Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఈ తేదీల్లో జన్మించిన స్త్రీలు లక్ష్మీదేవితో సమానం.. ఇంటికి అష్టైశ్వర్యాలు తెస్తారు..!

12 March 2026

Monalisa: మోనాలిసా పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ ఏం చేస్తుంటాడో తెలుసా? వీరి లవ్ స్టోరీ మామూలుగా లేదుగా..

12 March 2026

Rythu Bharosa: రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. అకౌంట్లోకి వచ్చేది ఆ రోజే నుంచే.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..

12 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Capgemini Permanent Campus In Vizag,క్యాప్‌ జెమినీ సీఈఓతో లోకేష్ భేటీ.. విశాఖలో 20 ఎకరాల భూమి, తాత్కాలికంగా ప్రైవేటు భవనంలో సేవలు – andhra pradesh it minister nara lokesh meets cap gemini global ceo in visakhapatnam
ఆంధ్రప్రదేశ్

Capgemini Permanent Campus In Vizag,క్యాప్‌ జెమినీ సీఈఓతో లోకేష్ భేటీ.. విశాఖలో 20 ఎకరాల భూమి, తాత్కాలికంగా ప్రైవేటు భవనంలో సేవలు – andhra pradesh it minister nara lokesh meets cap gemini global ceo in visakhapatnam

.By .12 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Capgemini Permanent Campus In Vizag,క్యాప్‌ జెమినీ సీఈఓతో లోకేష్ భేటీ.. విశాఖలో 20 ఎకరాల భూమి, తాత్కాలికంగా ప్రైవేటు భవనంలో సేవలు – andhra pradesh it minister nara lokesh meets cap gemini global ceo in visakhapatnam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీలో క్యాప్ జెమినీ సంస్థ రానుంది. ఇవాళ మంత్రి నారా లోకేష్‌తో ఆ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. క్యాప్‌ జెమినీకి భూ కేటాయింపులు, తాత్కాలిక క్యాంపస్‌కు సంబంధించి ఒక స్పష్టత వచ్చింది. ఇప్పటికే ఆ సంస్థ ఏర్పాటు కోసం విశాఖలో 20 ఎకరాల భూమిని పరిశీలించారు. అయితే తాత్కాలికంగా సేవలు అందించేందుకు మాత్రం ఒక ప్రైవేటు బిల్డింగ్‌ను ఎంపిక చేశారు. దీంతో త్వరలోనే ఏపీలో క్యాప్ జెమినీ సేవలు ప్రారంభం కానున్నాయి.

cap gemini
క్యాప్‌ జెమినీ సీఈఓతో లోకేష్ భేటీ(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే విశాఖకు దేశ, విదేశాల నుంచి కంపెనీలను ఆహ్వానిస్తోంది. ఏపీలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రోత్సాహకాలు, రాయితీలు, సకల సౌకర్యాలు కల్పిస్తున్న చంద్రబాబు సర్కార్.. కంపెనీలను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే క్యాప్ జెమినీ సంస్థ తమ క్యాంపస్‌ను విశాఖలో ఏర్పాటు చేయనుండగా.. ఇప్పటికే దానికి సంబంధించిన చర్చలు జరిగాయి. తాజాగా ఆ సంస్థ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.

క్యాప్‌ జెమినీ గ్లోబల్‌ సీఈవో ఐమాన్‌ ఎజత్‌తో మంత్రి లోకేష్ భేటీ అయి కీలక విషయాలపై చర్చించారు. విశాఖలో క్యాప్‌ జెమినీ సంస్థ ఏర్పాటుపై వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. విశాఖలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న మధురవాడలోని ఐటీ పార్క్ హిల్‌-1పై క్యాప్ జెమినీ సంస్థ కోసం ఇప్పటికే 20 ఎకరాల భూమిని పరిశీలించారు.

అదే సమయంలో ఆ సంస్థ ప్రతినిధులు అడివివరం, ఆనందపురం పరిధిలో రెండు చోట్ల కూడా భూముల పరిశీలన చేశారు. అయితే క్యాప్ జెమినీకి పర్మినెంట్ క్యాంపస్ అందుబాటులోకి వచ్చే వరకు.. తాత్కాలికంగా కార్యకలాపాలు సాగించేందుకు సెంట్రల్‌ పార్కు సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ భవనాన్ని సెలెక్ట్ చేశారు.

అయితే క్యాప్‌ జెమినీ సంస్థ శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు కోసం 25 ఎకరాల కంటే ఎక్కువ భూమి కావాలని ఆ సంస్థ ప్రతినిధులు చూస్తున్నారు. ఇక తమ సంస్థ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు భూమిని కేటాయించాలని ఇప్పటికే.. క్యాప్‌ జెమినీ సంస్థ చంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. కొత్తగా 4 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా క్యాప్‌ జెమినీ కంపెనీ.. ఏపీలో శాశ్వత క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. క్యాప్ జెమినీ లాంటి సంస్థ విశాఖకు రానుండటంతో ఏపీకి మరిన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయని అక్కడి యువత ఆశిస్తోంది.

శివరామచారి తాటికొండ

రచయిత గురించిశివరామచారి తాటికొండశివరామచారి తాటికొండ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ట్రెండింగ్ టాపిక్స్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు, విశ్లేషణలను శివరామచారి అందిస్తుంటారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలపై ఫ్యాక్ట్‌చెక్‌ వార్తలు రాసిన అనుభవం ఉంది. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ETV సంస్థలో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్‌ (EJS) నుంచి జర్నలిజంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.… ఇంకా చదవండి