Srikalahasti Temple Rahu Ketu Sarpa Dosha Puja Cancelled,మహాశివరాత్రికి శ్రీకాళహస్తి వెళ్లే భక్తులకు బ్యాడ్న్యూస్.. మహిళలకు మాత్రం తీపికబురు – srikalahasti temple rahu and ketu sarpa dosha puja cancelled on february 15th due to mahashivratri says temple eo bapi reddy
Srikalahasti Rahu Ketu Sarpa Dosha Puja Cancelled On Feb 15: మహాశివరాత్రి వేడుకలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. అటు శ్రీశైలం, ఇటు శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ఈవో కీలక ప్రకటన చేశారు. ఈ నెల 15న రాహు కేతు పూజలు రద్దు చేశారు. అలాగే అంతరాలయ దర్శనాలను కూడా ఈ నెల 14,15, 16 తేదీల్లో రద్ధు చేసినట్లు ఈవో తెలిపారు.
హైలైట్:
శ్రీకాళహస్తి వెళ్లే భక్తులకు బ్యాడ్న్యూస్
మహాశివరాత్రి రోజు రాహు, కేతు పూజలు రద్దు
14, 15, 16 తేదీల్లో అంతరాలయ దర్శనాలు రద్దు
15న శ్రీకాళహస్తిలో రాహు కేతు పూజలు రద్దు(ఫోటోలు– Samayam Telugu)
మహాశివరాత్రికి శ్రీకాళహస్తి వెళ్లే భక్తులకు బ్యాడ్న్యూస్.. ఆలయంలో రాహు, కేతు పూజలు రద్దయ్యాయి. ఈ నెల 15 (మహా శివరాత్రి రోజు)న శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహు, కేతు సర్పదోష నివారణ పూజలు రద్దు చేశారు. అంతేకాదు ఈ నెల 15న రూ.50 టికెట్తో ప్రత్యేక దర్శనాన్ని కూడా నిలిపివేసినట్లు ఆలయ ఈవో టి బాపిరెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు ఉండటంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అంతేకాదు బ్రహ్మోత్సవాల ప్రారంభం దృష్ట్యా నేటి నుంచి 13 రోజుల పాటు మరికొన్ని పూజలు కూడా రద్దు చేశారు. ఈ మేరకు ఆయంలోని మహద్వారం లోపల నిర్వహించే రూ.2500, రూ.5 వేల విలువైన రాహు, కేతు పూజల్ని రద్దు చేశారు. అలాగే అన్ని ఆర్జిత సేవలూ రద్దు చేశారు అధికారులు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో అంతరాలయ దర్శనాలు నిలుపుదలు చేశారు.. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గనమించి శ్రీకాళహస్తి రావాలని అధికారులు సూచిస్తున్నారు. శ్రీకాళహస్తిలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతునానయి.. ఈనెల 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అయితే బ్రహ్మోత్సవాల సందర్భంగా సామాన్య భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. శివరాత్రి రోజు మహాలఘు దర్శనం కల్పిస్తారు.. అలాగే క్యూ లైన్లు ఆగకుండా అందరికి దర్శనం చేయించేలా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా వీవీఐపీలు, వీఐపీలకు ఒక స్లాట్ అమలు చేస్తున్నారు. అంతేకాదు భక్తులకు ఉచితంగా చిన్న లడ్డూలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. అలాగే మహాశివరాత్రి రోజున ఆలయం తరఫున మహిళలందరికీ జాకెట్టు వస్త్రం, గాజులు, పసుపుదారాలు, కంకణం, అమ్మవారి కుంకుమ అందజేస్తారు. సర్వదర్శనంతో పాటు రూ.50, రూ.200, రూ.500 టికెట్లు అందుబాటులో ఉన్నాయని ఆలయ అధికారులు తెలిపారు. అంతేకాదు ప్రతి ఏటా స్థానికులకు రూ.500 రాయితీ టికెట్లు పంపి చేస్తుండగా.. ఈసారి ఆ టికెట్ను (రూ.200కే) రెండురోజులు ముందుగానే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఇస్తారు. ఈ టికెట్ కోసం ఆధార్కార్డు నమోదు చేసుకుంటారు. ఇక ఈ నెల16వ తేదీన స్థానికులందరికీ ఉచిత దర్శన వసతి కల్పించాలని ప్లాన్ చేశారు.
శ్రీకాళహస్తిలో మహాశివరాత్రివార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బ్రహ్మోత్సవాలు అంకురార్పణగా భక్తకన్నప్ప కైలాసనాథస్వామికి తొలిరోజు నిర్వహించే ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభమవుతాయి. అంతేకాదు శ్రీకాళహస్తిలో తొలి పూజ భక్తకన్నప్పకే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి రోజూ ఆలయంలో సుప్రభాతం అనంతరం గర్భాలయంలో కొలువుదీరిన భక్తకన్నప్పకు తొలి పూజ నిర్వహిస్తారు. ఆ తర్వాతే ఆర్జితసేవలు ప్రారంభిస్తుంటారు. అంతేకాదు అర్చకులు మోకాళ్ల వరకు వస్త్రధారణతో పూజలు నిర్వహించడం సంప్రదాయంగా ఉంది.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి