ఆ యువతి పారిశ్రామికవేత్తలు, డబ్బున్నవాళ్లు, అధికారులు, ఎన్నారైలను టార్గెట్ చేసి మాయ మాటలు చెప్పి ట్రాప్ చేసేది. ఆమె అందమైన ఫోటోలను మొగ్గులోకి దింపేది.. ఆ వెంటనే రూమ్కు పిలిపించుకుని వారికి మత్తు మందు ఇచ్చి న్యూడ్ ఫోటోలు తీసి వారి నుంచి డబ్బులు వసూలు చేసింది. యువతి బాధితులు దాదాపు 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది.. వారిలో వ్యాపారవేత్తలు, ఎన్నారైలతో పాటు మరికొందరు ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు బాధితుల్లో కొంతమంది మాత్రమే బయటకు రాగా.. మరికొందరు తమ వివరాలు చెప్పకుండా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఇటీవల మరో ట్విస్ట్ బయటపడింది. ఓ యువకుడు తనపై అత్యాచారం చేశాడంటూ 10 నెలల కిందట బాధితుడిపై మద్దిలపాలెం పోలీసులుకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఇప్పుడు ఆ యువకుడు యువతిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుకావడం విశేషం. ఈ కేసులో యువతిని పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు కోర్టులో పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.. బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. విశాఖపట్నం మాత్రమే కాదు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా బాధితులు ఉన్నట్లు సమాచారం.
అలాగే ఆ యువతితో ఎవరు హానీట్రాప్ చేయించారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్లోని డేటా కీలకంగా మారగా.. ఆమె బ్యాంక్ అకౌంట్లు, ఫోన్ పే వంటి నగదు లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. యువతి ఫోటో షూట్ల కోసం, రీల్స్ కోసం ఓ టీమ్ను ఏర్పాటు చేసుకోగా.. వారి గురించి ఆరా తీస్తున్నారు.. ఆమెతో ఉన్న గ్యాంగ్ వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. మొత్తానికి విశాఖపట్నం పోలీసులు ఈ కేసును సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు.