Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Nagarjuna : నాగార్జున అందం కోసమే తీసిన సినిమా అది.. కట్ చేస్తే.. ఇప్పటికీ కల్ట్ క్లాసిక్..

7 March 2026

Hyderabad: ముందేమో పెళ్లి ప్రపోజల్.. తీరా సెట్టయ్యాక దిమ్మ తిరిగే ట్విస్ట్!

7 March 2026

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ రేట్లను పెంచుతూ బ్యాంకు సంచలన నిర్ణయం..

7 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Srisailam Devotees Allowed In Forest Route,శ్రీశైలం వెళ్లే భక్తులకు మరో శుభవార్త.. రెండు రోజులు ముందుగానే అనుమతి – padayatra devotees allowed to walk through forest to srisailam from february 6 to 15
ఆంధ్రప్రదేశ్

Srisailam Devotees Allowed In Forest Route,శ్రీశైలం వెళ్లే భక్తులకు మరో శుభవార్త.. రెండు రోజులు ముందుగానే అనుమతి – padayatra devotees allowed to walk through forest to srisailam from february 6 to 15

.By .7 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Srisailam Devotees Allowed In Forest Route,శ్రీశైలం వెళ్లే భక్తులకు మరో శుభవార్త.. రెండు రోజులు ముందుగానే అనుమతి – padayatra devotees allowed to walk through forest to srisailam from february 6 to 15
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Srisailam Brahmotsavam 2026 Devotees Allowed In Forest Route: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు అటవీశాఖ అధికారులు తీపికబురు చెప్పారు. రెండు రోజులు ముందుగానే అటవీ మార్గంలో భక్తులు కాలినడకన వెళ్లేందుకు అనుమతించారు. శుక్రవారం నుంచి భక్తులు అటవీ మార్గంలో నడిచి వెళుతున్నారు. ఈ నెల 15 వరకు భక్తులు అటవీ మార్గంలో నడిచి వెళ్లేందుకు అనుమతించారు. అయితే భక్తులు కొన్ని నిబంధనలు పాటిస్తూ అటవీమార్గంలో వెళ్లాలని సూచిస్తున్నారు.

Srisailam Devotees Forest Route
శ్రీశైలం భక్తుల్ని అటవీమార్గంలో అనుమతి(ఫోటోలు– Samayam Telugu)
శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. అయితే పాదయాత్రగా శ్రీశైలం వచ్చే భక్తులకు అటవీశాఖ అధికారులు శుభవార్త చెప్పారు. ఈ నెల 6 నుంచి 15 వరకు అటవీ మార్గంలో శ్రీశైలానికి పాదయాత్రగా వచ్చేందుకు అనుమతి ఇచ్చారు. వాస్తవానికి ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు మాత్రమే అటవీ మార్గంలో అనుమతించాలని నిర్ణయించారు. కానీ ఇటీవల శ్రీశైలంలో బ్రహ్మో్త్సవాల ఏర్పాట్లపై సమీక్ష చేసిన మంత్రులు.. భక్తుల ఇబ్బందుల్ని గమనించి ఈ నెల 6 నుంచి 15 వరకు అటవీ మార్గంలో భక్తుల్ని అనుమతించాలని నిర్ణయించారు. ఈ క్రమంంలో శుక్రవారం (ఫిబ్రవరి 6) నుంచి భక్తులు వెంకటాపురం నుంచి శ్రీశైలానికి అటవీ మార్గంలో బయలుదేరారు.. ఈ నిర్ణయంపై భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

వాస్తవానికి నాగార్జునసాగర్‌ టు శ్రీశైలం నల్లమల అభయారణ్యంలో పెద్దపులుల్ని లెక్కిస్తున్నారు. ఆలిండియా టైగర్‌ ఎస్టిమేషన్స్‌- 2026లో భాగంగా పులుల్ని మూడు దశల్లో లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 3 నుంచి మే 31 వరకు లెక్కింపు కొనసాగనుంది. ప్రస్తుతం తొలిదశ లెక్కింపులో భాగంగా ఈ నెల 10 వరకు పులుల్ని లెక్కింపు కొనసాగనుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా మార్కాపురం, గిద్దలూరు.. నంద్యాల, ఆత్మకూరు పారెస్ట్ డివిజన్‌లో లెక్కిస్తున్నారు. ట్రాప్ కెమెరాల సాయంతో పులుల లెక్కలు వేస్తున్నారు. ఈ కారణంగానే అటవీ మార్గంలో శ్రీశైలం నడిచి వెళ్లే భక్తుల్ని అనుమతించలేదు.. ఆంక్షలు విధించారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే ఈ నెల 8 నుంచి బ్రహ్మోత్సవాలు ముగిసే 15 వరకు మాత్రమే అటవీమార్గంలో అనుమతించారు.

అయితే శ్రీశైలానికి వచ్చే భక్తులు, శివ దీక్ష తీసుకున్న భక్తులు ముందుగానే పాదయాత్రగా బయల్దేరారు. ఈ క్రమంలో అటవీశాఖ అధికారుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. భక్తులు అటవీ మార్గంలో వెళ్లకుండా.. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం నుంచి కర్నూలు- గుంటూరు నేషనల్ హైవే మీదుగా వెళ్లాలని సూచించారు. అక్కడి నుంచి దోర్నాల మీదుగా శ్రీశైలం వెళ్లాలని చెప్పారు. అయితే అంత దూరం ప్రయాణం అంటే ఇబ్బందులు ఎదురవుతాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈ నెల 2న శ్రీశైలంలో జరిగిన సమీక్షకు హాజరైన మంత్రులు అటవీశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. అనంతరం రెండు రోజులు ముందుగానే.. అంటే ఫిబ్రవరి 6 నుంచి 15 వరకు భక్తులు అటవీ మార్గంలో నడిచి వెళ్లేందుకు అనుమతించారు. మొత్తం మీద శ్రీశైలం అటవీమార్గంలో వెళ్లే భక్తులకు ఊరట లభించింది. ఇటు బ్రహ్మోత్సవాల కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

శ్రీశైలానికి అటవీమార్గంలో కాలినడకన వెళ్లే భక్తులు అటవీశాఖ అధికారులు కొన్ని సూచనలు చేశారు. ప్రతి భక్తుడి బ్యాగుల్ని తనిఖీ చేస్తారు.. సిగరెట్లు, బీడీలు, అగ్గిపెట్టె, గుట్కాలను అనుమతించరు. అటవీ మార్గంలో వెళ్లే భక్తులు వన్యప్రాణులకు ఎలాంటి హాని చేయకూడదు. అలాగే ప్లాస్టిక్‌ను తీసుకెళ్లడం, అడవికి నిప్పు పెట్టే అగ్నిపెట్టెలు, మద్యానికి అనుమతి లేదు. రాత్రి వేళలో నడిచి వెళ్లే సమయంలో శబ్దం చేయకూడదు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి