ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబుతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. సచివాలయంలోని సీఎం ఛాంబర్లో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన బాలినేని.. అనేక అంశాలపై చర్చించారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు, కూటమి బలోపేతం, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇలా అనేక అంశాలపై ఇరువురూ చర్చించినట్లు తెలిసింది. మరోవైపు వైసీపీని వీడి జనసేనలో చేరిన బాలినేని సీఎం చంద్రబాబుతో భేటీ కావటం ఇదే తొలిసారి.
హైలైట్:
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం
సీఎం చంద్రబాబుతో బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ
వైసీపీని వీడి జనసేనలో చేరిన తర్వాత తొలిసారిగా సీఎంతో భేటీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. మంగళవారం రోజున సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు బాలినేని. ఈ మర్యాదపూర్వక భేటీలో ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, కూటమి బలోపేతం, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, కూటమి సమన్వయంపై పలు కీలక అంశాలపై చర్చించారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేనలో చేరిన అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.మరోవైపు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డి బంధువు అవుతారనే సంగతి తెలిసిందే. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఆ పార్టీని వీడి వైఎస్ జగన్ వైసీపీ స్థాపించినప్పటి నుంచి ఆయనతో కలిసి నడిచారు. ఈ క్రమంలోనే వైసీపీలో కీలక నేతగా ఎదిగిన బాలినేని శ్రీనివాసరెడ్డి.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగానూ వ్యవహరించారు.
అయితే 2024 ఎన్నికల్లో వైసీపీతో పాటు బాలినేని కూడా ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలోనే ఎన్నికల తర్వాత వైసీపీ అధిష్టానం తనను పట్టించుకోవడం లేదని, వైసీపీ హయాంలో కొంతమంది పెద్దలు తన ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి.. కొన్ని రోజుల తర్వాత జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు.
ఇక ఇటీవలే జనసేన పార్టీ అధిష్టానం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. స్థానిక సంస్థల ఎన్నికలు, డీ లిమిటేషన్ అంశంపై జిల్లాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసింది జనసేన . ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డికి రాయలసీమతో పాటుగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల బాధ్యతలు అప్పగించారు.
దీంతో జిల్లాల పర్యటనలు చేపట్టారు బాలినేని. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీయై.. ఏపీలో ప్రస్తుత రాజకీయాలు, కూటమి నేతల మధ్య పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. కూటమి బలోపేతం మీద ఇరువురు నేతలు సమాలోచనలు చేసినట్లు తెలిసింది.
రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.
వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.… ఇంకా చదవండి