Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Namakkal Hanuman Temple: రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడ ఉందో తెలుసా.?

7 February 2026

Eggs: పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు వాస్తవాలు తెలుసుకోండి..

7 February 2026

Video: పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్ అంటూ పొగడ్తలు.. కట్‌చేస్తే.. చెత్త ఫీల్డింగ్‌తో నువ్వులపాలైన యంగ్ ప్లేయర్

7 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Village Ward Secretariat Employees Attendance,ఆ ఉద్యోగులకు అలర్ట్.. ఇకపై లేట్‌గా వస్తే ఆ రోజు జీతం కట్.. – village ward secretariat sachivalaya employees must mark facial attendance on time otherwise their salary will be deducted
ఆంధ్రప్రదేశ్

Village Ward Secretariat Employees Attendance,ఆ ఉద్యోగులకు అలర్ట్.. ఇకపై లేట్‌గా వస్తే ఆ రోజు జీతం కట్.. – village ward secretariat sachivalaya employees must mark facial attendance on time otherwise their salary will be deducted

.By .15 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Village Ward Secretariat Employees Attendance,ఆ ఉద్యోగులకు అలర్ట్.. ఇకపై లేట్‌గా వస్తే ఆ రోజు జీతం కట్.. – village ward secretariat sachivalaya employees must mark facial attendance on time otherwise their salary will be deducted
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు సమయపాలన తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆలస్యంగా విధులకు హాజరైతే ఆ రోజు వేతనంలో కోత విధిస్తారు. ఫేషియల్ హాజరు తప్పనిసరి చేస్తూ, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనివేళలు నిర్ణయించారు. ఈ నిబంధనలు సచివాలయ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల్లో భాగం అంటున్నారు అధికారులు. సిబ్బంది కచ్చితంగా ఈ నిబంధనను పాటించాలని చెబుతున్నారు.

హైలైట్:

  • ప్రభుత్వం కీలక నిర్ణయం
  • సచివాలయ సిబ్బందికి ఫేషియల్ అటెండెన్స్
  • లేట్‌గా వస్తే జీతం కట్
attendence
ఉద్యోగులు ఆలస్యంగా వస్తే ఆ రోజు జీతంలో కోత(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు సమయానికి హాజరయ్యేలా చూడటం కోసం కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇకపై ఆలస్యంగా విధులకు హాజరైతే ఆ రోజు వేతనంలో కోత విధించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రధానంగా ఇది సచివాలయ ఉద్యోగులకు వర్తిస్తుంది. ఇకపై సచివాలయ ఉద్యోగులు కచ్చితమైన సమయానికి విధులకు హాజరుకావాల్సిందే. ఆలస్యమైతే ఆ రోజు వేతనంలో కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని భావిస్తున్న సర్కార్, ఆ దిశగా అనేక సంస్కరణలు అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది.ఇటీవలే గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మార్చిన సంగతి తెలిసిందే. గ్రామ సచివాలయాలను ‘స్వర్ణ గ్రామాలు’గా, వార్డు సచివాలయాలను ‘స్వర్ణ వార్డులు’గా మార్చేందుకు తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా సచివాలయ పాలనలోనూ మార్పులు తీసుకురావాలని భావిస్తున్న సర్కార్, ఆ దిశగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా సమయపాలన, హాజరు విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.

వైసీపీ ప్రభుత్వం 2019లో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఒక్కో సచివాలయంలో 11 నుండి 13 మంది వరకు సహాయకులను నియమించారు. గతంలో సచివాలయ ఉద్యోగుల విధులపై మాతృశాఖల అజమాయిషీ ఉండేది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు దీనిని సరి చేసే ప్రయత్నం చేస్తోంది.

విజయనగరం జిల్లాలో 777 పంచాయతీలు ఉండగా, 626 గ్రామ/వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 5,781 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే, సచివాలయ సిబ్బందిలో చాలా మంది సమయపాలన పాటించడం లేదని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది.

ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ‘ఫేషియల్ రికగ్నిషన్’ (Facial Recognition) హాజరును తప్పనిసరి చేసింది. సచివాలయ సిబ్బంది పని వేళలను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించింది. కచ్చితంగా ఈ సమయంలోనే సచివాలయ సిబ్బంది ఆన్‌లైన్ ద్వారా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం హాజరు నమోదు చేసేలా చర్యలు చేపట్టింది. సమయానికి హాజరు వేయకుంటే ఆ రోజు వారు విధులకు రానట్లుగానే పరిగణించి, వేతనంలో కోత విధించేలా విధి విధానాలను రూపొందించింది.

పిల్లి ధ‌ర‌ణి

రచయిత గురించిపిల్లి ధ‌ర‌ణిధరణి పిల్లి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆమె తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. ఆమెకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్థానిక వార్తలు, తెలంగాణ ఎన్నికల అప్డేట్స్, ప్రత్యేక కథనాలు రాశారు. ధరణి ఎస్ఎస్‌జే నుంచి మల్టీ మీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు.… ఇంకా చదవండి