Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Video: బంగ్లా ఆధిక్యం 350+.. కట్‌చేస్తే.. కోపంతో గొడవకు దిగిన పాక్ ప్లేయర్లు.. ఇజ్జత్ తీసుకున్నారుగా..

18 May 2026

మళ్లీ ట్రెండ్ అవుతున్న అమ్మమ్మల కాలం నాటి ఫుడ్..? సమ్మర్‌‌లో సూపర్ బెనిఫిట్స్‌

18 May 2026

భారత్ ను లేపేద్దాం రండి.. చైనాను కోరిన పాకిస్థాన్.. చైనా షాకింగ్ రియాక్షన్..!! | pakistan Seeks Nuclear Weapons from China to Counter India: Sensational Report Creates Global Buzz

18 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ys Sharmila On Women Quota Bill,వీగిపోయింది డీలిమిటేషన్ బిల్లే.. మహిళా బిల్లు కాదు: వైఎస్ షర్మిల – ys sharmila reaction on defeat of the women reservation bill in loksabha
ఆంధ్రప్రదేశ్

Ys Sharmila On Women Quota Bill,వీగిపోయింది డీలిమిటేషన్ బిల్లే.. మహిళా బిల్లు కాదు: వైఎస్ షర్మిల – ys sharmila reaction on defeat of the women reservation bill in loksabha

.By .17 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ys Sharmila On Women Quota Bill,వీగిపోయింది డీలిమిటేషన్ బిల్లే.. మహిళా బిల్లు కాదు: వైఎస్ షర్మిల – ys sharmila reaction on defeat of the women reservation bill in loksabha
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ బిల్లు వీగిపోయింది. దీనిపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. వీగిపోయింది డీలిమిటేషన్ బిల్లే కానీ.. మహిళా బిల్లు కాదని.. మహిళా బిల్లుకు 2023లోనే ఆమోదం తెలిపినట్లు షర్మిల తెలిపారు. మహిళా రిజర్వేషన్ పేరుతో బీజేపీ చేసిన కుతంత్రాలు ఫలించలేదని.. ఇది దేశ ప్రజల విజయంగా వైఎస్ షర్మిల అభివర్ణించారు.

YS Sharmila
మహిళా రిజర్వేషన్ బిల్లుపై షర్మిల(ఫోటోలు– Samayam Telugu)
మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. 2029 నుంచి మహిళా రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టగా.. అనుకున్న మెజారిటీ రాకపోవటంతో బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ బిల్లు వీగిపోవటంపై వివిధ రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

మహిళా రిజర్వేషన్ పేరిట బీజేపీ చేసిన మాయోపాయం పారలేదంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. అక్రమ చట్టాలకు అవనిని అడ్డుపెట్టి ఆమోదించాలనే కుతంత్రం నిలబడలేదని.. సాధికారిత పేరుతో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయాలనే బీజేపీ కుయుక్తులు చెల్లలేదని పేర్కొన్నారు. ఎన్డీఏ అధర్మంపై, INDIA ధర్మయుద్ధం గెలిచిందంటూ వైఎస్ షర్మిల హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం నిలబడిందన్న షర్మిల.. ఇది భారత దేశ ప్రజల విజయంగా అభివర్ణించారు. బీజేపీ రాజకీయ దురుద్దేశ్యానికి ఇది చరమ గీతమని.. మహిళల పేరుతో రాజకీయాలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీకి చెంపపెట్టుగా షర్మిల పేర్కొన్నారు.

” వీగిపోయింది అతి గతి లేని డీలిమిటేషన్ బిల్లే తప్పా మహిళా బిల్లు కాదు. విపక్షం ఎన్నడూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదు. నారీ పేరుతో తెచ్చింది డీలిమిటేషన్ బిల్లు మాత్రమే. ఇవ్వాళ వీగిపోయింది నియోజక వర్గాల పునర్విభజన బిల్లే. ప్రతిపక్షాలు తిప్పికొట్టింది కేవలం రాజ్యాంగాన్ని మార్చే కుట్రనే. మహిళా బిల్లుకు ఆమోదం దక్కింది 2023లోనే. ప్రతిపక్షాలపై బురదజల్లడం మాని ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్ బిల్లు-2023 తక్షణం అమలు చేయాలి. బీజేపీకి మహిళలపై చిత్తశుద్ధి ఉందన్న మాటను నిరూపించుకోవాలి. 543 స్థానాలకు వెంటనే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి.” అంటూ షర్మిల డిమాండ్ చేశారు.

మరోవైపు మహిళా రిజర్వేషన్‌ చట్టం సవరణ బిల్లుపై లోక్‌సభలో శుక్రవారం ఓటింగ్ జరిగింది. ఇందులో మొత్తం 528 మంది సభ్యులు పాల్గొనగా.. బిల్లుకు అనుకూలంగా 298 మంది ఓటేశారు. వ్యతిరేకంగా 230 మంది ఓటేయటంతో.. మూడింట రెండొంతుల మెజారిటీని కేంద్రం సాధించలేకపోయింది. దీంతో బిల్లు వీగిపోయినట్లు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. దీంతో డీలిమిటేషన్ బిలు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకుంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.

వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.… ఇంకా చదవండి