Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. అర్ధరాత్రి డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..

7 February 2026

T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్.. సచిన్, లారాను మించిపోయేటోళ్లు భయ్యో..!

7 February 2026

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. అది ఎక్స్ రేటేడ్ అంటూ డిమాండ్..

7 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Medical Colleges Niti Aayog Help,ఏపీకి కేంద్రం తీపికబురు.. చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చిన రోజే, మొత్తానికి గ్రీన్ సిగ్నల్ – andhra pradesh minister satya kumar yadav meet niti aayog on members in delhi over medical colleges
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Medical Colleges Niti Aayog Help,ఏపీకి కేంద్రం తీపికబురు.. చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చిన రోజే, మొత్తానికి గ్రీన్ సిగ్నల్ – andhra pradesh minister satya kumar yadav meet niti aayog on members in delhi over medical colleges

.By .10 October 2024No Comments3 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Medical Colleges Niti Aayog Help,ఏపీకి కేంద్రం తీపికబురు.. చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చిన రోజే, మొత్తానికి గ్రీన్ సిగ్నల్ – andhra pradesh minister satya kumar yadav meet niti aayog on members in delhi over medical colleges
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి శుభవార్త వచ్చింది. నీతిఆయోగ్‌ రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ఇవ్వడంపై సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు వీజీఎఫ్‌పై నీతి ఆయోగ్‌ సభ్యుడు వినోద్‌ పాల్‌తో మంత్రి సత్యకుమార్‌ ఢిల్లీలో సమావేశమై చర్చించారు. ప్రతి మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్ల వ్యయం అవుతుందని.. ఇందులో నిర్వహణ వ్యయం రూ.200 కోట్లు అవుతుందని నీతి ఆయోగ్‌ దృష్టికి మంత్రి సత్యకుమార్ తీసుకెళ్లారు. 12 మెడికల్ కాలేజీలకు రెండు, మూడు దశల్లో వీజీఎఫ్‌ ఇచ్చేందుకు నీతి ఆయోగ్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం నిర్మిస్తోన్న 12 మెడికల్ కాలేజీలకు ఎంతమేర వీజీఎఫ్‌ ఇస్తారనేది క్లారిటీ రావాల్సి ఉంది.రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజీలు నాబార్డు నిధులతో నిర్మిస్తున్నారు.. వీటికి రాష్ట్ర వాటాగా గత ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది కొన్ని కాలేజీలకు వైద్య విద్యా కోర్సులు ప్రారంభమయ్యేందుకు కూడా వీలు లేకుండా పోయింది. దీంతో రెండు మూడు దశల్లో వీజీఎఫ్‌ ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదలను పరిశీలిస్తామని నీతి ఆయోగ్‌ సభ్యుడు వినోద్‌ పాల్‌ హామీ ఇచ్చారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ బ్లాకుల్ని అభివృద్ధికి అవసరమయ్యే సాయంపై కూడా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ నీతి ఆయోగ్‌ సభ్యుడు వినోద్‌ పాల్‌తో చర్చించారు. ప్రమాద, ట్రామాకేర్‌ కేసులు ఎక్కువ అవుతున్నాయని.. అందుకే ఈ సేవలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో 15 యాస్పిరేషన్‌ బ్లాకుల్లో వివిధ రంగాల అభివృద్ధికి కేంద్రం సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆయా బ్లాకుల్లో వైద్య సేవల అభివృద్ధికి కేంద్రసాయంపై కూడా మంత్రి నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్‌ పాల్‌తో చర్చించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడి అనంతపురం జిల్లాలో మరికొన్ని అదనపు బ్లాకులను యాస్పిరేషన్‌ బ్లాకులుగా గుర్తించాలని కోరారు. అంతేకాదు ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో అమలవుతున్న సాగునీటి పథకాల అమలుతో జల్‌ జీవన్‌ మిషన్‌ను అనుసంధానం చేయాలని మంత్రి సత్యకుమార్ విన్నవించారు. ఈ అంశాలపైనా సానుకూల స్పందన వచ్చింది.

ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. కడప జిల్లాలో కాశీనాయన ఆశ్రమం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి అటవీ శాఖపరంగా ఎదురవుతున్న సమస్యలను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో సమావేశమై చర్చించారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి అటవీ భూముల అవసరం ఉందని..మొదట ఆశించిన దానికంటే భారీగా తగ్గించి కేవలం 6 హెక్టార్ల అటవీ భూమిని కోరుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ భూమిని డీనోటిఫై చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని ప్రధానంగా కోరారు.తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో మైనార్టీ ముస్లింల అభివృద్ధికి సాయం అందించాలని కేంద్ర మైనార్టీల సంక్షేమ శాఖ మంత్రి జార్జ్‌ కురియన్‌ను కలిసి సత్యకుమార్ కోరారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra Pradesh: ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు.. కాలేజీ గేట్లు క్లోజ్.. అసలేం జరిగిందంటే?

7 February 2026

Srisailam Devotees Allowed In Forest Route,శ్రీశైలం వెళ్లే భక్తులకు మరో శుభవార్త.. రెండు రోజులు ముందుగానే అనుమతి – padayatra devotees allowed to walk through forest to srisailam from february 6 to 15

7 February 2026

Vizianagaram: కస్టమర్ డాక్యూమెంట్స్ పోగొట్టిన SBI.. వినియోగదారుల ఫోరం కీలక తీర్పు..

7 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. అర్ధరాత్రి డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..

7 February 2026

ఫుడ్ డెలివరీ బాయ్‌ల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరైన సమయానికి.. సరైన అడ్రస్‌లో ఫుడ్…

T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్.. సచిన్, లారాను మించిపోయేటోళ్లు భయ్యో..!

7 February 2026

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. అది ఎక్స్ రేటేడ్ అంటూ డిమాండ్..

7 February 2026

తెలుగులో తోప్ హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..

7 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. అర్ధరాత్రి డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..

7 February 2026

T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్.. సచిన్, లారాను మించిపోయేటోళ్లు భయ్యో..!

7 February 2026

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. అది ఎక్స్ రేటేడ్ అంటూ డిమాండ్..

7 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.