Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Namakkal Hanuman Temple: రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడ ఉందో తెలుసా.?

7 February 2026

Eggs: పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు వాస్తవాలు తెలుసుకోండి..

7 February 2026

Video: పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్ అంటూ పొగడ్తలు.. కట్‌చేస్తే.. చెత్త ఫీల్డింగ్‌తో నువ్వులపాలైన యంగ్ ప్లేయర్

7 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ongc Financial Assistance To Irusumanda Blowout,ఏపీలో ఆ కుటుంబాలకు రిలీఫ్.. ఒక్కో ఫ్యామిలీకి రూ.10000.. ఫిబ్రవరి మొదటి వారంలో జమ.. – ongc financial assistance to irusumanda blowout effected families in malikipuram in konaseema district
ఆంధ్రప్రదేశ్

Ongc Financial Assistance To Irusumanda Blowout,ఏపీలో ఆ కుటుంబాలకు రిలీఫ్.. ఒక్కో ఫ్యామిలీకి రూ.10000.. ఫిబ్రవరి మొదటి వారంలో జమ.. – ongc financial assistance to irusumanda blowout effected families in malikipuram in konaseema district

.By .24 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ongc Financial Assistance To Irusumanda Blowout,ఏపీలో ఆ కుటుంబాలకు రిలీఫ్.. ఒక్కో ఫ్యామిలీకి రూ.10000.. ఫిబ్రవరి మొదటి వారంలో జమ.. – ongc financial assistance to irusumanda blowout effected families in malikipuram in konaseema district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Samayam Telugu•24 Jan 2026, 10:21 pm IST

కోనసీమ జిల్లా మలికిపురం బ్లో అవుట్ బాధిత కుటుంబాలకు ఓఎన్జీసీ ఆర్థిక సాయం ప్రకటించింది. ఇరుసమండ బ్లో అవుట్ ఘటనలో బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 వేలు చొప్పున అందించనుంది. శనివారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. మొత్తం 6300 కుటుంబాలకు ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఆర్థిక సాయం అందించనున్నారు. అలాగే రైతులకు కూడా ఆర్థిక సాయం అందిస్తామని అధికారులు తెలిపారు.

irusumanda blowout
. ఇరుసమండ బ్లో అవుట్ ఘటన(ఫోటోలు– Samayam Telugu)
కొత్త సంవత్సరం ప్రారంభంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో జరిగిన బ్లో అవుట్ గురించి అందరికీ తెలిసిన సంగతే. మలికిపురం మండలంలోని ఇరుసుమండ బ్లో అవుట్‌ ఘటన.. కోనసీమ ప్రాంతంలో భయాందోళనకు కారణమైంది. అయితే అధికారులు ఐదు రోజులలో బ్లోఅవుట్‌ను నియంత్రించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇరుసమండ బ్లో అవుట్ ఘటనలో బాధితులకు ఓఎన్జీసీ సంస్థ ఆర్థిక సాయం ప్రకటించింది. మొత్తం 6300 కుటుంబాలకు.. కుటుంబానికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. శనివారం రోజునన అమలాపురం కలెక్టరేట్‌ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇరుసుమండతో పాటుగా లక్కవరం, గుబ్బల పాలెం, చింతలపల్లి గ్రామాలలోని 6,300 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. బాధిత కుటుంబాలకు ఫిబ్రవరి మొదటి వారంలో ఆర్థిక సహాయం అందుతుందని అధికారులు వెల్లడించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ ఆర్థిక సాయం అందిస్తున్నట్టు అధికారులు, ఓఎన్జీసీ ప్రతినిధులు వెల్లడించారు. మరోవైపు మలికిపురం బ్లోఅవుట్ కారణంగా పలువురు రైతులు పంటలు కూడా నష్టపోయారు. ఈ రైతులకు కూడా ఆర్థిక సాయం అందించనున్నారు.

కోనసీమలో భారీగా గ్యాస్ లీక్.. భయాందోళనలో జనం

మరోవైపు ఇరుసమండలోని మోరి-5 డ్రిల్లింగ్‌ సైట్‌లో ఉన్న బావిలో జనవరి 5న బ్లో అవుట్ సంభవించిన సంగతి తెలిసిందే. అధికారులు ఐదురోజుల పాటు శ్రమించి మంటలను నియంత్రించారు. ఇందుకోసం ఓఎన్జీసీకి చెందిన నిపుణుల బృందం తీవ్రంగా శ్రమించింది. గూడపల్లి పంట కాల్వ నుంచి నీటిని తీసుకువచ్చి మంటలను నియంత్రించారు. భారీ పైపులతో మంటలపై నీళ్లు చల్లి.. అగ్ని కీలలను నియంత్రించారు.

బ్లో అవుట్ కారణంగా భారీ యంత్రాలు కూడా కాలిపోయాయి. ఈ శకలాలనుభారీ క్రేనుల సహాయంతో తరలించారు. ఇరుసమండ బ్లో అవుట్ కారణంగా 3 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేశారు. బ్లో అవుట్ జరిగిన ప్రదేశానికి కిలోమీటర్ పరిధి వరకూ అధికారులు ఇంటింటా సర్వే జరిపారు. పంట నష్టం వివరాలను అంచనా వేశారు.