Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

జూన్ 6 రాశిఫలాలు: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి ఇలా..

6 June 2026

Bengaluru Hotel Businessman Donation To Ttd,హోటల్ వ్యాపారంలో భారీగా లాభాలు.. తిరుమల శ్రీవారికి బెంగళూరు భక్తుడి భారీ విరాళం – bengaluru devotee sri vinayaka enterprises md muniswamy narayana gowd donated rs 1 crore to ttd sv annaprasadam trust

6 June 2026

Andhra Pradesh Rains,ఏపీలో మూడు రోజుల పాటూ వర్షాలు.. ఈ జిల్లాల్లోనే, అక్కడ మాత్రం ఎండలు తప్పవు – apsdma varied weather alert for andhra pradesh people with rains and temperatures in these districts today

6 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Gaadarada Om Shivashakti Peetham,అర్చకులు కావలెను.. రూ.20 వేలు జీతం, డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్.. జనసేన ఎమ్మెల్యే ప్రకటన – janasena mla battula balaramakrishna announcement for priests for om shivashakti peetham in gaadarada of east godavari
ఆంధ్రప్రదేశ్

Gaadarada Om Shivashakti Peetham,అర్చకులు కావలెను.. రూ.20 వేలు జీతం, డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్.. జనసేన ఎమ్మెల్యే ప్రకటన – janasena mla battula balaramakrishna announcement for priests for om shivashakti peetham in gaadarada of east godavari

.By .31 May 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Gaadarada Om Shivashakti Peetham,అర్చకులు కావలెను.. రూ.20 వేలు జీతం, డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్.. జనసేన ఎమ్మెల్యే ప్రకటన – janasena mla battula balaramakrishna announcement for priests for om shivashakti peetham in gaadarada of east godavari
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తూర్పుగోదావరి జిల్లా గాదరాడ ఓం శివశక్తి పీఠంలో సేవ చేయడానికి అర్చక స్వాములు కావాలంటూ జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రకటన ఇచ్చారు. నెలకు రూ.20 వేలు గౌరవ వేతనంతో పాటుగా, డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆసక్తిగలవారు తమ వివరాలు పంపించాలంటూ ఫోన్ నంబర్, మెయిల్ కూడా జతచేస్తూ ట్వీట్ చేశారు. ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హైలైట్:

  • అర్చక స్వాములు కావాలి
  • జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రకటన
  • నెలకు రూ.20 వేలు జీతం
Gaadarada
గాదరాడ ఓం శివశక్తి పీఠం(ఫోటోలు– Samayam Telugu)
అర్చకులు కావాలంటూ రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చేసిన ప్రకటన.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలోని ఓం శివశక్తి పీఠంలో శైవ, వైష్ణవ, మహాశక్తి ఆలయంలో సేవ చేయడానికి అర్చకులు కావాలంటూ ఆయన ప్రకటన ఇచ్చారు. అర్హత, అనుభవం ఆధారంగా నెలకు రూ.20 వేలు గౌరవ వేతనం, అలాగే డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్, వసతి, ఇదర సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించారు. ఆసక్తిగల వారు తమ వివరాలతో వారం రోజుల్లోగా సంప్రదించాలంటూ ఫోన్ నంబర్, ఈ మెయిల్ పంచుకున్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

మరోవైపు గాదరాడలో దేశంలోని ప్రధాన శైవ, వైష్ణవ ఆలయాలు, శక్తిపీఠాల నమూనాలు కొలువయ్యాయి. ఓం శివశక్తి పీఠం పేరుతో బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులు దీనిని ఏర్పాటు చేయించారు. స్వగ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన బలరామకృష్ణ.. ఊరిలో చెప్పుకోదగ్గ ఆలయం లేదని భావించారు. ఊరి ప్రజలు గర్వపడేలా ఓ గుడిని నిర్మించాలని సంకల్పించారు. ఏ ఆలయాన్ని నిర్మించాలనే దానిపై చాలా మంది మఠాధిపతులు, గురువుల సలహాలు తీసుకున్నారు. కొంతమంది శివాలయం, మరికొందరు వైష్ణవ క్షేత్రం, ఇంకొందరు అమ్మవారికి ఆలయం నిర్మించాలని సూచించారట.

దీంతో అందరి సలహాలను పరిగణనలోకి తీసుకున్న బత్తుల బలరామకృష్ణ.. నాలుగేళ్లు శ్రమించి ఓం శివశక్తి పీఠం పేరుతో 54 ఆలయాలను ఒకేచోట నిర్మింపజేశారు.యాభై నాలుగు దేవాలయాలలో.. ఎనభై నాలుగు దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించారు. కైలాస మహాక్షేత్రాలుగా (21), శక్తిపీఠాలుగా (18), వైకుంఠ క్షేత్రాలుగా (15) విభజించారు. సౌరాష్ట్రలోని సోమనాథ లింగం, శ్రీశైలం మల్లికార్జున లింగం, ఉజ్జయిని మహాకాళేశ్వరలింగం…ఇలా పన్నెండు లింగాలూ కొలువయ్యాయి. అలాగే సద్గురు సాయిబాబా మందిరం, భద్రాది, అన్నవరం, యాదాద్రి, అరసవల్లి నమూనా ఆలయాలను ఏర్పాటు చేయించారు.

శైవ క్షేత్రాలలో శైవాగమం ప్రకారం.. వైష్ణవ ఆలయాల్లో వైఖాసన ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ ఆలయంలో పనిచేసేందుకు అర్చక స్వాములు కావాలంటూ బత్తుల బలరామకృష్ణ ప్రకటన ఇచ్చారు. ఆసక్తి గలవారు తమ వివరాలు తెలియజేసేందుకు వారం రోజుల సమయం ఉంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.

వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.… ఇంకా చదవండి