
దసరా ప్రత్యేక రైలు
దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైలు అందుబాటులోకి వచ్చింది. నేటి నుంచి విజయవాడ- శ్రీకాకుళం రోడ్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు తెలిపారు. ప్రత్యేక రైలు (07215) ఈ నెల 10, 11, 12, 14, 15, 16, 17 తేదీల్లో విజయవాడలో రాత్రి 8 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30కి శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది.
ఈ రైలు (07216) తిరుగు ప్రయాణంలో ఈ నెల 10, 11, 12, 13, 15, 16, 17, 18 తేదీల్లో శ్రీకాకుళం రోడ్లో ఉదయం 6.30కి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు విజయవాడ వెళుతుంది. ఈ ప్రత్యేక రైలు ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. అంతేకాదు దసరా రద్దీ పెరగడంతో మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతుంది దక్షిణ మధ్య రైల్వే.

