Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

10 June 2026

స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?

10 June 2026

Andhra Vankaya Vepudu: 15 నిమిషాల్లో నోరూరించే ఆంధ్రా స్టైల్ ‘వంకాయ వేపుడు’.. అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్ ఇదీ!

10 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Talliki Vandanam Scheme 2026 Status Check,తల్లికి వందనం పథకానికి అర్హుల జాబితా.. మీ పేరు ఉందో, లేదో ఇలా చెక్ చేస్కోండి – talliki vandanam scheme 2026 beneficiaries can status check details here
ఆంధ్రప్రదేశ్

Talliki Vandanam Scheme 2026 Status Check,తల్లికి వందనం పథకానికి అర్హుల జాబితా.. మీ పేరు ఉందో, లేదో ఇలా చెక్ చేస్కోండి – talliki vandanam scheme 2026 beneficiaries can status check details here

.By .1 June 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Talliki Vandanam Scheme 2026 Status Check,తల్లికి వందనం పథకానికి అర్హుల జాబితా.. మీ పేరు ఉందో, లేదో ఇలా చెక్ చేస్కోండి – talliki vandanam scheme 2026 beneficiaries can status check details here
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Talliki Vandanam Scheme 2026 Beneficiaries Status Check: ఏపీలో ప్రభుత్వం స్కూల్, ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందన పథకం కింద డబ్బులు ఇస్తోంది. ఈ ఏడాది కూడా డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ముందుగానే అర్హుల జాబితాలను సిద్దం చేసింది.. విద్యార్థులు అర్హుల జాబితాను చెక్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ సాయంతో తల్లికి వందనం పథకానికి అర్హులా, కాదా.. అసలు పేరు ఉందో, లేదో తెలుసుకోవచ్చు.

హైలైట్:

  • ఏపీలో తల్లికి వందనం పథకం 2026
  • తల్లులల అకౌంట్‌లోకి త్వరలో డబ్బులు
  • అర్హుల జాబితాలో మీ పేరు చెక్ చేస్కోండి
Talliki Vandanam Scheme 2026
తల్లికి వందన పథకం స్టేటస్ చెక్ 2026(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హమీల్లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి ఏటా స్కూల్ విద్యార్థులకు, ఇంటర్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున ఇస్తున్నారు.. ఇందులో రూ.13వేలు విద్యార్థుల తల్లులల అకౌంట్‌లలో జమ చేస్తుండగా.. మరో రూ.2వేలు మాత్రం స్కూల్ నిర్వహణ కోసం ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా విద్యార్థులకు ఈ డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. తల్లికి వందన పథకానికి సంబంధించి అర్హులుమో కాదో, వర్తిస్తుందో లేదోనని సందేహం అందరిలో ఉంది. ఒకవేళ అర్హులమైతే సమచారం ఎలా తెలుసుకోవాలో తెలియక ఇబ్బందిపడుతున్నారు. విద్యార్థులు తల్లికి వందనం పథకానికి అర్హులో, కాదో తెలుసుకోవడానికి ఎవర్నీ సంప్రదించాల్సిన అవసరం లేదు.. వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ సాయంతో తల్లికి వందనం పథకానికి అర్హులో, కాదో వివరాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులు www.bm.sgsw.ap.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి స్కీమ్‌ ఎలిజిబిలిటీ ఆప్షన్ క్లిక్ చేయగానే మరో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ లబ్ధిదారుల ఆధార్‌ నంబరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పథకం, ఏ సంవత్సరమో సెలక్ట్ చేసిన తర్వాత గెట్‌ డిటైల్స్‌ ఆప్షన్ క్లియ్ చేయాలి. అప్పుడు ఆధార్‌ లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ నంబరుతో పాటుగా కింద ఉండే క్యాప్చా ఎంటర్ చేస్తే లబ్ధిదారుల సమాచారం వస్తుంది. ఆ వివరాలను చెక్ చేసుకుని.. ఒకవేళ ఏవైనా లోపాలు ఉంటే సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఒకవేళ ఏవైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించాలని నర్సీపట్నం సూచిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం సాంకేతిక సమస్యలతో పాటుగా మ్యాపింగ్‌ ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది. విద్యార్థుల తల్లుల బ్యాంకు అకౌంట్, మొబైల్ నంబర్ ఆధా‌ర్‌‌తో లింక్ చేయడం తప్పనిసరి. అలాగే కుటుంబ సభ్యులు మ్యాపింగ్‌ పూర్తయితేనే తల్లికి వందనం డబ్బులు అందుతాయి. అలాగే విద్యార్థులు, తల్లిదండ్రులు దగ్గరలోని సచివాలయానికి వెళ్తే అక్కడి సిబ్బంది పరిశీలించి సమస్యను పరిష్కరిస్తారు. ఒకవేళ విద్యార్థుల తల్లుల బ్యాంకు అకౌంట్, మొబైల్ నంబర్ ఆధా‌ర్‌‌తో లింక్ చేయకపోతే వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణలు రాస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తిరుమల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. తెలంగాణ, జాతీయ వార్తలు సైతం ఆయన రాస్తుంటారు. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. 2024 ఏపీ ఎన్నికల కవరేజీలో అత్యుత్తమ పనితీరు కనబర్చినదుకు గానూ తిరుమల బాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.

తిరుమల బాబు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ, సాక్షి మీడియా, టీవీ5 సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, బుక్స్ చదడానికి ఆయన ఇష్టపడతారు.… ఇంకా చదవండి