తమిళనాడు తిరుచ్చి ఎయిర్పోర్ట్ దగ్గర హైటెన్షన్ సిట్యుయేషన్ కొనసాగుతోంది. టేకాఫ్ అయిన కాసేపటికే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. హైడ్రాలిక్ సిస్టమ్లో సమస్యను గుర్తించిన వెంటనే పైలట్ ఎమెర్జెన్సీ ప్రకటించారు. ఏటీసీని అలర్ట్ చేశారు. గంటన్నర పైగా ఫ్లయిట్ గాల్లోనే చక్కర్లు కొడుతోంది. ఫ్యూయిల్ బర్నింగ్ ప్రాసెస్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
AXB-613 ఎయిర్ ఇండియా ఫ్లయిట్ తిరుచ్చి నుంచి షార్జాకు బయలుదేరుతున్న టైమ్లో సడెన్గా టెక్నికల్ సమస్య తలెత్తింది. విమానంలో 140 మంది ప్రయాణికులున్నారు. మరోవైపు ఎటీసీ నెట్ వర్క్ అలర్టయింది. ముందు జాగ్రత్తగా తిరుచ్చి ఎయిర్ పోర్టు దగ్గర 20 అంబులెన్స్లు..20 ఫైరింజన్లు సహా మెడికల్ టీమ్స్ను సిద్ధంగా ఉంచారు. భారీగా పారామెడికల్ సిబ్బంది రంగంలోకి దిగారు.