
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్ట్ విషయం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి ఈ ప్రాజెక్టును కొనసాగించడానికి అంగీకరించింది. అయితే డీపీఆర్ రూపకల్పనలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. విజయవాడ లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో డీపీఆర్లో మార్పులు చేయాల్సి వస్తోంది. దీనికి సంబంధించి అతి త్వరలో జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత తుది డీపీఆర్లో ఆ మేరకు అలైన్మెంట్ను ఫైనల్ చేయనున్నారు.
విజయవాడకు ఇప్పుడున్న అన్ని ఫ్లై ఓవర్ల కంటే నిడమానూరు ఫ్లై ఓవర్ అతి పెద్దది.. దీని పొడవు 6.5 కిలోమీటర్లు ఉంటుంది. అయితే మెట్రో కారిడార్ రామవరప్పాడు నుంచి ఏలూరు రోడ్డు మీదుగా వెళుతుంది. అందువల్ల నాలుగు కిలోమీటర్లు మాత్రమే మెట్రో కారిడార్ హైవే మీదుగా వెళుతుంది. ముందుగా ఫ్లై ఓవర్ వేస్తే ఆ తర్వాత మెట్రో ఫ్లై ఓవర్ (ఎలివేటెడ్ కారిడార్) ఏర్పాటు చేయడం కష్టంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రెండు పద్ధతుల్ని ఎన్హెచ్ అధికారులు ఆలోచిస్తున్నారు.
జాతీయ రహదారుల సంస్థ నేతృత్వంలో నిర్మించే ఫ్లై ఓవర్ పైనే మెట్రో ఎలివేటెడ్ కారిడార్ కూడా కలిపి నిర్మించడం.. దీనికి అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం ఒక పద్ధతి. మెట్రో ఫ్లై ఓవర్ నిర్మించుకునేలా ఎన్హెచ్ ప్రతిపాదిత ఫ్లై ఓవర్ నిర్మించుకునేలా ఎన్హెచ్ ప్రతిపాదిత ఫ్లై ఓవర్ పిల్లర్లను దానికి అనుగుణంగా ఏర్పాటు చేస్తూనే కొంత ఎత్తు మేర నిర్మించడం. ఇలా చేస్తే ఈ పిల్లర్లు సెంట్రల్ డివైడర్లోకి వస్తాయంటున్నారు. ఈ పిల్లర్ల మీద తర్వాత మెట్రో పిల్లర్లను ఆ సంస్థ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా రెండు పద్ధతులపై ఫోకస్ పెట్టారు.. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

