Chittoor District Woman And Boy Incident: చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ ఘటన సమాజాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న వివాహేతర సంబంధాల హత్యోదంతాలకు ఉదాహరణగా మారింది. ఆమెకు 37 ఏళ్లు. అతడికి 17 ఏళ్లు.. ఆ వివాహిత తన పిల్లల వయసుకు అటూ ఇటుగా ఉన్న 17 ఏళ్ల కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అడ్డుగా ఉన్న భర్త, అత్తను చంపేయాలని ఆమె ఆ బాలుడితో కలిసి స్కెచ్ వేసింది.
హైలైట్:
- చిత్తూరు జిల్లాలో కలకలం రేపిన ఘటన
- 17 ఏళ్ల బాలుడితో 37 ఏళ్ల మహిళ ఎఫైర్
- భర్త, అత్తను చంపేందుకు ప్లానింగ్

విజయవాడ: ప్రేమ పేరుతో వివాహితకు ట్రాప్.. భర్తకు దూరం చేసి, గదికి పిలిపించి
ఇటీవల మరోసారి భర్త కవితను హెచ్చరించాడు.. అయినా సరే ఆమె మాత్రం పద్ధతి మార్చుకోలేదు. అప్పుడు భర్త, అత్తపై కోపం పెంచుకుంది.. వారిని అడ్డు తొలగించుకోవాలని భావించింది. వాళ్లిద్దర్ని చంపేయాలని మైనర్ బాలుడిని కవిత రెచ్చగొట్టింది. మైనర్ బాలుడు ఫిబ్రవరి 5న రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న అత్త నిర్మలపై దాడికి పాల్పడ్డాడు. ఆమె కళ్లల్లో కారం కొట్టి, కత్తితో గొంతు కోసి హత్య చేయడాని ప్రయత్నించాడు. నిర్మల బాలుడ్ని ప్రతిఘటించి పెద్దగా కేకలు వేసింది. వెంటనే చుట్టుపక్కల జనాలు పరుగెత్తుకొచ్చారు. వాళ్లను చూసి ఆ బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిర్మల గొంతుపై తీవ్ర గాయం కావడంతో వెంటనే స్థానికులు ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడైన బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కవిత రెచ్చగొట్టడంతోనే మైనర్ బాలుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. కవిత మాత్రం పరారీలో ఉంది.. పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.


