
మరోవైపు ఇవాళ జరగబోయే కేబినెట్ భేటీలో రాష్ట్రంలో గ్రామ, వార్డు వాలంటీర్ల గురించి నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు మంత్రి వాసంశెట్టి సుభాష్. వాలంటీర్ల వ్యవస్థ కచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.. మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అంతేకాదు గ్రామ, వార్డు వాలంటీర్ల కొనసాగింపుపై ఇశాళ జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వారికి రూ.10,000 జీతం పెంచి విద్యార్హతల ఆధారంగా వివిధ శాఖల్లో సర్దుబాటు చేయనున్నట్లు సమాచారం. మొత్తంగా 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉండగా, ఎన్నికల టైమ్ లో 1.09 లక్షల మంది రాజీనామా చేశారు.. రాజీనామా చేసిన వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థనున తీసుకొచ్చింది. వీరి ద్వారానే ప్రతి నెలా పింఛన్ల పంపిణీ, పథకాల అమలు, రేషన్ పంపిణీ వంటి ముఖ్యమైన పనులు జరిగేవి. ఇటీవల సార్వత్రిక ఎన్నికల సమయంలో వాలంటీర్లను ఎన్నికల సంఘం పక్కనపెట్టింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పింఛన్ డబ్బుల్ని అకౌంట్లలో, కొందరికి ఇళ్లకు తీసుకెళ్లి పంపిణీ చేశారు. అయితే ఎన్నికల సమయంల వేలాదిమంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ఎన్నికల సమయంలో కూటమి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వాలంటీర్ల గౌరవ వేతనం రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతామని చెప్పింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల బదులు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల చేత పింఛన్ పంపిణీ చేయిస్తున్నారు. అలాగే వాలంటీర్ల సేవలు ఎలా వినియోగించుకోవాలో కసరత్తు చేస్తున్నామని సీఎం , మంత్రులు అన్నారు. తాజా కేబినెట్ సమావేశంలో వాలంటీర్ల అంశంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నాు

