గృహానికి సంబంధం లేదని గుర్తించారు. అనంతరం ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తిరుమలలో పదుల సంఖ్యలో ఖాళీ మద్యం బాటిళ్లు

ఈ ఘటన వెనుక తిరుపతికి చెందిన వైసీపీ కార్యకర్త ఆళ్లపాక కోటి అనే వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కోటి మరికొంతమందితో కలిసి టీటీడీ, పోలీస్ విభాగాలను లక్ష్యంగా చేసుకుని పథకం ప్రకారం ఖాళీ మద్యం సీసాలను తిరుపతి నుంచి తిరుమలకు తీసుకువచ్చి.. బాలాజీ కాలనీ ప్రాంతంలోని కౌస్తుభం అతిథి గృహం కాంపౌండ్ వాల్ బయట చెట్ల పొదల వద్ద పడేసినట్లు పోలీసులు వెల్లడించారు.ఆ తర్వాత పక్కా ప్లాన్ ప్రకారం మీడియా ప్రతినిధుల సహకారంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ కేసులో ఆళ్లపాక కోటి, మోహన్ కృష్ణ అనే ఇద్దరిని తిరుమల పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి మొబైల్ ఫోన్లు, స్విఫ్ట్ డిజైర్ కారు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నవీన్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి