Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Health Tips : ఈ చేప రుచి అదుర్స్.. కొరమీను, రావును మించిన పోషకాలు.. ధర కూడా తక్కువే.. ఒకసారి ట్రై చేయండి

6 June 2026

అరుదైన గ్రహాల కలయిక.. వీరికి గోల్డెన్ టైం స్టార్ట్.. జీవితాన్ని మార్చే శుభ సమయం ఇదే

6 June 2026

Video: రోడ్డుపై ఓ మూటతో నిల్చున్న వ్యక్తి.. ఆటోను ఆపి డ్రైవర్‌ను పిలిచాడు.. సీన్ కట్‌చేస్తే.. ట్విస్ట్ మాములుగా లేదుగా..!

6 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Govt Excellence Centers Neet Jee Coaching,ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. ఇంటర్‌తో పాటుగా నీట్, జేఈఈ శిక్షణ ఉచితం.. పూర్తి వివరాలివే – andhra pradesh government to start excellence centers for students for neet jee coaching
ఆంధ్రప్రదేశ్

Ap Govt Excellence Centers Neet Jee Coaching,ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. ఇంటర్‌తో పాటుగా నీట్, జేఈఈ శిక్షణ ఉచితం.. పూర్తి వివరాలివే – andhra pradesh government to start excellence centers for students for neet jee coaching

.By .1 June 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Govt Excellence Centers Neet Jee Coaching,ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. ఇంటర్‌తో పాటుగా నీట్, జేఈఈ శిక్షణ ఉచితం.. పూర్తి వివరాలివే – andhra pradesh government to start excellence centers for students for neet jee coaching
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Govt Start Excellence Centers For Neet Jee Coaching: ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యను అందించాలని నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఈ ఏడాది కొత్తగా 7 ఎక్స్‌లెన్స్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ స్పెషల్ సెంటర్లలో ఇంటర్‌తో పాటు జేఈఈ, నీట్‌కు ఉచితంగా శిక్షణ ఇస్తారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

హైలైట్:

  • ఏపీలో విద్యార్థుల కోసం ఎక్స్‌లెన్స్ సెంటర్లు
  • ఇంటర్‌తో పాటుగా ఉచితంగా నీట్, జేఈఈకి శిక్షణ
  • మొత్తం ఏడు సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్లాన్
Ap Govt Neet Jee Coaching Centers
ఏపీలో నీట్ జేఈఈ కోసం ఎక్స్‌లెన్స్ సెంటర్లు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు తీపికబురు చెప్పింది. ఐఐటీ, వైద్య విద్య, మిగిలిన జాతీయస్థాయి విద్యాసంస్థల్లో సీట్లు సంపాదించేలా కార్పొరేట్ విద్యను అందించనున్నారు. ఈ మేరకు 2026-27 విద్యాసంవత్సరం నుంచి కొత్తగా ఏడు ఎక్స్‌లెన్స్‌ సెంటర్లను ప్రారంభించనున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రారంభించే ఈ ఎక్స్‌లెన్స్ సెంటర్ల నిర్వహణను టెండర్ల ద్వారా ఎంపిక చేసి కార్పొరేట్‌ విద్యాసంస్థలకు అప్పగించనున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ సెంటర్లను పర్యవేక్షిస్తుంది.. ఈ సెటర్‌లలో ఇంటర్‌తో పాటుగా జేఈఈ, నీట్‌కు ఉచిత శిక్షణ అందిస్తారు.

ఇప్పటికే జేఈఈ, నీట్‌ కోసం ఎస్సీ విద్యార్థులకు ప్రస్తుతం వారికి ఉన్న గురుకులాల్లోనే పదింటిని ఎంపికచేసి ప్రత్యేకంగా ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈ ఏడాది నుంచి ఎస్టీ, బీసీ విద్యార్థులకూ కూడా అమలు చేయనున్నారు. ఈ మొత్తం ఏడు సెంటర్లలో ఎస్సీ విద్యార్థులకు 3 సెంటర్లు, బీసీలకు 2, ఎస్టీలకు 2 సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో కొత్త సెంటర్లను ఎస్సీ విద్యార్థులకు ఏర్పాటు చేయనున్నారు. అనంతపురం/శ్రీసత్యసాయి, రాజమహేంద్రవరంలో బీసీ విద్యార్థులకు ఏర్పాటు చేస్తారు. ఉత్తరాంధ్రలో బీసీ విద్యార్థులకు మరో కేంద్రాన్ని ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నారు. విశాఖపట్నం, రాయలసీమలోని మరో ప్రాంతంలో ఎస్టీ విద్యార్థులకు సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.

ఏపీ ప్రభుత్వ కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఈ ఎక్స్‌లెన్స్‌ సెంటర్లలో గరిష్ఠంగా 4,200 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో సెంటర్‌లో 500 నుంచి 600మంది చొప్పున ఎంపిక చేయనున్నారు. విద్యార్థుల్ని పదోతరగతి మార్కుల ప్రాతిపదికగా ప్రవేశపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఎక్స్‌లెన్స్ సెంటర్లలో ఈ ఏడాది అందుబాటులోకి తీసుకొచ్చేందు అవసరమైన భవన సముదాయాన్ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఒకవేళ భవనాలు దొరక్కపోతే ప్రస్తుతం ఉన్న గురుకులాల్లోని విద్యార్థులను మిగిలిన చోట్లకు సర్దుబాటు చేసి అక్కడ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ ఏర్పాటుచేయాలనే ఆలోచనలో ఉన్నారు. కొన్ని ఎక్స్‌లెన్స్ సెంటర్లను కో ఎడ్యుకేషన్‌గా నిర్వహించనున్నారు. ఒకవేళ వీలుకాని పక్షంలో బాలికల కోసం ప్రత్యేకంగా మరో సెంటర్ ఏర్పాటు చేయనున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణలు రాస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తిరుమల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. తెలంగాణ, జాతీయ వార్తలు సైతం ఆయన రాస్తుంటారు. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. 2024 ఏపీ ఎన్నికల కవరేజీలో అత్యుత్తమ పనితీరు కనబర్చినదుకు గానూ తిరుమల బాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.

తిరుమల బాబు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ, సాక్షి మీడియా, టీవీ5 సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, బుక్స్ చదడానికి ఆయన ఇష్టపడతారు.… ఇంకా చదవండి